ETV Bharat / state

'జల్ జీవన్ మిషన్'​పై పవన్ ఆరా- గత ప్రభుత్వ వ్యయాలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం - Pawan Review on Jal Jeevan Mission

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 4, 2024, 7:16 AM IST

Pawan Review on Jal Jeevan Mission : వైఎస్సార్సీపీ సర్కార్‌ తూట్లు పొడిచిన జల్ జీవన్‌ మిషన్‌ను మళ్లీ పట్టాలెక్కించేందుకు ఎన్డీయే ప్రభుత్వం దృష్టి సారించింది. జల్ జీవన్ మిషన్ పనుల్లో జాతీయ స్థాయిలో ఏపీ 29వ స్థానంలో ఉంది. గత ఐదేళ్లు ఈ పథకం అమల్లో అప్పటి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది.

Pawan Review on Jal Jeevan Mission
Pawan Review on Jal Jeevan Mission (ETV Bharat)

Jal Jeevan Mission Scheme in AP : కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ నిధుల విషయానికి వస్తే మాత్రం రాష్ట్రంలో రూ.4,000 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు గణాంకాలు చూపిస్తున్నాయి. అయితే వాటి ఫలితాలు ఏ స్థాయిలో ఉన్నాయి? క్షేత్ర స్థాయిలో పనులు ఏ విధంగా చేశారు? అనే అంశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నిశితంగా పరిశీలిస్తున్నారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు.

గ్రామీణ నీటిపారుదల వ్యవస్థ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనులపై ఆరా తీశారు. ఈ పథకం కింద కేంద్ర నుంచి రూ.4,000 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే గత ఐదేళ్లు ఖర్చు చేసిన నిధులను జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు వాటర్‌ ప్లాంట్ నుంచి ఇంటి కుళాయికి చేరే వరకూ ఏ స్థాయిలో ఖర్చు చేశారనే దానిపై పవన్ ఆరా తీశారు. దీనిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. అన్ని దశల్లో నిపుణులతో తనిఖీలు చేయించాలని నిర్ణయించారు. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు నిబంధనల్లో నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను అనుసరించి పైపులు వేస్తున్నదీ లేనిది పరిశీలన చేయనున్నారు.

వైఎస్సార్సీపీ హయాంలో జలజీవన్ మిషన్ అస్తవ్యస్తం - కుళాయి ఉన్న చుక్క నీరందని పరిస్థితి - Jal Jeevan Mission failed at YCP

YSRCP Neglect on Jal Jeevan Mission : గ్రామాలకు రక్షిత తాగునీటి సరఫరాకు సంబంధించిన ప్లాంట్ల నిర్మాణం, పైపు లైన్లు, ఇంటింటికీ కుళాయిలు సమకూర్చడం వంటి పనుల పురోగతిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే చాలా వెనుకబడి ఉంది. ప్రాజెక్ట్ ఆర్థిక వ్యవహారాలు, సాంకేతిక అంశాల నుంచి అంతిమంగా ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు సరఫరా చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఇందుకోసం జలశక్తి శాఖ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ పనుల్లో పురోగతి కనిపించాలనీ ఇప్పటికే 11 రాష్ట్రాలు వంద శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయని ఈ ఏడాది ఆ జాబితాలో రాష్ట్రం కూడా ఉండాలని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.

నిధుల వివరాలపై నివేదిక ఇవ్వాలన్న పవన్‌ : జల్ జీవన్ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్​లో విలువైన పనులు చేపట్టే అవకాశం ఉంది. అయితే గత పాలకులు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో కేంద్రం నుంచి నిధులు విడుదల కాలేదు. విడుదలైన నిధులను కూడా సద్వినియోగం చేశారా లేదా అని విషయంపైనా పవన్‌ కల్యాణ్‌ వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

38 లక్షలకు పైగా ఇళ్లకే కుళాయి కనెక్షన్లు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే జల్ జీవన్‌ మిషన్‌ పథకంలో భాగంగా రూ.26,769,82 కోట్ల వ్యయంతో 2024 మార్చికి మొత్తం 64,79,598 కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం వాటా భరించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఏపీ సర్కార్ తన వాటా నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేయని కారణంగా ఇప్పటివరకు గత నాలుగేళ్లలో 38,63,776 ఇళ్లకే కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. ఇంకా 26,15,822 ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వాలి.

మరోవైపు తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలు, ఇంకో 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇళ్లకు 100శాతం కుళాయి కనెక్షన్లు ఇచ్చి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. జల జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టుకి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఎప్పటికప్పుడు కేటాయించని కారణంగా పనులకు టెండర్లు వేయాలంటేనే గుత్తేదారులు ఆసక్తి చూపలేదు.

Jal Jeevan Mission Implementation in AP: "జగన్‌ ప్రభుత్వానికి.. నీళ్లిచ్చే మనసులేదా?".. జలజీవన్‌ మిషన్‌ పథకం అమలుపై అలసత్వం

Jal Jeevan Mission Scheme in AP : కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ నిధుల విషయానికి వస్తే మాత్రం రాష్ట్రంలో రూ.4,000 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు గణాంకాలు చూపిస్తున్నాయి. అయితే వాటి ఫలితాలు ఏ స్థాయిలో ఉన్నాయి? క్షేత్ర స్థాయిలో పనులు ఏ విధంగా చేశారు? అనే అంశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నిశితంగా పరిశీలిస్తున్నారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు.

గ్రామీణ నీటిపారుదల వ్యవస్థ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనులపై ఆరా తీశారు. ఈ పథకం కింద కేంద్ర నుంచి రూ.4,000 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే గత ఐదేళ్లు ఖర్చు చేసిన నిధులను జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు వాటర్‌ ప్లాంట్ నుంచి ఇంటి కుళాయికి చేరే వరకూ ఏ స్థాయిలో ఖర్చు చేశారనే దానిపై పవన్ ఆరా తీశారు. దీనిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. అన్ని దశల్లో నిపుణులతో తనిఖీలు చేయించాలని నిర్ణయించారు. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు నిబంధనల్లో నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను అనుసరించి పైపులు వేస్తున్నదీ లేనిది పరిశీలన చేయనున్నారు.

వైఎస్సార్సీపీ హయాంలో జలజీవన్ మిషన్ అస్తవ్యస్తం - కుళాయి ఉన్న చుక్క నీరందని పరిస్థితి - Jal Jeevan Mission failed at YCP

YSRCP Neglect on Jal Jeevan Mission : గ్రామాలకు రక్షిత తాగునీటి సరఫరాకు సంబంధించిన ప్లాంట్ల నిర్మాణం, పైపు లైన్లు, ఇంటింటికీ కుళాయిలు సమకూర్చడం వంటి పనుల పురోగతిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే చాలా వెనుకబడి ఉంది. ప్రాజెక్ట్ ఆర్థిక వ్యవహారాలు, సాంకేతిక అంశాల నుంచి అంతిమంగా ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు సరఫరా చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఇందుకోసం జలశక్తి శాఖ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ పనుల్లో పురోగతి కనిపించాలనీ ఇప్పటికే 11 రాష్ట్రాలు వంద శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయని ఈ ఏడాది ఆ జాబితాలో రాష్ట్రం కూడా ఉండాలని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.

నిధుల వివరాలపై నివేదిక ఇవ్వాలన్న పవన్‌ : జల్ జీవన్ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్​లో విలువైన పనులు చేపట్టే అవకాశం ఉంది. అయితే గత పాలకులు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో కేంద్రం నుంచి నిధులు విడుదల కాలేదు. విడుదలైన నిధులను కూడా సద్వినియోగం చేశారా లేదా అని విషయంపైనా పవన్‌ కల్యాణ్‌ వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

38 లక్షలకు పైగా ఇళ్లకే కుళాయి కనెక్షన్లు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే జల్ జీవన్‌ మిషన్‌ పథకంలో భాగంగా రూ.26,769,82 కోట్ల వ్యయంతో 2024 మార్చికి మొత్తం 64,79,598 కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం వాటా భరించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఏపీ సర్కార్ తన వాటా నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేయని కారణంగా ఇప్పటివరకు గత నాలుగేళ్లలో 38,63,776 ఇళ్లకే కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. ఇంకా 26,15,822 ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వాలి.

మరోవైపు తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలు, ఇంకో 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇళ్లకు 100శాతం కుళాయి కనెక్షన్లు ఇచ్చి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. జల జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టుకి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఎప్పటికప్పుడు కేటాయించని కారణంగా పనులకు టెండర్లు వేయాలంటేనే గుత్తేదారులు ఆసక్తి చూపలేదు.

Jal Jeevan Mission Implementation in AP: "జగన్‌ ప్రభుత్వానికి.. నీళ్లిచ్చే మనసులేదా?".. జలజీవన్‌ మిషన్‌ పథకం అమలుపై అలసత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.