ETV Bharat / state

ఈ గణపతికి చక్కెరతో అభిషేకం చేస్తే కోరికలు తీరడం పక్కా - ఆ విఘ్నేశ్వరుడు ఎక్కడున్నాడంటే? - 2000kgs Sugar Abhishekam To Ganesh

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2024, 1:46 PM IST

Updated : Sep 12, 2024, 2:14 PM IST

Devotees Abhishekam To Ganesha With 2000kgs Sugar : వినాయక నవరాత్రి ఉత్సవాల భాగంగా ఆ ఊరిలోని బొజ్జ గణపయ్యకు నిర్వహించే చక్కర అభిషేకం ఓ ప్రత్యేకత చాటుకుంది. ఏదైనా కోరిక మనస్సులో అనుకొని వినాయకునికి కిలోపావు చక్కర పోసి వేడుకుంటే అది ఫలిస్తుండడంతో ప్రతి ఏటా ఈ చక్కెరాభిషేకంలో పాల్గొనే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. భక్తులతో చక్కెరాభిషేకాన్ని వైభవంగా అందుకుంటున్న లంబోదరునిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

EDevotees Abhishekam To Ganesha With 2000kgs Sugar in Jagtial
Devotees Abhishekam To Ganesha With 2000kgs Sugar in Jagtial (ETV Bharat)

Devotees Abhishekam To Ganesha With 2000kgs Sugar in Jagtial : వినాయక పండుగ వచ్చిందంటే సందడే సందడి. ప్రతి గల్లీలో వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించి తమ భక్తిని చాటుకుంటుంటారు. గణేశ్ నవరాత్రులంతా స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. రోజూ ప్రత్యేకంగా అలంకరించి, వివిధ రకాల నైవేద్యం పెట్టి మొక్కులు తీర్చుకుంటుంటారు. ఈ మధ్యకాలంలో ప్రకృతి పట్ల అవగాహన పెరిగి మట్టి వినాయకులను ప్రతిష్ఠించడానికి మక్కువ చూపిస్తున్నారు ప్రజలు. వీరు కూడా అటు ప్రకృతిని కాపాడుతూ, మరోవైపు భక్తుల కోర్కెలు తీరడానికి గణేశుడికి రోజుకో అభిషేకం చేస్తున్నారు. అందులో చక్కెరాభిషేకం మరీ ప్రత్యేకం. మరి దాని గురించి తెలుసుకుందామా?

క్యూలో నిలబడి చక్కెర అభిషేకం : జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధర్వంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది. తొమ్మిది రోజుల పాటు రోజుకో రకమైన అభిషేకాలు చేస్తూ అందరిలో భక్తి భావాన్ని చాటుతున్నారు. ఇందులో భాగంగా ఆరో రోజు ఏకదంతునికి చక్కెరాభిషేకాన్ని నిర్వహించారు. ఈ అభిషేకంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. క్యూలైన్లలో నిలబడి వెండి వినాయకుని మూర్తికి చక్కెర అభిషేకం చేసి, మొక్కులు తీర్చుకున్నారు. ఇలా భక్తులు అభిషేకించిన చక్కర సుమారు 20 క్వింటాళ్లకు పైనే జమ కావడం చూస్తుంటే, చక్కరాభిషేకం ఏ విధంగా జరిగిందో తెలుస్తుంది.

సుల్తాన్​ బజార్​లో వెరైటీ వినాయకుడు - రైల్వే గణేశ్​ను చూస్తే వావ్ అనాల్సిందే - RAILWAY MODEL GANEH IDOL IN HYD

ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా ఈ చక్కరాభిషేకం రోజున విశేష జనావళి రావడంతో వినాయక మండప ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోతుంది. రోజుకో విధమైన అభిషేకాలు చేస్తూ అందరిలో భక్తి భావాన్ని పెంపొందిస్తున్నారు ఆర్యవైశ్యులు. భక్తిని ఎంచుకున్న ఆర్యవైశ్య సంఘం పర్యావరణంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. గత 15 ఏళ్ల నుంచి మట్టి వినాయకుని పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

పర్యావరణాన్ని కాపాడండి : పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్నామని ఇతర మండపాల నిర్వాహకులు కూడా ఇలానే మట్టి వినాయకుని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుంటే మనమందరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. ఇలా ఈ వినాయక నవరాత్రులను ఇక్కడి ఆర్య వైశ్యులు భక్తితో పాటు పర్యావరణాన్ని కాపాడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

బొజ్జ గణపయ్యకు 'కాకి' పూజలు - వైరల్ అవుతున్న వీడియో - Crow on Ganapati idol In Suryapet

గణనాథునికి ఒకేసారి 21 వేల మంది విద్యార్థుల ప్రార్థన - ముక్తకంఠంగా 'అథర్వ స్త్రోత్ర' పారాయణం - Ganesh Chaturthi 2024

Devotees Abhishekam To Ganesha With 2000kgs Sugar in Jagtial : వినాయక పండుగ వచ్చిందంటే సందడే సందడి. ప్రతి గల్లీలో వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించి తమ భక్తిని చాటుకుంటుంటారు. గణేశ్ నవరాత్రులంతా స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. రోజూ ప్రత్యేకంగా అలంకరించి, వివిధ రకాల నైవేద్యం పెట్టి మొక్కులు తీర్చుకుంటుంటారు. ఈ మధ్యకాలంలో ప్రకృతి పట్ల అవగాహన పెరిగి మట్టి వినాయకులను ప్రతిష్ఠించడానికి మక్కువ చూపిస్తున్నారు ప్రజలు. వీరు కూడా అటు ప్రకృతిని కాపాడుతూ, మరోవైపు భక్తుల కోర్కెలు తీరడానికి గణేశుడికి రోజుకో అభిషేకం చేస్తున్నారు. అందులో చక్కెరాభిషేకం మరీ ప్రత్యేకం. మరి దాని గురించి తెలుసుకుందామా?

క్యూలో నిలబడి చక్కెర అభిషేకం : జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధర్వంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది. తొమ్మిది రోజుల పాటు రోజుకో రకమైన అభిషేకాలు చేస్తూ అందరిలో భక్తి భావాన్ని చాటుతున్నారు. ఇందులో భాగంగా ఆరో రోజు ఏకదంతునికి చక్కెరాభిషేకాన్ని నిర్వహించారు. ఈ అభిషేకంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. క్యూలైన్లలో నిలబడి వెండి వినాయకుని మూర్తికి చక్కెర అభిషేకం చేసి, మొక్కులు తీర్చుకున్నారు. ఇలా భక్తులు అభిషేకించిన చక్కర సుమారు 20 క్వింటాళ్లకు పైనే జమ కావడం చూస్తుంటే, చక్కరాభిషేకం ఏ విధంగా జరిగిందో తెలుస్తుంది.

సుల్తాన్​ బజార్​లో వెరైటీ వినాయకుడు - రైల్వే గణేశ్​ను చూస్తే వావ్ అనాల్సిందే - RAILWAY MODEL GANEH IDOL IN HYD

ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా ఈ చక్కరాభిషేకం రోజున విశేష జనావళి రావడంతో వినాయక మండప ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోతుంది. రోజుకో విధమైన అభిషేకాలు చేస్తూ అందరిలో భక్తి భావాన్ని పెంపొందిస్తున్నారు ఆర్యవైశ్యులు. భక్తిని ఎంచుకున్న ఆర్యవైశ్య సంఘం పర్యావరణంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. గత 15 ఏళ్ల నుంచి మట్టి వినాయకుని పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

పర్యావరణాన్ని కాపాడండి : పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్నామని ఇతర మండపాల నిర్వాహకులు కూడా ఇలానే మట్టి వినాయకుని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుంటే మనమందరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. ఇలా ఈ వినాయక నవరాత్రులను ఇక్కడి ఆర్య వైశ్యులు భక్తితో పాటు పర్యావరణాన్ని కాపాడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

బొజ్జ గణపయ్యకు 'కాకి' పూజలు - వైరల్ అవుతున్న వీడియో - Crow on Ganapati idol In Suryapet

గణనాథునికి ఒకేసారి 21 వేల మంది విద్యార్థుల ప్రార్థన - ముక్తకంఠంగా 'అథర్వ స్త్రోత్ర' పారాయణం - Ganesh Chaturthi 2024

Last Updated : Sep 12, 2024, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.