ETV Bharat / state

పులివెందులలో పెండింగ్ బిల్లుల గోల - భరించలేక భార్యతో బెంగళూరుకు జగన్ జంప్ - Pending Bills in Pulivendula

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 25, 2024, 7:03 AM IST

Contractors Worried about Pending Bills in Pulivendula: ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో ఎన్నడూ ప్రజలను కలవని జగన్‌ ఓటమి తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గ ప్రజలు, నేతలకు ఆ అవకాశం ఇచ్చారు. ఓటమి బాధలో ఉన్న తనను ఓదార్చి అండగా ఉంటారని ఆశించిన ఆయనకు తీవ్ర భంగపాటు ఎదురైంది. వచ్చిన వారు ఓదార్చడం మాట అటుంచితే తాము చేసిన పనుల పెండింగ్‌ బిల్లుల సంగతేంటని నిలదీయడంతో ఆయన అవాక్కయ్యారు. విషయం తేల్చకుంటే రాజీనామాలు చేస్తామని బెదిరింపులకు దిగడంతో పర్యాటన అర్థాంతరంగా ముగించుకుని బెంగళూరు వెళ్లిపోయారు.

Contractors Worried  about Pending Bills in Pulivendula
Contractors Worried about Pending Bills in Pulivendula (ETV Bharat)

Contractors Worried about Pending Bills in Pulivendula : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర ఓటమి తర్వాత తొలిసారి పులివెందులకు వచ్చిన మాజీ సీఎం జగన్‌ను స్థానిక నేతలు ఉక్కిరిబిక్కిరి చేశారు. పెండింగ్ బిల్లులు సంగతి తేల్చాలంటూ నిలదీయడంతో తన పర్యటన అర్థాంతరంగా ముగించుకుని సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా పులివెందుల నివాసంలో మూడురోజులు ఉండటంతోపాటు ప్రజలను నేరుగా కలుసుకునే అవకాశం ఇచ్చారు. దీంతో చాలామంది గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల బకాయిల గురించే ఆయన వద్ద ప్రస్తావించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం నేతలకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పాలుచేసిన విషయాన్ని గుర్తుచేస్తూ ఇప్పుడు వారు కూడా అదే పంథా అనుసరిస్తే తమ పరిస్థితి ఏంటని వారు జగన్‌ వద్ద వాపోయారు.

EX CM Jagan Bangalore Tour Reasons : పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ కింద 2019-20 ఆర్థిక సంవత్సరంలో 963 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిల్లో చాలా వరకు ప్రజలకు ఉపయోగం లేని పనులే అయినా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలను మచ్చిక చేసుకునేందుకు ఇష్టానుసారం పనులు అప్పగించారు. వీటిల్లో చాలావరకు పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే వీరిలో బడా నేతలకు మాత్రం ముందు బిల్లులు చెల్లించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిన్నా, చితకా నేతల బిల్లులను పెండింగ్‌లో పెట్టింది.

అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశాం- బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తోంది: కాంట్రాక్టర్లు - Water Supply Contractors Meeting

పాడా పనులు, బిల్లుల చెల్లింపులో అక్రమాలు జరిగాయని వీటిపై విచారణ జరపాలని తెలుగుదేశం నేతలు పట్టుబడుతున్నారు. అందుకు అనుగుణంగానే పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డిని రిలీవ్ చేయకుండా కూటమి ప్రభుత్వం అక్కడే ఉంచింది. దీంతో పాడా పనులు చేసిన చిన్నచిన్న గుత్తేదారుల గుండెల్లో రైళ్లు పరుగుడెతున్నాయి. తమ బిల్లుల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.

పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరిక : పులివెందుల పురపాలక సంఘానికి చెందిన పలువురు మహిళా కౌన్సిలర్లు జగన్ సతీమణి భారతి వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఆమె వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. తమ పెండింగ్ బిల్లులు ఇప్పించకుంటే పార్టీకి రాజీనామా చేస్తామని పదిమంది కౌన్సిలర్లు హెచ్చరించారు. ఇప్పటికే 230 కోట్లు వరకు బిల్లులు పెండిగ్‌లో ఉండగా మరో వందకోట్ల వరకు బిల్లులు అప్‌లోడ్ చేయాల్సి ఉంది. వీటికి పూచీకత్తు ఇవ్వాలని బాధితులు జగన్‌ను నిలదీశారు.

మాటల్లో గొప్పతనం.! చెల్లింపుల్లో చేతకాని తనం.! - YCP Govt Delaying Payment

మూడు రోజులకే బెంగళూరు జంప్ : కాలేటివాగు ప్రాజెక్టుకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, పులివెందుల వైద్య కళాశాల నిర్మాణ గుత్తేదారుకు ఎన్నికలకు ముందే చెల్లింపులు చేసి మాకు మాత్రం ఆపుతారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా మూడు రోజుల పాటు వచ్చిన వారంతా పెండింగ్ బిల్లులు గురించే నిలదీయంతో జగన్ అసహనానికి గురయ్యారు. ఇప్పుడు కూడా నన్ను వదిలిపెట్టరా? అంటూ మండిపడినట్లు సమాచారం. ఐదు రోజుల పాటు పులివెందులలోనే ఉండాలని వచ్చిన జగన్‌ ఈ పెండింగ్ బిల్లుల గోల దెబ్బకు మూడు రోజులకే బెంగళూరు పలాయమనయ్యారు.

సొంత పార్టీ పాలక వర్గాలకు జగన్​ సర్కార్​ బుజ్జగింపు - రూ. 530 కోట్లు ఎర - Payment of Bills Before Election

Contractors Worried about Pending Bills in Pulivendula : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర ఓటమి తర్వాత తొలిసారి పులివెందులకు వచ్చిన మాజీ సీఎం జగన్‌ను స్థానిక నేతలు ఉక్కిరిబిక్కిరి చేశారు. పెండింగ్ బిల్లులు సంగతి తేల్చాలంటూ నిలదీయడంతో తన పర్యటన అర్థాంతరంగా ముగించుకుని సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా పులివెందుల నివాసంలో మూడురోజులు ఉండటంతోపాటు ప్రజలను నేరుగా కలుసుకునే అవకాశం ఇచ్చారు. దీంతో చాలామంది గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల బకాయిల గురించే ఆయన వద్ద ప్రస్తావించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం నేతలకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పాలుచేసిన విషయాన్ని గుర్తుచేస్తూ ఇప్పుడు వారు కూడా అదే పంథా అనుసరిస్తే తమ పరిస్థితి ఏంటని వారు జగన్‌ వద్ద వాపోయారు.

EX CM Jagan Bangalore Tour Reasons : పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ కింద 2019-20 ఆర్థిక సంవత్సరంలో 963 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిల్లో చాలా వరకు ప్రజలకు ఉపయోగం లేని పనులే అయినా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలను మచ్చిక చేసుకునేందుకు ఇష్టానుసారం పనులు అప్పగించారు. వీటిల్లో చాలావరకు పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే వీరిలో బడా నేతలకు మాత్రం ముందు బిల్లులు చెల్లించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిన్నా, చితకా నేతల బిల్లులను పెండింగ్‌లో పెట్టింది.

అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశాం- బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తోంది: కాంట్రాక్టర్లు - Water Supply Contractors Meeting

పాడా పనులు, బిల్లుల చెల్లింపులో అక్రమాలు జరిగాయని వీటిపై విచారణ జరపాలని తెలుగుదేశం నేతలు పట్టుబడుతున్నారు. అందుకు అనుగుణంగానే పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డిని రిలీవ్ చేయకుండా కూటమి ప్రభుత్వం అక్కడే ఉంచింది. దీంతో పాడా పనులు చేసిన చిన్నచిన్న గుత్తేదారుల గుండెల్లో రైళ్లు పరుగుడెతున్నాయి. తమ బిల్లుల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.

పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరిక : పులివెందుల పురపాలక సంఘానికి చెందిన పలువురు మహిళా కౌన్సిలర్లు జగన్ సతీమణి భారతి వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఆమె వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. తమ పెండింగ్ బిల్లులు ఇప్పించకుంటే పార్టీకి రాజీనామా చేస్తామని పదిమంది కౌన్సిలర్లు హెచ్చరించారు. ఇప్పటికే 230 కోట్లు వరకు బిల్లులు పెండిగ్‌లో ఉండగా మరో వందకోట్ల వరకు బిల్లులు అప్‌లోడ్ చేయాల్సి ఉంది. వీటికి పూచీకత్తు ఇవ్వాలని బాధితులు జగన్‌ను నిలదీశారు.

మాటల్లో గొప్పతనం.! చెల్లింపుల్లో చేతకాని తనం.! - YCP Govt Delaying Payment

మూడు రోజులకే బెంగళూరు జంప్ : కాలేటివాగు ప్రాజెక్టుకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, పులివెందుల వైద్య కళాశాల నిర్మాణ గుత్తేదారుకు ఎన్నికలకు ముందే చెల్లింపులు చేసి మాకు మాత్రం ఆపుతారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా మూడు రోజుల పాటు వచ్చిన వారంతా పెండింగ్ బిల్లులు గురించే నిలదీయంతో జగన్ అసహనానికి గురయ్యారు. ఇప్పుడు కూడా నన్ను వదిలిపెట్టరా? అంటూ మండిపడినట్లు సమాచారం. ఐదు రోజుల పాటు పులివెందులలోనే ఉండాలని వచ్చిన జగన్‌ ఈ పెండింగ్ బిల్లుల గోల దెబ్బకు మూడు రోజులకే బెంగళూరు పలాయమనయ్యారు.

సొంత పార్టీ పాలక వర్గాలకు జగన్​ సర్కార్​ బుజ్జగింపు - రూ. 530 కోట్లు ఎర - Payment of Bills Before Election

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.