ETV Bharat / state

వైఎస్సార్సీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా - జనసేనలో చేరనున్నట్లు వెల్లడి - BALINENI SRINIVAS REDDY RESIGN

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2024, 4:59 PM IST

Updated : 24 hours ago

Balineni Srinivas Reddy Resigned to YSRCP: తనకు ప్రాధాన్యం ఇవ్వని పార్టీలో కొనసాగలేనంటూ నేరుగా ఆ పార్టీ అధినేత జగన్​కే చెప్పిన బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నంత పని చేశారు. నిన్నామొన్నటి వరకు ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ పెద్దన్నలా వ్యవహరించిన బాలినేని ఇప్పుడు పార్టీకి షాక్​ ఇచ్చారు. వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు.

balineni_srinivas_reddy_resign
balineni_srinivas_reddy_resign (ETV Bharat)

Balineni Srinivas Reddy Resigned to YSRCP: నిన్నమొన్నటి వరకు ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ పెద్దన్నలా వ్యవహరించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు షాక్​ ఇచ్చారు. వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే తనకు ప్రాధాన్యం ఇవ్వని పార్టీలో కొనసాగలేనంటూ నేరుగా ఆ పార్టీ అధినేత జగన్​కే చెప్పిన బాలినేని అన్నంత పని చేశారు. తన దారి తాను చూసుకుంటూ పార్టీకి రాజీనామా చేసేశారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను జగన్‌కు పంపించారు.

బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా
బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా (ETV Bharat)

జగన్‌ విధానాలు నచ్చకే వైఎస్సార్​సీపీకి రాజీనామా చేస్తున్నట్లు బాలినేని తెలిపారు. గత కొన్నిరోజులుగా వైఎస్సార్​సీపీ అధిష్ఠానం వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నానని తెలిపారు. జనసేనలో చేరబోతున్నట్లు తెలిపిన బాలినేని గురువారం ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలవబోతున్నట్లు వివరించారు.

రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు. వైఎస్సార్​ కుటుంబానికి సన్నిహితుడుని అయినా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని రాజకీయ నిర్ణయాలు సరిగా లేనపుడు ఖచ్చితంగా అడ్డుకున్నా. ఎలాంటి మొహమాటాలకు నేను పోలేదు. అంతిమంగా ప్రజాతీర్పుని ఎవరైనా హుందాగా తీసుకోవాల్సింది. నేను ప్రజా నాయకుడిని, ప్రజల తీర్పే నాకు శిరోధార్యం, రాజకీయాల్లో భాష గౌరవంగా హుందాగా ఉండాలని నమ్మే నిఖార్సైన రాజకీయం చేశాను, కారణం లక్షల మంది ప్రజలు మనల్ని ఆదర్శంగా తీసుకున్నపుడు అన్ని విధాలా విలువలను కాపాడాల్సిన బాధ్యత మనదే.- బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి

Balineni Join Janasena : సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలును వీడారు. హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఓటమి బాధలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ పార్టీ అధినేత జగన్​ను కలవలేదు. పార్టీ సమావేశాలకూ దూరంగా ఉంటూ వచ్చారు. మధ్యలో ఒకసారి ఒంగోలు వచ్చి తన రాజకీయ ప్రత్యర్థి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై విమర్శలు చేశారు. ఆ తర్వాత రోజే మళ్లీ ఒంగోలును వీడారు. వైఎస్సార్సీపీని వీడి వెళ్తున్న కార్పొరేటర్లనూ వారించే ప్రయత్నం చేయలేదు.

రుషికొండపై కాటేజీలు కూల్చివేత - విచారణ అధికారిగా మాజీ మంత్రి రోజా ఓఎస్డీ - Rushikonda Cottages Demolition

వైఎస్సార్సీపీలో కాకరేపుతున్న బాలినేని వ్యాఖ్యలు - జగన్‌ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం - Balineni Fires on YS Jagan

Balineni Srinivas Reddy Resigned to YSRCP: నిన్నమొన్నటి వరకు ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ పెద్దన్నలా వ్యవహరించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు షాక్​ ఇచ్చారు. వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే తనకు ప్రాధాన్యం ఇవ్వని పార్టీలో కొనసాగలేనంటూ నేరుగా ఆ పార్టీ అధినేత జగన్​కే చెప్పిన బాలినేని అన్నంత పని చేశారు. తన దారి తాను చూసుకుంటూ పార్టీకి రాజీనామా చేసేశారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను జగన్‌కు పంపించారు.

బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా
బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా (ETV Bharat)

జగన్‌ విధానాలు నచ్చకే వైఎస్సార్​సీపీకి రాజీనామా చేస్తున్నట్లు బాలినేని తెలిపారు. గత కొన్నిరోజులుగా వైఎస్సార్​సీపీ అధిష్ఠానం వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నానని తెలిపారు. జనసేనలో చేరబోతున్నట్లు తెలిపిన బాలినేని గురువారం ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలవబోతున్నట్లు వివరించారు.

రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు. వైఎస్సార్​ కుటుంబానికి సన్నిహితుడుని అయినా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని రాజకీయ నిర్ణయాలు సరిగా లేనపుడు ఖచ్చితంగా అడ్డుకున్నా. ఎలాంటి మొహమాటాలకు నేను పోలేదు. అంతిమంగా ప్రజాతీర్పుని ఎవరైనా హుందాగా తీసుకోవాల్సింది. నేను ప్రజా నాయకుడిని, ప్రజల తీర్పే నాకు శిరోధార్యం, రాజకీయాల్లో భాష గౌరవంగా హుందాగా ఉండాలని నమ్మే నిఖార్సైన రాజకీయం చేశాను, కారణం లక్షల మంది ప్రజలు మనల్ని ఆదర్శంగా తీసుకున్నపుడు అన్ని విధాలా విలువలను కాపాడాల్సిన బాధ్యత మనదే.- బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి

Balineni Join Janasena : సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలును వీడారు. హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఓటమి బాధలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ పార్టీ అధినేత జగన్​ను కలవలేదు. పార్టీ సమావేశాలకూ దూరంగా ఉంటూ వచ్చారు. మధ్యలో ఒకసారి ఒంగోలు వచ్చి తన రాజకీయ ప్రత్యర్థి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై విమర్శలు చేశారు. ఆ తర్వాత రోజే మళ్లీ ఒంగోలును వీడారు. వైఎస్సార్సీపీని వీడి వెళ్తున్న కార్పొరేటర్లనూ వారించే ప్రయత్నం చేయలేదు.

రుషికొండపై కాటేజీలు కూల్చివేత - విచారణ అధికారిగా మాజీ మంత్రి రోజా ఓఎస్డీ - Rushikonda Cottages Demolition

వైఎస్సార్సీపీలో కాకరేపుతున్న బాలినేని వ్యాఖ్యలు - జగన్‌ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం - Balineni Fires on YS Jagan

Last Updated : 24 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.