ETV Bharat / state

'ఎండిన పైరు రైతు కంట నీరు' - పంటను కాపాడుకోడానికి ఆలుపెరగని పోరాటం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 4:55 PM IST

Farmers Struggle to Save Chilli Crop in Palnadu District: ప్రకృతి వైపరీత్యాలకు నాయకుల నిర్లక్ష్యం తోడవడంతో అన్నదాతలకు సాగు కష్టాలు తప్పడం లేదు. తీవ్ర వర్షాభావంతో ఖరీఫ్ సీజన్‌లో నష్టపోయిన పల్నాడు జిల్లా రైతులు ఆశ చావక రబీలో మిరప పంట వేశారు. కానీ అధికారుల అలసత్వం, ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. చేతికొచ్చిన పంటను కాపాడుకోడానికి నానా అవస్థలు పడుతున్నారు. సాగర్ కాలువ నుంచి నీరు రాకపోవడంతో చెరువులు, కుంటల్లోని బురద నీటితో పంటలను బతికించడానికి అల్లాడుతున్నారు.

chilli_crop
chilli_crop

Farmers Struggle to Save Chilli Crop in Palnadu District: పాలకులు పట్టించుకోకపోయినా, ప్రకృతి సహకరించకపోయినా, పలు రకాల తెగుళ్లు, నకిలీ విత్తనాలతో పంట దెబ్బతిన్నా పగలు, రాత్రి తేడా లేకుండా సాగు అనే సమరాన్ని కొనసాగిస్తున్నారు పల్నాడు జిల్లా రైతులు. తీవ్ర వర్షాభావంతో ఖరీఫ్ సీజన్ కలిసిరాకపోయినా, అప్పు తెచ్చి మరీ రబీలో మిరప, పత్తి, మినుము, శనగ లాంటి పంటలు వేశారు. ఏ మాత్రం ముందు చూపులేని ప్రభుత్వం, అధికారుల ఆలసత్వం వల్ల తీవ్ర సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. చేతికి వచ్చిన మిరప పంటను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. సాగర్ కెనాల్ నుంచి నీరు రాకపోవడంతో చెరువులు, కుంటల్లో ఉన్న కొద్దిపాటి నీటిని మోటర్ల సాయంతో పొలాలకు పెడుతూ పంటను కాపాడుకునేందుకు ఆలుపెరగని పోరాటం చేస్తున్నారు.

సీఎం సొంత జిల్లాలో కరెంట్​ కష్టాలు - ఎండిపోతున్న పంటలు

పంట ఎండిపోయే దుస్థితి: ఎన్నడూ లేనంత తీవ్ర వర్షాభావ పరిస్థితులు పల్నాడు జిల్లా అన్నదాతలను కోలుకులేని దెబ్బతీస్తున్నాయి. వానలు, సాగునీరు లేక కరవు పరిస్థితులు ఖరీఫ్ సీజన్ రైతులకు నష్టాలను మిగిలిస్తే రబీలోనూ కర్షకులు కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ ఆయుకట్టు కింద లక్షలాది ఎకరాల్లో వరి, మిరప, పత్తి, పసుపు, మెుక్కజొన్న, శనగ లాంటి పంటను పండిస్తుంటారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులకు తోడు సాగర్ నుంచి సాగునీటిని ప్రణాళిక ప్రకారం విడుదల చేయడంలో పాలకులు విఫలం కావడంతో పల్నాడు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలో 9 వేల హెక్టార్ల సాగుభూమిలో రైతులు మిరప, పత్తి తదితర పంటలు వేశారు. చెంతనే అమరావతి మేజర్‌ కాలువ ఉన్నా నీటి విడుదల లేకపోవడంతో పెదకూరపాడు, లగడపాడు, హుస్సేన్ నగరం, అత్తలూరు, తాళ్లూరు, అబ్బరాజుపాలెం, జలాల్‌పురం గ్రామాల చివర భూముల్లో మిరప పంట ఎండిపోయే దుస్థితి ఏర్పడింది.

పెట్టుబడి కూడా వస్తాదన్న నమ్మకం లేదు - కరెంటు కోతలతో అన్నదాతల అవస్థలు

బురద నీటితోనే సాగు: పెదకూరపాడు మండలంలో 5,600 హెక్టార్లో పత్తి పంట వేయగా నీటి ఎద్దడి, తెగుళ్ల వల్ల దిగుబడి బాగా తగ్గింది. వర్షాభావం కారణంగా ఈ ప్రాంతంలో నవంబరు వరకు మిరప నాట్లు వేశారు. డిసెంబరు మెదటి వారంలో మిగ్ జామ్ తుపాను కారణంగా పైరు దెబ్బతింది. ఆ తరువాత మళ్లీ దాదాపు 3 వేల హెక్టార్లో మిరప నాట్లు వేసిన రైతులు పంటలను కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. ఎలాంటి నీటి సౌలభ్యం లేని వారు కాపు కొచ్చిన మిరప పంటను అలాగే వదిలేస్తుండగా ఆశ చావని కొందరు కర్షకులు కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. వర్షాలు, సాగర్ జలాలు రాకపోవడంతో చెరువులు, కుంటల్లో అడుగంటిన బురద నీటినే మోటార్లు, డీజిల్‌ ఇంజిన్ల సాయంతో కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి పొలాలకు పెడుతున్నారు.

కష్ట కాలంలో మల్లె రైతులు - పెట్టుబడి కూడా రాలేదని వాపోతున్న కర్షకులు

ఎకరానికి రూ.2లక్షలు నష్టం: సాధారణంగా మిరప పంటకు నాలుగైదు తడులు నీరు పెడతామని, ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో ఒక తడి పెట్టేందుకే 20 నుంచి 25 వేల రూపాయలు ఖర్చు అవుతుందని వాపోతున్నారు. ఇంత చేసినా నీరు సమృద్ధిగా అందక పోవడంతో ఎకరానికి 30 క్వింటాలు అయ్యే మిరప ఇప్పుడు ఐదారు క్వింటాలు కూడా కావంటున్నారు. దాదాపు ఎకరానికి లక్ష నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టామని, కోత కోసిన కూలీల ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు కంటతడి పెట్టుకున్నారు. పెట్టుబడి, అహర్నిశలు పడిన శ్రమంతా వృథానేనని గగ్గోలు పెడుతున్నారు. సాగర్ కాలువ నుంచి కనీసం ఒక్క తడికైనా నీరు వచ్చి ఉంటే రైతుల పరిస్థితి దీనంగా ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చేతికంది వచ్చిన పంటను వదిలిపెట్టలేక, ఎండుతున్న మిరప పంటను రక్షించుకోలేక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. రైతుల ప్రభుత్వమని పదే పదే ప్రచారం చేసుకునే అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో ఎండిపోతున్న పంటలను, రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Farmers Struggle to Save Chilli Crop in Palnadu District: పాలకులు పట్టించుకోకపోయినా, ప్రకృతి సహకరించకపోయినా, పలు రకాల తెగుళ్లు, నకిలీ విత్తనాలతో పంట దెబ్బతిన్నా పగలు, రాత్రి తేడా లేకుండా సాగు అనే సమరాన్ని కొనసాగిస్తున్నారు పల్నాడు జిల్లా రైతులు. తీవ్ర వర్షాభావంతో ఖరీఫ్ సీజన్ కలిసిరాకపోయినా, అప్పు తెచ్చి మరీ రబీలో మిరప, పత్తి, మినుము, శనగ లాంటి పంటలు వేశారు. ఏ మాత్రం ముందు చూపులేని ప్రభుత్వం, అధికారుల ఆలసత్వం వల్ల తీవ్ర సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. చేతికి వచ్చిన మిరప పంటను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. సాగర్ కెనాల్ నుంచి నీరు రాకపోవడంతో చెరువులు, కుంటల్లో ఉన్న కొద్దిపాటి నీటిని మోటర్ల సాయంతో పొలాలకు పెడుతూ పంటను కాపాడుకునేందుకు ఆలుపెరగని పోరాటం చేస్తున్నారు.

సీఎం సొంత జిల్లాలో కరెంట్​ కష్టాలు - ఎండిపోతున్న పంటలు

పంట ఎండిపోయే దుస్థితి: ఎన్నడూ లేనంత తీవ్ర వర్షాభావ పరిస్థితులు పల్నాడు జిల్లా అన్నదాతలను కోలుకులేని దెబ్బతీస్తున్నాయి. వానలు, సాగునీరు లేక కరవు పరిస్థితులు ఖరీఫ్ సీజన్ రైతులకు నష్టాలను మిగిలిస్తే రబీలోనూ కర్షకులు కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ ఆయుకట్టు కింద లక్షలాది ఎకరాల్లో వరి, మిరప, పత్తి, పసుపు, మెుక్కజొన్న, శనగ లాంటి పంటను పండిస్తుంటారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులకు తోడు సాగర్ నుంచి సాగునీటిని ప్రణాళిక ప్రకారం విడుదల చేయడంలో పాలకులు విఫలం కావడంతో పల్నాడు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలో 9 వేల హెక్టార్ల సాగుభూమిలో రైతులు మిరప, పత్తి తదితర పంటలు వేశారు. చెంతనే అమరావతి మేజర్‌ కాలువ ఉన్నా నీటి విడుదల లేకపోవడంతో పెదకూరపాడు, లగడపాడు, హుస్సేన్ నగరం, అత్తలూరు, తాళ్లూరు, అబ్బరాజుపాలెం, జలాల్‌పురం గ్రామాల చివర భూముల్లో మిరప పంట ఎండిపోయే దుస్థితి ఏర్పడింది.

పెట్టుబడి కూడా వస్తాదన్న నమ్మకం లేదు - కరెంటు కోతలతో అన్నదాతల అవస్థలు

బురద నీటితోనే సాగు: పెదకూరపాడు మండలంలో 5,600 హెక్టార్లో పత్తి పంట వేయగా నీటి ఎద్దడి, తెగుళ్ల వల్ల దిగుబడి బాగా తగ్గింది. వర్షాభావం కారణంగా ఈ ప్రాంతంలో నవంబరు వరకు మిరప నాట్లు వేశారు. డిసెంబరు మెదటి వారంలో మిగ్ జామ్ తుపాను కారణంగా పైరు దెబ్బతింది. ఆ తరువాత మళ్లీ దాదాపు 3 వేల హెక్టార్లో మిరప నాట్లు వేసిన రైతులు పంటలను కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. ఎలాంటి నీటి సౌలభ్యం లేని వారు కాపు కొచ్చిన మిరప పంటను అలాగే వదిలేస్తుండగా ఆశ చావని కొందరు కర్షకులు కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. వర్షాలు, సాగర్ జలాలు రాకపోవడంతో చెరువులు, కుంటల్లో అడుగంటిన బురద నీటినే మోటార్లు, డీజిల్‌ ఇంజిన్ల సాయంతో కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి పొలాలకు పెడుతున్నారు.

కష్ట కాలంలో మల్లె రైతులు - పెట్టుబడి కూడా రాలేదని వాపోతున్న కర్షకులు

ఎకరానికి రూ.2లక్షలు నష్టం: సాధారణంగా మిరప పంటకు నాలుగైదు తడులు నీరు పెడతామని, ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో ఒక తడి పెట్టేందుకే 20 నుంచి 25 వేల రూపాయలు ఖర్చు అవుతుందని వాపోతున్నారు. ఇంత చేసినా నీరు సమృద్ధిగా అందక పోవడంతో ఎకరానికి 30 క్వింటాలు అయ్యే మిరప ఇప్పుడు ఐదారు క్వింటాలు కూడా కావంటున్నారు. దాదాపు ఎకరానికి లక్ష నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టామని, కోత కోసిన కూలీల ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు కంటతడి పెట్టుకున్నారు. పెట్టుబడి, అహర్నిశలు పడిన శ్రమంతా వృథానేనని గగ్గోలు పెడుతున్నారు. సాగర్ కాలువ నుంచి కనీసం ఒక్క తడికైనా నీరు వచ్చి ఉంటే రైతుల పరిస్థితి దీనంగా ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చేతికంది వచ్చిన పంటను వదిలిపెట్టలేక, ఎండుతున్న మిరప పంటను రక్షించుకోలేక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. రైతుల ప్రభుత్వమని పదే పదే ప్రచారం చేసుకునే అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో ఎండిపోతున్న పంటలను, రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.