ETV Bharat / state

పెళ్లిపందిట్లో వరుడిపై యాసిడ్ పోసిన యువతి - Girlfriend Acid Attack on Young Man

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 11, 2024, 7:26 PM IST

Updated : Aug 11, 2024, 10:23 PM IST

Girlfriend Acid Attack on Young Man In Annamaiya District : పెళ్లి చేసుకుంటున్న వరుడిపై ప్రియురాలు యాసిడ్​తో దాడి చేసిన ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ క్రమంలో పెళ్లి ఆగిపోయింది. ఈ విషయంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ACID ATTACK ON YOUNG MAN
GIRLFRIEND ACID ATTACK ON YOUNG MAN (ETV Bharat)

Girlfriend Acid Attack on Young Man In AP : బంధు మిత్రులతో కల్యాణ వేదిక కళకళలాడుతోంది. కాసేపట్లో వధూవరులిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారు. ఇంతలో అకస్మాత్తుగా శివంగిలా ఓ యువతి అక్కడకు దూసుకొచ్చింది. నాకు అన్యాయం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అంటూ తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌, కత్తితో అతడిపై బీభత్సం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా పెళ్లి మండపం రణరంగంలా మారింది. అప్పటివరకూ పెళ్లి సందడిలో అందరూ ఉండగా అరుపులు, కేకలతో ఆ ప్రదేశం దద్దరిల్లింది. ఏం జరుగుతుందో అర్థం కాక పెళ్లికి వచ్చిన బంధువులంతా నిర్ఘాంతపోయారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరులో ఆదివారం జరిగింది.

ఇదీ జరిగింది : రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్‌ బాషా తనతో పదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తిరుపతికి చెందిన ఓ యువతి ఆరోపించింది. బాషా కొద్దిరోజులుగా కనిపించకుండా తిరుగుతుండటంతో అనుమానం వచ్చిన ఆ యువతి అతన్ని వెతుక్కుంటూ రైల్వే కోడూరుకు వచ్చి ఆరా తీసింది. ఈ క్రమంలోనే ఆదివారం నందలూరులో బాషా వివాహం జరగనుందని తెలుసుకొని వెంటనే నేరుగా వివాహం జరిగే షాదీ ఖానా వద్దకు చేరుకుంది. తనను మోసం చేసిన విషయంపై వరుడిని నిలదీసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

వరుడిపై యాసిడ్​ దాడికి పాల్పడిన యువతి : దీంతో ఆమె వెంట తెచ్చుకున్న యాసిడ్‌ ద్రావణం, కత్తితో బాషాపై దాడికి యత్నించింది సదరు యువతి. ఈ క్రమంలో అక్కడున్న యువకుడి బంధువులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తోపులాటలో వరుడి పక్కనే ఉన్న కరిష్మా అనే మహిళ ముఖంపై యాసిడ్‌ పడి గాయాలయ్యాయి. ఈ ఘటనతో కోపోద్రిక్తుడైన బాషా కత్తితో ప్రియురాలు వీపు, భుజంపై బలంగా పొడవడంతో గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరు మహిళల్ని స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి వైద్యసేవలందిస్తున్నారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు నిర్ధరించారు.

పోలీసులను ఆశ్రయించిన వదువు తరఫు బంధువులు : తమకు న్యాయం చేయాలని వధువు తరఫు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీస్​ స్టేషన్‌లో ఆ పంచాయితీ కొనసాగుతోంది. ఇరు వర్గాలిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మరో వైపు వరుడి ప్రియురాలు మీడియా ప్రతినిధులతో మాట్లాడకుండా ఆమెను పోలీసులు ఓ గదిలో నిర్బంధించారు.

Young Man Attacked Woman : ప్రేమ పేరుతో యువతిపై దాడి.. చికిత్స పొందుతూ చనిపోయిన యువతి...

ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతి గొంతు కోసి..

Girlfriend Acid Attack on Young Man In AP : బంధు మిత్రులతో కల్యాణ వేదిక కళకళలాడుతోంది. కాసేపట్లో వధూవరులిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారు. ఇంతలో అకస్మాత్తుగా శివంగిలా ఓ యువతి అక్కడకు దూసుకొచ్చింది. నాకు అన్యాయం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అంటూ తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌, కత్తితో అతడిపై బీభత్సం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా పెళ్లి మండపం రణరంగంలా మారింది. అప్పటివరకూ పెళ్లి సందడిలో అందరూ ఉండగా అరుపులు, కేకలతో ఆ ప్రదేశం దద్దరిల్లింది. ఏం జరుగుతుందో అర్థం కాక పెళ్లికి వచ్చిన బంధువులంతా నిర్ఘాంతపోయారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరులో ఆదివారం జరిగింది.

ఇదీ జరిగింది : రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్‌ బాషా తనతో పదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తిరుపతికి చెందిన ఓ యువతి ఆరోపించింది. బాషా కొద్దిరోజులుగా కనిపించకుండా తిరుగుతుండటంతో అనుమానం వచ్చిన ఆ యువతి అతన్ని వెతుక్కుంటూ రైల్వే కోడూరుకు వచ్చి ఆరా తీసింది. ఈ క్రమంలోనే ఆదివారం నందలూరులో బాషా వివాహం జరగనుందని తెలుసుకొని వెంటనే నేరుగా వివాహం జరిగే షాదీ ఖానా వద్దకు చేరుకుంది. తనను మోసం చేసిన విషయంపై వరుడిని నిలదీసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

వరుడిపై యాసిడ్​ దాడికి పాల్పడిన యువతి : దీంతో ఆమె వెంట తెచ్చుకున్న యాసిడ్‌ ద్రావణం, కత్తితో బాషాపై దాడికి యత్నించింది సదరు యువతి. ఈ క్రమంలో అక్కడున్న యువకుడి బంధువులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తోపులాటలో వరుడి పక్కనే ఉన్న కరిష్మా అనే మహిళ ముఖంపై యాసిడ్‌ పడి గాయాలయ్యాయి. ఈ ఘటనతో కోపోద్రిక్తుడైన బాషా కత్తితో ప్రియురాలు వీపు, భుజంపై బలంగా పొడవడంతో గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరు మహిళల్ని స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి వైద్యసేవలందిస్తున్నారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు నిర్ధరించారు.

పోలీసులను ఆశ్రయించిన వదువు తరఫు బంధువులు : తమకు న్యాయం చేయాలని వధువు తరఫు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీస్​ స్టేషన్‌లో ఆ పంచాయితీ కొనసాగుతోంది. ఇరు వర్గాలిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మరో వైపు వరుడి ప్రియురాలు మీడియా ప్రతినిధులతో మాట్లాడకుండా ఆమెను పోలీసులు ఓ గదిలో నిర్బంధించారు.

Young Man Attacked Woman : ప్రేమ పేరుతో యువతిపై దాడి.. చికిత్స పొందుతూ చనిపోయిన యువతి...

ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతి గొంతు కోసి..

Last Updated : Aug 11, 2024, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.