ETV Bharat / state

సీఐడీ ఆఫీసర్స్​ అంటూ ఓ సంస్థలో సోదాలు- విచారిస్తే ఆ కంపెనీ మాజీఉద్యోగి, ఎస్​ఐ సూత్రధారులు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2024, 7:34 PM IST

Fake CID Officers Arrest in Hyderabad : కొంత మంది వ్యక్తులు సీఐడీ ఉద్యోగులుగా అవతారమెత్తి హైదరాబాద్​ కారిడార్​లో హల్​చల్​ చేశాడు. ఓ ఐటీ కంపెనీలో తనిఖీల పేరుతో సంస్థ డైరెక్టర్​ను కిడ్నాప్​ చేశారు. అనంతరం రూ.10 కోట్లు డిమాండ్​ చేశారు. అనంతరం రూ.2 కోట్లకు డీల్​ కుదుర్చుకుని వారి నుంచి బయటకి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారణ చేయగా విస్తుపోయే నిజాలు బయటకి వచ్చాయి.

Etv Bharat
Etv Bharat

Fake CID Officers Arrest in Hyderabad : ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలుకు చెందిన ఓ ఎస్​ఐ​తో పాటు తొమ్మిది మంది నకిలీ సీఐడీ(Fake CID) అవతారమెత్తి కటకటాలపాలయ్యారు. హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో(IT Corridor) సీఐడీ అధికారులమంటూ హల్​చల్‌ చేసి ఓ ఐటీ కంపెనీలో తనిఖీల పేరుతో సోదాలు చేశారు. అనంతరం కంపెనీ డైరెక్టర్​తో పాటు మరో వ్యక్తిని కిడ్నాప్(Kidnap) చేసి ఓ హోటల్‌కు తీసుకువెళ్లారు. తమను అరెస్టు చేయకుండా ఉండాలంటే రూ.10కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి రూ.2.3 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. డైరెక్టర్​ బయటకి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నకిలీ సీఐడీ అధికారులను తేలింది. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

నకిలీ పాస్​పోర్ట్​ల కేసులో కీలక పరిణామం - సీఐడీ అదుపులో ఏఎస్ఐ

మాదాపూర్ డీసీపీ వినిత్‌ తెలిపిన వివరాల ప్రకారం గచ్చిబౌలిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అజయాడ్ ఐటీ కంపెనీ(Ajayad IT Company)లోకి ఈ నెల 27వ తేదీన గతంలో ఆ కంపెనీ మాజీ ఉద్యోగి రంజిత్‌, ఏపీలోని కర్నూలుకు చెందిన సబ్‌ ఇన్‌స్పెక్టర్ సుజన్​తో కలిపి 9 మంది ఏపీ సీఐడీ అధికారులమంటూ వెళ్లారు. అమెరికాలో మీ కంపెనీపై కేసు నమోదయిందని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో తనిఖీలు చేపడుతున్నామని కార్యాలయంలోకి చొరబడ్డారు. అనంతరం అక్కడ ఉన్న డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోదాలు నిర్వహించి కంపెనీ డైరెక్టర్ దర్శన్​​తో పాటు మరో వ్యక్తిని బలవంతంగా ఓ హోటల్​కు తీసుకువెళ్లారు.

నకిలీ నోట్లతో ప్రజలను మోసం చేస్తున్న విదేశీయుల ముఠా అరెస్టు

8 Members Arest in Fake CID Officers Case : ఆ హోటల్​లో సంస్థ డైరెక్టర్​తో అతనని అరెస్ట్​ చేయకుండా ఉండాలంటే రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.2.3 కోట్లకు డీల్ కుదిరింది. అక్కడికక్కడే రూ.10లక్షలు వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. తరువాత నిందితులు ఇద్దరిని వదిలి పెట్టారు. వెంటనే వారు దగ్గరలోని పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేశారు. దీంతో వారు నకిలీ సీఐడీ(Fake CID Officers Case) ఉద్యోగులను తెలుసుకున్నారు. అనంతరం నిందితులను పట్టుకుని అరెస్ట్​ చేశామని తెలిపారు. ఇప్పటివరకు 8 మంది నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. పరారీలో మరో ఇద్దరు నిందుతులు ఉన్నారని వెల్లడించారు. గతంలో నిందితులు ఈ తరహా మోసాలకు పాల్పడ్డారనే కోణంలో దర్యాప్తు చేస్తామని వివరించారు.

"రంజిత్‌ అనే అతడు అజాయాడ్‌ ఐటీ కంపెనీలో పని చేశాడు. తను ఎస్‌ఐ సుజన్‌ ప్రణాళిక రచించారు. సీఐడీ ఆఫీసర్లమంటూ వెళ్లి డైరెక్టర్, మరో వ్యక్తిని హోటల్​కు తీసుకెళ్లారు. రూ.10 లక్షలు బాధితుడి నుంచి తీసుకున్నారు. ఇప్పటివరకు 8 మంది నిందితులను అరెస్టు చేశాం. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. అరెస్టు చేసిన వారిని రిమాండ్‌కు తరలించాం." - వినిత్‌ , మాదాపూర్ డీసీపీ

సీఐడీ ఆఫీసర్స్​ అంటూ ఓ సంస్థలో సోదాలు- చివరికీ విచారిస్తే ఆ కంపెనీ మాజీఉద్యోగి

ఫేక్ పాస్​పోర్టు స్కామ్​లో వెలుగులోకి సంచలన విషయాలు - నిరక్షరాస్యులు, డ్రాపౌట్స్‌ కోసం టెన్త్ నకిలీ సర్టిఫికెట్స్

మోసం చేయడమే ఈ బాబా స్పెషాలిటీ

Fake CID Officers Arrest in Hyderabad : ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలుకు చెందిన ఓ ఎస్​ఐ​తో పాటు తొమ్మిది మంది నకిలీ సీఐడీ(Fake CID) అవతారమెత్తి కటకటాలపాలయ్యారు. హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో(IT Corridor) సీఐడీ అధికారులమంటూ హల్​చల్‌ చేసి ఓ ఐటీ కంపెనీలో తనిఖీల పేరుతో సోదాలు చేశారు. అనంతరం కంపెనీ డైరెక్టర్​తో పాటు మరో వ్యక్తిని కిడ్నాప్(Kidnap) చేసి ఓ హోటల్‌కు తీసుకువెళ్లారు. తమను అరెస్టు చేయకుండా ఉండాలంటే రూ.10కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి రూ.2.3 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. డైరెక్టర్​ బయటకి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నకిలీ సీఐడీ అధికారులను తేలింది. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

నకిలీ పాస్​పోర్ట్​ల కేసులో కీలక పరిణామం - సీఐడీ అదుపులో ఏఎస్ఐ

మాదాపూర్ డీసీపీ వినిత్‌ తెలిపిన వివరాల ప్రకారం గచ్చిబౌలిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అజయాడ్ ఐటీ కంపెనీ(Ajayad IT Company)లోకి ఈ నెల 27వ తేదీన గతంలో ఆ కంపెనీ మాజీ ఉద్యోగి రంజిత్‌, ఏపీలోని కర్నూలుకు చెందిన సబ్‌ ఇన్‌స్పెక్టర్ సుజన్​తో కలిపి 9 మంది ఏపీ సీఐడీ అధికారులమంటూ వెళ్లారు. అమెరికాలో మీ కంపెనీపై కేసు నమోదయిందని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో తనిఖీలు చేపడుతున్నామని కార్యాలయంలోకి చొరబడ్డారు. అనంతరం అక్కడ ఉన్న డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోదాలు నిర్వహించి కంపెనీ డైరెక్టర్ దర్శన్​​తో పాటు మరో వ్యక్తిని బలవంతంగా ఓ హోటల్​కు తీసుకువెళ్లారు.

నకిలీ నోట్లతో ప్రజలను మోసం చేస్తున్న విదేశీయుల ముఠా అరెస్టు

8 Members Arest in Fake CID Officers Case : ఆ హోటల్​లో సంస్థ డైరెక్టర్​తో అతనని అరెస్ట్​ చేయకుండా ఉండాలంటే రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.2.3 కోట్లకు డీల్ కుదిరింది. అక్కడికక్కడే రూ.10లక్షలు వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. తరువాత నిందితులు ఇద్దరిని వదిలి పెట్టారు. వెంటనే వారు దగ్గరలోని పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేశారు. దీంతో వారు నకిలీ సీఐడీ(Fake CID Officers Case) ఉద్యోగులను తెలుసుకున్నారు. అనంతరం నిందితులను పట్టుకుని అరెస్ట్​ చేశామని తెలిపారు. ఇప్పటివరకు 8 మంది నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. పరారీలో మరో ఇద్దరు నిందుతులు ఉన్నారని వెల్లడించారు. గతంలో నిందితులు ఈ తరహా మోసాలకు పాల్పడ్డారనే కోణంలో దర్యాప్తు చేస్తామని వివరించారు.

"రంజిత్‌ అనే అతడు అజాయాడ్‌ ఐటీ కంపెనీలో పని చేశాడు. తను ఎస్‌ఐ సుజన్‌ ప్రణాళిక రచించారు. సీఐడీ ఆఫీసర్లమంటూ వెళ్లి డైరెక్టర్, మరో వ్యక్తిని హోటల్​కు తీసుకెళ్లారు. రూ.10 లక్షలు బాధితుడి నుంచి తీసుకున్నారు. ఇప్పటివరకు 8 మంది నిందితులను అరెస్టు చేశాం. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. అరెస్టు చేసిన వారిని రిమాండ్‌కు తరలించాం." - వినిత్‌ , మాదాపూర్ డీసీపీ

సీఐడీ ఆఫీసర్స్​ అంటూ ఓ సంస్థలో సోదాలు- చివరికీ విచారిస్తే ఆ కంపెనీ మాజీఉద్యోగి

ఫేక్ పాస్​పోర్టు స్కామ్​లో వెలుగులోకి సంచలన విషయాలు - నిరక్షరాస్యులు, డ్రాపౌట్స్‌ కోసం టెన్త్ నకిలీ సర్టిఫికెట్స్

మోసం చేయడమే ఈ బాబా స్పెషాలిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.