ETV Bharat / state

46.4 అడుగులను దాటి ప్రవహిస్తున్న గోదావరి - త్వరలోనే రెండో ప్రమాద హెచ్చరిక! - Godavari Water Level today

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 21, 2024, 8:12 PM IST

Updated : Jul 22, 2024, 6:45 AM IST

Godavari Water Level at Bhadrachalam Today : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 46.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నీటిమట్టం క్రమంగా పెరుగుతుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. నీటి మట్టం అంతకంతకు నీటి ప్రవాహం పెరగడంతో త్వరలోనే రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు.

Godavari Water Level
Godavari Water Level (ETV Bharat)

Godavari Water Level Rises at Bhadrachalam : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు, ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 46.4 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశించారు. నీటిమట్టం పెరగడంతో గోదావరి నది స్నానఘట్టాల ప్రాంతంలో మెట్లు వరద నీటిలో మునిగిపోతున్నాయి. వరద నీరు పెరగడంతో మత్స్యకారులు, ప్రజలు గోదావరి పరివాహక ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని పోలీసు అధికారులు హెచ్చరికలు పంపారు. నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుండడంతో అధికారులు త్వరలోనే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు.

ఉదయం 7 గంటలకు 37 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం, మధ్యాహ్నం 1 గంటకు 39.5 అడుగులకు చేరుకుంది. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో 40.5 అడుగులకు చేరుకుంది. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు 41.03 అడుగులకు చేరడంతో, 8.61 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రం 6 గంటలకు 41.09 అడుగులకు చేరిన నీటిమట్టంతో 8.85 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు వదిలారు. సాయంత్రం 8 గంటల వరకు 43.6 అడుగులకు చేరి మొదటి ప్రమాద స్థాయిని దాటి గోదావరి నీరు ప్రవహిస్తోంది.

ఎడతెరిపి లేని వానలతో కొత్తందం సంతరించుకున్న జలపాతాలు - మీరూ ఓ లుక్కేయండి - Flood Flow at Telangana Waterfalls

భద్రాచలం వద్ద సుమారు తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. మరలా సాయంత్రం 9.30 గంటలకు 44.4 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ పేర్కొంది. తాజాగా 22వ తేదీ ఉదయం వరకూ నీటిమట్టం 46.4 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు.

ఏపీలోని విలీన మండలాలకు నిలిచిన రాకపోకలు : భద్రాచలం నుంచి ఏపీలోని విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మురుమూరు వద్ద రహదారిపైకి వరద రావడంతో రాకపోకలు నిలిచాయి. కూనవరం, వీఆర్​పురం, చింతూరు, ఎట్టపాక మండలంలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం ఎగువన ఉన్న చర్ల మండలంలోని తాళిపేరు జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ జలాశయం 25 గేట్లను ఎత్తి నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు.

అలాగే దుమ్ముగూడెం మండలం వద్ద ఉన్న గుబ్బల మంగి వాగు, సీత వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. గోదావరి దిగువన ఉన్న ఉపనది శబరి పోటెత్తడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం తక్కువ వేగంతో కిందకు వెళుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పాటు దిగువన ఉన్న వరద పోటు వల్ల భద్రాచలం వద్ద నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న వరద ప్రవాహం - 85 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

Godavari Water Level Rises at Bhadrachalam : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు, ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 46.4 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశించారు. నీటిమట్టం పెరగడంతో గోదావరి నది స్నానఘట్టాల ప్రాంతంలో మెట్లు వరద నీటిలో మునిగిపోతున్నాయి. వరద నీరు పెరగడంతో మత్స్యకారులు, ప్రజలు గోదావరి పరివాహక ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని పోలీసు అధికారులు హెచ్చరికలు పంపారు. నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుండడంతో అధికారులు త్వరలోనే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు.

ఉదయం 7 గంటలకు 37 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం, మధ్యాహ్నం 1 గంటకు 39.5 అడుగులకు చేరుకుంది. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో 40.5 అడుగులకు చేరుకుంది. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు 41.03 అడుగులకు చేరడంతో, 8.61 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రం 6 గంటలకు 41.09 అడుగులకు చేరిన నీటిమట్టంతో 8.85 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు వదిలారు. సాయంత్రం 8 గంటల వరకు 43.6 అడుగులకు చేరి మొదటి ప్రమాద స్థాయిని దాటి గోదావరి నీరు ప్రవహిస్తోంది.

ఎడతెరిపి లేని వానలతో కొత్తందం సంతరించుకున్న జలపాతాలు - మీరూ ఓ లుక్కేయండి - Flood Flow at Telangana Waterfalls

భద్రాచలం వద్ద సుమారు తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. మరలా సాయంత్రం 9.30 గంటలకు 44.4 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ పేర్కొంది. తాజాగా 22వ తేదీ ఉదయం వరకూ నీటిమట్టం 46.4 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు.

ఏపీలోని విలీన మండలాలకు నిలిచిన రాకపోకలు : భద్రాచలం నుంచి ఏపీలోని విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మురుమూరు వద్ద రహదారిపైకి వరద రావడంతో రాకపోకలు నిలిచాయి. కూనవరం, వీఆర్​పురం, చింతూరు, ఎట్టపాక మండలంలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం ఎగువన ఉన్న చర్ల మండలంలోని తాళిపేరు జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ జలాశయం 25 గేట్లను ఎత్తి నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు.

అలాగే దుమ్ముగూడెం మండలం వద్ద ఉన్న గుబ్బల మంగి వాగు, సీత వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. గోదావరి దిగువన ఉన్న ఉపనది శబరి పోటెత్తడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం తక్కువ వేగంతో కిందకు వెళుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పాటు దిగువన ఉన్న వరద పోటు వల్ల భద్రాచలం వద్ద నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న వరద ప్రవాహం - 85 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

Last Updated : Jul 22, 2024, 6:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.