ETV Bharat / state

మహిళతో దురుసు ప్రవర్తన - మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్​ సస్పెండ్

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2024, 3:30 PM IST

Updated : Feb 6, 2024, 5:10 PM IST

Cyberabad Cp Avinash Mahanthi Suspended Miyapur CI : మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్​ను సస్పెండ్​ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో సీఐ ప్రేమ్ కుమార్ దురుసుగా ప్రవర్తించినట్లు విచారణలో నిర్ధారణ కావడంతో సీఐపై సస్పెన్షన్​ వేటు వేశారు.

Cyberabad CP Avinash Mahanthi Suspended Miyapur CI
మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్​ను సస్పెండ్​ చేస్తూ సైబరాబాద్ సీపీ

Cyberabad CP Avinash Mahanthi Suspended Miyapur CI : మహిళతో దురుసుగా ప్రవర్తించిన తీరుపై మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్​పై వేటు పడింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సీఐ ప్రేమ్​ కుమార్​ను సస్పెండ్ చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన తనతో సీఐ ప్రేమ్ కుమార్ దురుసుగా ప్రవర్తించినట్లు ఆ మహిళ సైబరాబాద్ పోలీస్ కమిషనర్​కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై అంతర్గత విచారణ జరిపించిన సీపీ సీఐ ప్రేమ్ కుమార్​ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీచేశారు.

Police Transfer And Suspension In Telangana : నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు శాఖలో బదిలీల వేటు పడింది. వివిధ విషయాల్లో జోక్యం చేసుకున్న పోలీసులపై సమగ్ర విచారణ జరిపి సస్పెండ్​ చేస్తూ పోలీస్​ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. పోలీసు శాఖలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులపై గట్టి నిఘా పెట్టింది. ఆయా పోలీస్​ స్టేషన్​లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై కూడా సమగ్ర విచారణ చేపట్టి సస్పెండ్​ వేటు వేస్తున్నారు.

గత ఫిబ్రవరి 1న గోపాలపురం ఇన్‌స్పెక్టర్‌ మురళీధర్‌, ఎస్సై దీక్షిత్‌రెడ్డిలను నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఇన్‌స్పెక్టర్‌ మురళీధర్‌, ఎస్సై దీక్షిత్‌రెడ్డిలపై సస్పెన్షన్​ వేటు వేశారు.

CI Arrest in MLA Shakeel Son Case : మరోవైపు మాజీ ఎమ్మెల్యే షకిల్​ కుమారుడి ర్యాష్​ డ్రైవింగ్​ కేసులో పోలీసులపై వేటు పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులకు సహకరించిన సీఐ దుర్గారావుపై సస్పెన్షన్​ వేటు పడింది. ఈ నేపథ్యంలో సీఐ దుర్గారావు పరారీలో ఉన్నారు. తాజాగా ఈ నెల 5న సీఐ దుర్గారావును ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో పట్టుకున్నారు. ఆయనను డీజీపీ కార్యాలయంలో విచారణ చేసిన అనంతరం అరెస్టు​ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

Panjagutta PS Transfers 2024 : ఇటీవల హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి పోలీసుల బదిలీలపై సంచలన నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఒక్కరోజులో మొత్తం 86 మంది పోలీసుల సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కొంతకాలంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్​లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఒకే స్టేషన్‌లో 86 మందిని బదిలీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి ర్యాష్ డ్రైవింగ్​ కేసు - పంజాగుట్ట మాజీ సీఐ అరెస్ట్​

రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్​ల బదిలీ - టీఎస్​పీఎస్సీ నూతన కార్యదర్శిగా నవీన్ నికోలస్​

Cyberabad CP Avinash Mahanthi Suspended Miyapur CI : మహిళతో దురుసుగా ప్రవర్తించిన తీరుపై మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్​పై వేటు పడింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సీఐ ప్రేమ్​ కుమార్​ను సస్పెండ్ చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన తనతో సీఐ ప్రేమ్ కుమార్ దురుసుగా ప్రవర్తించినట్లు ఆ మహిళ సైబరాబాద్ పోలీస్ కమిషనర్​కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై అంతర్గత విచారణ జరిపించిన సీపీ సీఐ ప్రేమ్ కుమార్​ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీచేశారు.

Police Transfer And Suspension In Telangana : నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు శాఖలో బదిలీల వేటు పడింది. వివిధ విషయాల్లో జోక్యం చేసుకున్న పోలీసులపై సమగ్ర విచారణ జరిపి సస్పెండ్​ చేస్తూ పోలీస్​ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. పోలీసు శాఖలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులపై గట్టి నిఘా పెట్టింది. ఆయా పోలీస్​ స్టేషన్​లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై కూడా సమగ్ర విచారణ చేపట్టి సస్పెండ్​ వేటు వేస్తున్నారు.

గత ఫిబ్రవరి 1న గోపాలపురం ఇన్‌స్పెక్టర్‌ మురళీధర్‌, ఎస్సై దీక్షిత్‌రెడ్డిలను నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఇన్‌స్పెక్టర్‌ మురళీధర్‌, ఎస్సై దీక్షిత్‌రెడ్డిలపై సస్పెన్షన్​ వేటు వేశారు.

CI Arrest in MLA Shakeel Son Case : మరోవైపు మాజీ ఎమ్మెల్యే షకిల్​ కుమారుడి ర్యాష్​ డ్రైవింగ్​ కేసులో పోలీసులపై వేటు పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులకు సహకరించిన సీఐ దుర్గారావుపై సస్పెన్షన్​ వేటు పడింది. ఈ నేపథ్యంలో సీఐ దుర్గారావు పరారీలో ఉన్నారు. తాజాగా ఈ నెల 5న సీఐ దుర్గారావును ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో పట్టుకున్నారు. ఆయనను డీజీపీ కార్యాలయంలో విచారణ చేసిన అనంతరం అరెస్టు​ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

Panjagutta PS Transfers 2024 : ఇటీవల హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి పోలీసుల బదిలీలపై సంచలన నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఒక్కరోజులో మొత్తం 86 మంది పోలీసుల సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కొంతకాలంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్​లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఒకే స్టేషన్‌లో 86 మందిని బదిలీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి ర్యాష్ డ్రైవింగ్​ కేసు - పంజాగుట్ట మాజీ సీఐ అరెస్ట్​

రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్​ల బదిలీ - టీఎస్​పీఎస్సీ నూతన కార్యదర్శిగా నవీన్ నికోలస్​

Last Updated : Feb 6, 2024, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.