Criminal Cases Registered Against Officials : హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో చెరువుల్లో కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు హైడ్రా చేసిన సిఫారసు ఆధారంగా సైబరాబాద్ పోలీసులు ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ వింగ్లో కేసులు నమోదుచేసినట్టు సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. ఈ కేసులు నమోదు చేసిన వారిలో నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుదాంశు, బాచుపల్లి ఎమ్మార్వో పూల్సింగ్, మేడ్చల్-మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్కుమార్, హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజ్కుమార్లపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎఫ్టీఎల్లో అనుమతులు ఇచ్చినందుకు ఆయా అధికారులపై చర్యలు చేపట్టాలని రెండురోజుల క్రితం హైడ్రా చేసిన సిఫారసుల ఆధారంగా సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
అక్రమ నిర్మాణాలకు అనుమతులు - హైడ్రా సిఫార్సుతో ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు - HYDRA Action Against Officials - HYDRA ACTION AGAINST OFFICIALS
HYDRA Action Against Officials : హైదరాబాద్ నగర పరిధిలోని చెరువుల్లో అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు చేపట్టారు. ఈమేరకు ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హైడ్రా ఫిర్యాదుతో సైబరాబాద్ ఆర్థిక నేర యూనిట్లో కేసులు నమోదయ్యాయి. మరోవైపు నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

Published : Aug 31, 2024, 2:21 PM IST
Criminal Cases Registered Against Officials : హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో చెరువుల్లో కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు హైడ్రా చేసిన సిఫారసు ఆధారంగా సైబరాబాద్ పోలీసులు ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ వింగ్లో కేసులు నమోదుచేసినట్టు సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. ఈ కేసులు నమోదు చేసిన వారిలో నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుదాంశు, బాచుపల్లి ఎమ్మార్వో పూల్సింగ్, మేడ్చల్-మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్కుమార్, హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజ్కుమార్లపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎఫ్టీఎల్లో అనుమతులు ఇచ్చినందుకు ఆయా అధికారులపై చర్యలు చేపట్టాలని రెండురోజుల క్రితం హైడ్రా చేసిన సిఫారసుల ఆధారంగా సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు.