ETV Bharat / state

హైదరాబాద్​లో పెరుగుతున్న ఫెడెక్స్​ మోసాలు - కొరియర్​ పంపకుండానే ఫోన్‌లు చేసి బెదిరింపులు - FEDEX scams IN hyderabad

హైదరాబాద్​లో పార్సిల్‌ పేరిట రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు - నేరం జరిగిన గంటలోపే 1930కు ఫిర్యాదు చేయాలంటున్న నిపుణులు

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Fedex Frauds In Telangana
Fedex Frauds In Telangana (ETV Bharat)

FedEx Scams Increase In Hyderabad : దొంగతనం అంటే తాళం పగులగొట్టాల్సిన అవసరం లేదు. కిటికీఊచలూ తొలగించనక్కర్లేదు. ఖాతాల్లో డబ్బుంటే చాలంటున్నారు సైబర్‌ నేరగాళ్లు. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతూ అమాయకులను లూటీ చేస్తున్నారు. కళ్లు మూసి తెరిచేలోపు ఖాతాను ఖాళీ చేస్తున్నారు. ఫెడెక్స్ పార్సిల్ పేరిట ఇప్పటికే కోట్లు కాజేశారు. అయనా వారి ఆగడాలు ఆగడం లేదు. ఎలాంటి పార్శిల్‌ పంపకున్నా అందులో నిషేధిత పధార్థాలు ఉన్నాయంటూ భయపెడుతూ డబ్బులు గుంజుతున్నారు. తాజాగా సికింద్రాబాద్‌కు చెందిన 62 ఏళ్ల వృద్ధుడికి ఇదే అనుభవం ఎదురైంది. ఇరాన్‌కు పంపిన కొరియర్‌లో 20 కిలోల డయాబెటిక్ డ్రగ్స్‌తో పాటు 100 గ్రాముల ఎండీఎంఏ ఉందని సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ వచ్చింది.

ఏ పార్సిల్ పంపలేదని చెప్పినా వినకుండా సైబర్ నేరస్థులు వీడియో కాల్‌చేసి 6 గంటలపాటు పోలీస్‌ల వేషధారణలో విచారించారు. బ్యాంకు ఖాతా వివరాలు చెప్పాలని, డబ్బులు పంపాలని కాదంటే అరెస్ట్ తప్పదంటూ బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన బాధితుడు తన ఖాతాలోని రూ.24.58 లక్షలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ డబ్బును మరో ఖాతాలోకి పంపి కాపాడుకున్నాడు. నిందితులపై చర్యలు తీసుకోవాలని సైబర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వృద్ధుడి వద్ద 2.33 లక్షలు కాజేసిన కేటుగాళ్లు : మరో కేసులో 74 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి అమెరికాలోని కుమారుడికి పంపిన పార్సిల్ స్టేటస్‌ తెలుసుకోవడం కోసం ఫెడెక్స్‌ కస్టమర్ కేర్ కోసం కాల్ చేశాడు. ఆన్‌లైన్‌లో సైబర్ నేరగాళ్లు తమ నెంబర్ ఉంచి బాధితుడితో కనెక్ట్ అయ్యారు. వృద్ధుడిని నమ్మించి రూ.2,33,794లను కాజేశారు. మరో కేసులో 21 ఏళ్ల యువకుడికి డ్రగ్స్ ఉన్న పార్సిల్ వచ్చిందని బాధితుడిని అరెస్ట్ చేస్తామని బెదిరించి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకుని రూ.7.11 లక్షలను కాజేశారు. ఇలాంటి ఘటనలు రోజు నిత్యకృత్యంగా మారిపోయాయి.

సైబర్‌ నేరగాళ్ల బారిన పడొద్దంటే అప్రమత్తతే శ్రీరామరక్ష అని నిపుణులు చెబుతున్నారు. పార్సిల్ పంపనప్పుడు భయపడాల్సిన పనిలేదంటున్నారు. ఆందోళన చెందకుండా మోసం జరిగిన గంటలోపు 1930కి కాల్ చేయడం సహా సైబర్‌క్రైమ్‌ వెబ్‌సైట్‌లో రిపోర్ట్ చేయాలని సూచిస్తున్నారు. బాధితులు మోసపోయిన డబ్బును హోల్డ్​ చేసి, రీఫండ్​ చేసేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నా సైబర్​ నేరగాళ్లు ఆగడాలు మాత్రం ఆగడం లేదు.

కొరియర్​లో డ్రగ్స్ పంపారంటూ రూ.25లక్షలు కొట్టేయబోయారు - చివర్లో ఏం జరిగిందంటే - FedEx Crimes In Hyderabad

'మీ పేరుతో వచ్చిన పార్శిల్​లో డ్రగ్స్ ఉన్నాయంటూ' - ఈడీ, ఐటీ ఆఫీస్ సెట్ వేసి మరీ మోసాలు - FEDEX FRAUDS IN TELANGANA

FedEx Scams Increase In Hyderabad : దొంగతనం అంటే తాళం పగులగొట్టాల్సిన అవసరం లేదు. కిటికీఊచలూ తొలగించనక్కర్లేదు. ఖాతాల్లో డబ్బుంటే చాలంటున్నారు సైబర్‌ నేరగాళ్లు. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతూ అమాయకులను లూటీ చేస్తున్నారు. కళ్లు మూసి తెరిచేలోపు ఖాతాను ఖాళీ చేస్తున్నారు. ఫెడెక్స్ పార్సిల్ పేరిట ఇప్పటికే కోట్లు కాజేశారు. అయనా వారి ఆగడాలు ఆగడం లేదు. ఎలాంటి పార్శిల్‌ పంపకున్నా అందులో నిషేధిత పధార్థాలు ఉన్నాయంటూ భయపెడుతూ డబ్బులు గుంజుతున్నారు. తాజాగా సికింద్రాబాద్‌కు చెందిన 62 ఏళ్ల వృద్ధుడికి ఇదే అనుభవం ఎదురైంది. ఇరాన్‌కు పంపిన కొరియర్‌లో 20 కిలోల డయాబెటిక్ డ్రగ్స్‌తో పాటు 100 గ్రాముల ఎండీఎంఏ ఉందని సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ వచ్చింది.

ఏ పార్సిల్ పంపలేదని చెప్పినా వినకుండా సైబర్ నేరస్థులు వీడియో కాల్‌చేసి 6 గంటలపాటు పోలీస్‌ల వేషధారణలో విచారించారు. బ్యాంకు ఖాతా వివరాలు చెప్పాలని, డబ్బులు పంపాలని కాదంటే అరెస్ట్ తప్పదంటూ బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన బాధితుడు తన ఖాతాలోని రూ.24.58 లక్షలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ డబ్బును మరో ఖాతాలోకి పంపి కాపాడుకున్నాడు. నిందితులపై చర్యలు తీసుకోవాలని సైబర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వృద్ధుడి వద్ద 2.33 లక్షలు కాజేసిన కేటుగాళ్లు : మరో కేసులో 74 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి అమెరికాలోని కుమారుడికి పంపిన పార్సిల్ స్టేటస్‌ తెలుసుకోవడం కోసం ఫెడెక్స్‌ కస్టమర్ కేర్ కోసం కాల్ చేశాడు. ఆన్‌లైన్‌లో సైబర్ నేరగాళ్లు తమ నెంబర్ ఉంచి బాధితుడితో కనెక్ట్ అయ్యారు. వృద్ధుడిని నమ్మించి రూ.2,33,794లను కాజేశారు. మరో కేసులో 21 ఏళ్ల యువకుడికి డ్రగ్స్ ఉన్న పార్సిల్ వచ్చిందని బాధితుడిని అరెస్ట్ చేస్తామని బెదిరించి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకుని రూ.7.11 లక్షలను కాజేశారు. ఇలాంటి ఘటనలు రోజు నిత్యకృత్యంగా మారిపోయాయి.

సైబర్‌ నేరగాళ్ల బారిన పడొద్దంటే అప్రమత్తతే శ్రీరామరక్ష అని నిపుణులు చెబుతున్నారు. పార్సిల్ పంపనప్పుడు భయపడాల్సిన పనిలేదంటున్నారు. ఆందోళన చెందకుండా మోసం జరిగిన గంటలోపు 1930కి కాల్ చేయడం సహా సైబర్‌క్రైమ్‌ వెబ్‌సైట్‌లో రిపోర్ట్ చేయాలని సూచిస్తున్నారు. బాధితులు మోసపోయిన డబ్బును హోల్డ్​ చేసి, రీఫండ్​ చేసేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నా సైబర్​ నేరగాళ్లు ఆగడాలు మాత్రం ఆగడం లేదు.

కొరియర్​లో డ్రగ్స్ పంపారంటూ రూ.25లక్షలు కొట్టేయబోయారు - చివర్లో ఏం జరిగిందంటే - FedEx Crimes In Hyderabad

'మీ పేరుతో వచ్చిన పార్శిల్​లో డ్రగ్స్ ఉన్నాయంటూ' - ఈడీ, ఐటీ ఆఫీస్ సెట్ వేసి మరీ మోసాలు - FEDEX FRAUDS IN TELANGANA

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.