ETV Bharat / state

సీఎం నమ్మక ద్రోహం - జగన్‌ దెబ్బకు విలవిల్లాడుతున్న ఆర్టీసీ ఉద్యోగులు - cm ys jagan cheated rtc employees

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 21, 2024, 11:58 AM IST

CM YS Jagan Cheated RTC Employees: వైసీపీ సర్కార్‌ తమను నయవంచనకు గురిచేసిందని తెలిసి రావడానికి ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతోకాలం పట్టలేదు. 2019 ఎన్నికల్లో హామీలతో ఎరవేసిన జగన్‌, ఓట్లు వేయించుకుని నమ్మకద్రోహానికి తెగబడ్డారు. పేరుకి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా, ఉద్యోగుల సమస్యలను గాలికి వదిలేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రయోజనాలు కల్పించకపోగా ఆర్టీసీలో ఉన్నప్పుడు దక్కిన సదుపాయాలనూ కోసేశారు. విలీనం జరిగి నాలుగేళ్లు గడిచినా ఏ పింఛను ఇస్తారో చెప్పడంలేదు.

CM_YS_Jagan_Cheated_RTC_Employees
CM_YS_Jagan_Cheated_RTC_Employees
సీఎం నమ్మక ద్రోహం - జగన్‌ దెబ్బకు విలవిల్లాడుతున్న ఆర్టీసీ ఉద్యోగులు

CM YS Jagan Cheated RTC Employees: జగన్‌ ప్రభుత్వానికి ఓ దండమంటూ ఆర్టీసీ ఉద్యోగులు కుమిలిపోతున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. ప్రభుత్వంలో విలీనానికి ముందు ఆర్టీసీలో నాలుగేళ్లకు ఒకసారి వేతన సవరణ జరిగేది. 2017లో చివరగా వేతన సవరణ చేశారు. 2017వ సంవత్సరం ఏప్రిల్‌ నుంచి 2019 ఫిబ్రవరి వరకు 22 నెలల బకాయిలు చెల్లించాల్సి ఉంది.

అంతే కాకుండా సంస్థలోని 51 వేల మంది ఉద్యోగులందరికీ ఒకేసారి బకాయిలు ఇవ్వలేదు. తొలుత ఉద్యోగ విరమణ చేస్తున్న వారికే చెలిస్తామని మెలిక పెట్టారు. విలీనం కారణంగా వేతన సవరణ రూపంలో ఆర్టీసీ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతోంది. కరవు భత్యం చెల్లింపులోనూ వాయిదాల పద్ధతినే జగన్ సర్కార్‌ పాటిస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగులకున్న పాత పింఛన్‌ను తమకూ వర్తింపజేస్తారని నమ్మిన ఆర్టీసీ ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసింది. పాత పింఛను ఊసే ఎత్తొద్దంది. ఏ పింఛను ఇవ్వాలనే అంశంపై నాలుగేళ్లు కాలయాపన చేసింది. ఈపీఎఫ్‌ పింఛనులో కొనసాగుతారా? కాంట్రిబ్యూటరీ పింఛను పథకంలో (CPS) చేరి ప్రభుత్వ గ్యారంటీ పింఛను పథకం (GPS) పొందుతారా? అని ఆప్షన్స్‌ ఇవ్వమంది. పదేళ్ల సర్వీసు ఉంటేనే జీపీఎస్​కు అర్హత ఉంటుందని, 33 ఏళ్ల సర్వీసు ఉంటే పూర్తిస్థాయి జీపీఎస్​ అందుతుందనే నిబంధనలు ఉన్నాయి. అత్యధిక ఉద్యోగులు ఈపీఎఫ్ (Employees Provident Fund) పింఛనులోనే కొనసాగుతామన్నారు.

గాడి తప్పిన ఆర్టీసీ - విలీనం చేసి చేతులు దులుపుకున్న జగన్‌ - అయిదేళ్లుగా నియామకాలు నిల్

పథకాలను రద్దు చేశారు: ఆర్టీసీ ఉద్యోగుల భాగస్వామ్యంతో గతంలో కొనసాగిన రెండు పథకాలనూ ప్రభుత్వంలో విలీనమయ్యాక యాజమాన్యం రద్దు చేసింది. స్టాఫ్‌ బెనిఫిట్‌ ట్రస్ట్‌ (SBT) కింద సర్వీసులో ఉన్న ఉద్యోగి చనిపోతే బాధిత కుటుంబానికి లక్షన్నర రూపాయలతోపాటు, ఆ ఉద్యోగి నుంచి సేకరించిన చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా అందించేవారు. ఉద్యోగి రిటైరైతే వడ్డీతో సహా మొత్తం ఇచ్చేవారు. ప్రభుత్వంలో విలీనమయ్యాక 55 ఏళ్లలోపు ఉన్న ఉద్యోగులకు ఎస్​బీటీ నిలిపేశారు.

వీరికి ఏపీ ప్రభుత్వ జీవిత బీమా (APGLIC) వర్తింపజేశారు. 55 ఏళ్లు దాటని వారికి ఏపీజీఎల్​ఐసీకి అర్హత లేకపోవడంతో వారికి ఎస్​బీటీనే కొనసాగుతోంది. ఎస్​బీటీ రద్దైన వారికి ఇన్నేళ్లు వారు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాల్సి ఉంది. 2026-27 వరకు రిటైర్‌ అయ్యేవారికి మాత్రమే చెల్లించారు. ఆర్టీసీలో పదవీ విరమణ ప్రయోజనం పథకం (SRBS) కొనసాగింది. ఈ పథకంలో భాగంగా ప్రతినెలా ఉద్యోగి జీతం నుంచి కొంత పక్కనబెట్టి, దానికి యాజమాన్య వాటా జతచేసి, ఉద్యోగి రిటైర్‌ అయితే నెలకు 3,200 వరకు నగదు ప్రయోజనంగా ఇచ్చేవారు.

ఆ ఉద్యోగి మరణిస్తే జీవిత భాగస్వామికి అందులో సగం అందించేవారు. ప్రభుత్వంలో విలీనమయ్యాక ఎస్​ఆర్​బీఎస్ నిలిపేశారు. ఈ పథకం రద్దవడంతో, వారు ప్రతినెలా చెల్లించిన మొత్తాన్నీ వెనక్కి ఇవ్వాల్సి పరిస్థితి ఉంది. కానీ 2026-27 వరకు రిటైర్‌ అయ్యే ఉద్యోగులకు మాత్రమే సెటిల్‌మెంట్‌ చేశారు. మిగిలిన ఉద్యోగులకు ఎప్పుడిస్తారో స్పష్టత లేదు.

ఆర్టీసీ రథ చక్రాలకు కళ్లెం వేసిన జగన్ సర్కార్ - వేగంగా ప్రైవేటు పరం! - Jagan destroyed RTC

ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందడంలేదు: ఆర్టీసీ ఉద్యోగులకు గతంలో వైద్య పరీక్షలు జరిపిస్తే, 45 వేల 310 మందికి వివిధ అనారోగ్య సమస్యలున్నట్లు తేలింది. వీరికి నగదు పరిమితిలేని వైద్యాన్ని యాజమాన్యం ఉచితంగా అందించింది. ఆర్టీసీ ఆసుపత్రులతోపాటు వ్యాధిని బట్టి రిఫరల్‌ ఆసుపత్రులకు పంపేవారు. ప్రభుత్వంలో విలీనమయ్యాక ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమలు చేస్తున్నారు. అనేక ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందడంలేదు.

ఆర్టీసీలో రిటైర్‌ అయ్యేముందు ఉద్యోగులకిచ్చే సెటిల్‌మెంట్‌ సొమ్ములో 25 వేల నుంచి 30 వేల మధ్య తీసుకొని, ఆ ఉద్యోగికి, భాగస్వామికి జీవితాంతం ఆర్టీసీ తరపున వైద్యం అందించేవారు. విలీనమయ్యాక రిటైర్‌ అవుతున్న వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. వీరికి ఆర్టీసీ వైద్యం పొందే సదుపాయం లేదు. ప్రభుత్వ పింఛను తీసుకుంటేనే ఈహెచ్​ఎస్ ద్వారా వైద్యం పొందొచ్చు. ప్రస్తుతం రిటైర్‌ అవుతున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఎలాంటి పెన్షన్ లేదు. అంటే ఏవైద్యమూ అందే అవకాశం లేకుండా పోయింది.

రాత్రిపూట పనిచేసే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లుకు ప్రతినెలా జీతంతోపాటు భత్యం చెల్లించేవారు. ప్రభుత్వంలో విలీనమయ్యాక దీన్ని ఆపేశారు. ఉద్యోగ సంఘాలు పదేపదే విన్నవించడంతో భత్యం ఇచ్చేందుకు అంగీకరించినా, జీతంతో కాకుండా వేరుగా ఇస్తున్నారు. ఇప్పటికీ 47 డిపోల ఉద్యోగులకు జీతంతోపాటు భత్యం అందడంలేదు. పీఎఫ్‌ కంట్రిబ్యూషన్, కోపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ (CCS) రుణ రికవరీ వంటి కోసం కట్‌ చేసుకున్న 100 కోట్లు ఆయా సంస్థలకు చెల్లించడంలేదు.

రాష్ట్రంలో నానాటికీ దిగజారుతున్న ఆర్టీసీ పరిస్థితి - సగానికిపైగా డొక్కు బస్సులే

సంస్థ ఆదాయం నుంచి 25 శాతం వాటా: ఇక ఆర్టీసీ ఉద్యోగులపై యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే గతంలో మూడు స్థాయిల్లో అప్పీలుకు అవకాశం ఉండేది. విలీనం తర్వాత ఇప్పుడు రెండుస్థాయిలోనే అప్పీలుకు అవకాశమిచ్చారు. హైకోర్టును ఆశ్రయిస్తే కేసు పూర్తయ్యేసరికి ఏళ్లు పట్టే అవకాశం ఉందని ఉద్యోగులు వాపోతున్నారు.

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రస్తుతం ప్రభుత్వమే జీతాలు ఇస్తున్నప్పటికీ సంస్థ ఆదాయం నుంచి 25 శాతం వాటా తీసుకుంటోంది. ఆర్టీసీకి నెలకు 500 కోట్ల నుంచి 600 కోట్ల రాబడి ఉంటే అందులో నుంచి 125 కోట్ల నుంచి 150 కోట్లను తన ఖజానాలో వేసుకుంటోంది. ప్రభుత్వం ఒక ఏడాదిపాటు వాటాను తీసుకోకుంటే, ఉద్యోగుల అన్ని బకాయిలను చెల్లించే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడటం లేదు.

ఆర్టీసీ ఉద్యోగులకు కొరవడిన ఆరోగ్య భద్రత - అప్పుడు అలా, ఇప్పుడు ఇలా!

సీఎం నమ్మక ద్రోహం - జగన్‌ దెబ్బకు విలవిల్లాడుతున్న ఆర్టీసీ ఉద్యోగులు

CM YS Jagan Cheated RTC Employees: జగన్‌ ప్రభుత్వానికి ఓ దండమంటూ ఆర్టీసీ ఉద్యోగులు కుమిలిపోతున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. ప్రభుత్వంలో విలీనానికి ముందు ఆర్టీసీలో నాలుగేళ్లకు ఒకసారి వేతన సవరణ జరిగేది. 2017లో చివరగా వేతన సవరణ చేశారు. 2017వ సంవత్సరం ఏప్రిల్‌ నుంచి 2019 ఫిబ్రవరి వరకు 22 నెలల బకాయిలు చెల్లించాల్సి ఉంది.

అంతే కాకుండా సంస్థలోని 51 వేల మంది ఉద్యోగులందరికీ ఒకేసారి బకాయిలు ఇవ్వలేదు. తొలుత ఉద్యోగ విరమణ చేస్తున్న వారికే చెలిస్తామని మెలిక పెట్టారు. విలీనం కారణంగా వేతన సవరణ రూపంలో ఆర్టీసీ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతోంది. కరవు భత్యం చెల్లింపులోనూ వాయిదాల పద్ధతినే జగన్ సర్కార్‌ పాటిస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగులకున్న పాత పింఛన్‌ను తమకూ వర్తింపజేస్తారని నమ్మిన ఆర్టీసీ ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసింది. పాత పింఛను ఊసే ఎత్తొద్దంది. ఏ పింఛను ఇవ్వాలనే అంశంపై నాలుగేళ్లు కాలయాపన చేసింది. ఈపీఎఫ్‌ పింఛనులో కొనసాగుతారా? కాంట్రిబ్యూటరీ పింఛను పథకంలో (CPS) చేరి ప్రభుత్వ గ్యారంటీ పింఛను పథకం (GPS) పొందుతారా? అని ఆప్షన్స్‌ ఇవ్వమంది. పదేళ్ల సర్వీసు ఉంటేనే జీపీఎస్​కు అర్హత ఉంటుందని, 33 ఏళ్ల సర్వీసు ఉంటే పూర్తిస్థాయి జీపీఎస్​ అందుతుందనే నిబంధనలు ఉన్నాయి. అత్యధిక ఉద్యోగులు ఈపీఎఫ్ (Employees Provident Fund) పింఛనులోనే కొనసాగుతామన్నారు.

గాడి తప్పిన ఆర్టీసీ - విలీనం చేసి చేతులు దులుపుకున్న జగన్‌ - అయిదేళ్లుగా నియామకాలు నిల్

పథకాలను రద్దు చేశారు: ఆర్టీసీ ఉద్యోగుల భాగస్వామ్యంతో గతంలో కొనసాగిన రెండు పథకాలనూ ప్రభుత్వంలో విలీనమయ్యాక యాజమాన్యం రద్దు చేసింది. స్టాఫ్‌ బెనిఫిట్‌ ట్రస్ట్‌ (SBT) కింద సర్వీసులో ఉన్న ఉద్యోగి చనిపోతే బాధిత కుటుంబానికి లక్షన్నర రూపాయలతోపాటు, ఆ ఉద్యోగి నుంచి సేకరించిన చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా అందించేవారు. ఉద్యోగి రిటైరైతే వడ్డీతో సహా మొత్తం ఇచ్చేవారు. ప్రభుత్వంలో విలీనమయ్యాక 55 ఏళ్లలోపు ఉన్న ఉద్యోగులకు ఎస్​బీటీ నిలిపేశారు.

వీరికి ఏపీ ప్రభుత్వ జీవిత బీమా (APGLIC) వర్తింపజేశారు. 55 ఏళ్లు దాటని వారికి ఏపీజీఎల్​ఐసీకి అర్హత లేకపోవడంతో వారికి ఎస్​బీటీనే కొనసాగుతోంది. ఎస్​బీటీ రద్దైన వారికి ఇన్నేళ్లు వారు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాల్సి ఉంది. 2026-27 వరకు రిటైర్‌ అయ్యేవారికి మాత్రమే చెల్లించారు. ఆర్టీసీలో పదవీ విరమణ ప్రయోజనం పథకం (SRBS) కొనసాగింది. ఈ పథకంలో భాగంగా ప్రతినెలా ఉద్యోగి జీతం నుంచి కొంత పక్కనబెట్టి, దానికి యాజమాన్య వాటా జతచేసి, ఉద్యోగి రిటైర్‌ అయితే నెలకు 3,200 వరకు నగదు ప్రయోజనంగా ఇచ్చేవారు.

ఆ ఉద్యోగి మరణిస్తే జీవిత భాగస్వామికి అందులో సగం అందించేవారు. ప్రభుత్వంలో విలీనమయ్యాక ఎస్​ఆర్​బీఎస్ నిలిపేశారు. ఈ పథకం రద్దవడంతో, వారు ప్రతినెలా చెల్లించిన మొత్తాన్నీ వెనక్కి ఇవ్వాల్సి పరిస్థితి ఉంది. కానీ 2026-27 వరకు రిటైర్‌ అయ్యే ఉద్యోగులకు మాత్రమే సెటిల్‌మెంట్‌ చేశారు. మిగిలిన ఉద్యోగులకు ఎప్పుడిస్తారో స్పష్టత లేదు.

ఆర్టీసీ రథ చక్రాలకు కళ్లెం వేసిన జగన్ సర్కార్ - వేగంగా ప్రైవేటు పరం! - Jagan destroyed RTC

ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందడంలేదు: ఆర్టీసీ ఉద్యోగులకు గతంలో వైద్య పరీక్షలు జరిపిస్తే, 45 వేల 310 మందికి వివిధ అనారోగ్య సమస్యలున్నట్లు తేలింది. వీరికి నగదు పరిమితిలేని వైద్యాన్ని యాజమాన్యం ఉచితంగా అందించింది. ఆర్టీసీ ఆసుపత్రులతోపాటు వ్యాధిని బట్టి రిఫరల్‌ ఆసుపత్రులకు పంపేవారు. ప్రభుత్వంలో విలీనమయ్యాక ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమలు చేస్తున్నారు. అనేక ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందడంలేదు.

ఆర్టీసీలో రిటైర్‌ అయ్యేముందు ఉద్యోగులకిచ్చే సెటిల్‌మెంట్‌ సొమ్ములో 25 వేల నుంచి 30 వేల మధ్య తీసుకొని, ఆ ఉద్యోగికి, భాగస్వామికి జీవితాంతం ఆర్టీసీ తరపున వైద్యం అందించేవారు. విలీనమయ్యాక రిటైర్‌ అవుతున్న వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. వీరికి ఆర్టీసీ వైద్యం పొందే సదుపాయం లేదు. ప్రభుత్వ పింఛను తీసుకుంటేనే ఈహెచ్​ఎస్ ద్వారా వైద్యం పొందొచ్చు. ప్రస్తుతం రిటైర్‌ అవుతున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఎలాంటి పెన్షన్ లేదు. అంటే ఏవైద్యమూ అందే అవకాశం లేకుండా పోయింది.

రాత్రిపూట పనిచేసే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లుకు ప్రతినెలా జీతంతోపాటు భత్యం చెల్లించేవారు. ప్రభుత్వంలో విలీనమయ్యాక దీన్ని ఆపేశారు. ఉద్యోగ సంఘాలు పదేపదే విన్నవించడంతో భత్యం ఇచ్చేందుకు అంగీకరించినా, జీతంతో కాకుండా వేరుగా ఇస్తున్నారు. ఇప్పటికీ 47 డిపోల ఉద్యోగులకు జీతంతోపాటు భత్యం అందడంలేదు. పీఎఫ్‌ కంట్రిబ్యూషన్, కోపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ (CCS) రుణ రికవరీ వంటి కోసం కట్‌ చేసుకున్న 100 కోట్లు ఆయా సంస్థలకు చెల్లించడంలేదు.

రాష్ట్రంలో నానాటికీ దిగజారుతున్న ఆర్టీసీ పరిస్థితి - సగానికిపైగా డొక్కు బస్సులే

సంస్థ ఆదాయం నుంచి 25 శాతం వాటా: ఇక ఆర్టీసీ ఉద్యోగులపై యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే గతంలో మూడు స్థాయిల్లో అప్పీలుకు అవకాశం ఉండేది. విలీనం తర్వాత ఇప్పుడు రెండుస్థాయిలోనే అప్పీలుకు అవకాశమిచ్చారు. హైకోర్టును ఆశ్రయిస్తే కేసు పూర్తయ్యేసరికి ఏళ్లు పట్టే అవకాశం ఉందని ఉద్యోగులు వాపోతున్నారు.

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రస్తుతం ప్రభుత్వమే జీతాలు ఇస్తున్నప్పటికీ సంస్థ ఆదాయం నుంచి 25 శాతం వాటా తీసుకుంటోంది. ఆర్టీసీకి నెలకు 500 కోట్ల నుంచి 600 కోట్ల రాబడి ఉంటే అందులో నుంచి 125 కోట్ల నుంచి 150 కోట్లను తన ఖజానాలో వేసుకుంటోంది. ప్రభుత్వం ఒక ఏడాదిపాటు వాటాను తీసుకోకుంటే, ఉద్యోగుల అన్ని బకాయిలను చెల్లించే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడటం లేదు.

ఆర్టీసీ ఉద్యోగులకు కొరవడిన ఆరోగ్య భద్రత - అప్పుడు అలా, ఇప్పుడు ఇలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.