ETV Bharat / state

'దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ - భారీ రుణమే రాష్ట్రానికి పెను భారంగా మారింది' - 16th Finance Committee Meeting

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 12:55 PM IST

16th Finance Committee Meeting at Hyderabad : దేశంలోనే తెలంగాణ యంగెస్ట్​ స్టేట్​ అని, ఫ్యూచర్​ స్టేట్​గా పిలుస్తున్నామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. కానీ భారీ రుణ భారమే తెలంగాణకు పెను భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు.

Finance Committee Meeting at Hyderabad
Finance Committee Meeting at Hyderabad (ETV Bharat)

CM Revanth Speech at 16th Finance Committee Meeting : దేశంలోనే తెలంగాణ వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని, దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. హైదరాబాద్​లోని ప్రజాభవన్​లో నిర్వహించిన 16వ ఆర్థక సంఘం సమావేశంలో సీఎం రేవంత్​ రెడ్డి పాల్గొని, ప్రసంగించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ, భారీ రుణ భారం తెలంగాణకు భారంగా మారిందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణభారం రూ.6.85 లక్షల కోట్లకు చేరుకుందని, ఇందులో బడ్జెట్​ రుణాలతో పాటు ఆఫ్​ బడ్జెట్​ రుణాలు ఉన్నాయని గుర్తు చేశారు. గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుందని అన్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉందని సీఎం రేవంత్​ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రుణాల సమస్యను పరిష్కరించేందుకు తమకు తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘాన్ని సీఎం రేవంత్​ కోరారు. రుణాన్ని రీ స్ట్రక్చర్​ చేసే అవకాశం ఇవ్వాలని లేదా తమకు అదనపు ఆర్థిక సహాయాన్ని అందించాలని వేడుకున్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలన్నారు. అన్ని రాష్ట్రాల తరఫున ఈ డిమాండ్​ను ముందు ఉంచుతున్నామన్నారు.

తెలంగాణకు తగినంత సాయం ఇవ్వండి : ఈ డిమాండ్​ను ఆర్థిక సంఘం నెరవేర్చితే, దేశాన్ని ఐదు ట్రిలియన్​ డాలర్ల ఎకానమీగా మార్చాలని ప్రధాని మోదీ ఎంచుకున్న లక్ష్య సాధనకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని సీఎం తెలిపారు. తెలంగాణను తాము ఒక ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. తెలంగాణకు తగినంత సహాయం అందించాలని, అందుకు దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తమ వంతు బాధ్యతను నెరవేరుస్తామని వివరించారు. ఫిస్కల్​ ఫెడరలిజాన్ని బలోపేతం చేయడంలో మీ మద్దతు కోరుతున్నామన్నారు. తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు మీ సిఫారసులు ఉపయోగపడతాయని తాము నమ్ముతున్నట్లు సీఎం రేవంత్​ రెడ్డి అభిప్రాయపడ్డారు.

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వచ్చే వాటాను 50 శాతానికి పెంచాలి : డిప్యూటీ సీఎం - CENTRAL FINANCE COMMISSION meet

కేంద్ర నిధుల్లో రాష్ట్రానికి వాటాలు మరింతగా పెంచండి - 16వ ఆర్థిక సంఘానికి ప్రభుత్వం విజ్ఞప్తి

CM Revanth Speech at 16th Finance Committee Meeting : దేశంలోనే తెలంగాణ వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని, దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. హైదరాబాద్​లోని ప్రజాభవన్​లో నిర్వహించిన 16వ ఆర్థక సంఘం సమావేశంలో సీఎం రేవంత్​ రెడ్డి పాల్గొని, ప్రసంగించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ, భారీ రుణ భారం తెలంగాణకు భారంగా మారిందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణభారం రూ.6.85 లక్షల కోట్లకు చేరుకుందని, ఇందులో బడ్జెట్​ రుణాలతో పాటు ఆఫ్​ బడ్జెట్​ రుణాలు ఉన్నాయని గుర్తు చేశారు. గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుందని అన్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉందని సీఎం రేవంత్​ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రుణాల సమస్యను పరిష్కరించేందుకు తమకు తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘాన్ని సీఎం రేవంత్​ కోరారు. రుణాన్ని రీ స్ట్రక్చర్​ చేసే అవకాశం ఇవ్వాలని లేదా తమకు అదనపు ఆర్థిక సహాయాన్ని అందించాలని వేడుకున్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలన్నారు. అన్ని రాష్ట్రాల తరఫున ఈ డిమాండ్​ను ముందు ఉంచుతున్నామన్నారు.

తెలంగాణకు తగినంత సాయం ఇవ్వండి : ఈ డిమాండ్​ను ఆర్థిక సంఘం నెరవేర్చితే, దేశాన్ని ఐదు ట్రిలియన్​ డాలర్ల ఎకానమీగా మార్చాలని ప్రధాని మోదీ ఎంచుకున్న లక్ష్య సాధనకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని సీఎం తెలిపారు. తెలంగాణను తాము ఒక ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. తెలంగాణకు తగినంత సహాయం అందించాలని, అందుకు దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తమ వంతు బాధ్యతను నెరవేరుస్తామని వివరించారు. ఫిస్కల్​ ఫెడరలిజాన్ని బలోపేతం చేయడంలో మీ మద్దతు కోరుతున్నామన్నారు. తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు మీ సిఫారసులు ఉపయోగపడతాయని తాము నమ్ముతున్నట్లు సీఎం రేవంత్​ రెడ్డి అభిప్రాయపడ్డారు.

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వచ్చే వాటాను 50 శాతానికి పెంచాలి : డిప్యూటీ సీఎం - CENTRAL FINANCE COMMISSION meet

కేంద్ర నిధుల్లో రాష్ట్రానికి వాటాలు మరింతగా పెంచండి - 16వ ఆర్థిక సంఘానికి ప్రభుత్వం విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.