ETV Bharat / state

రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయండి : సీఎం రేవంత్​ రెడ్డి - Skill University in Telangana

CM Revanth's Meeting with Industrial Leaders : హైదరాబాద్​ గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్​ స్టాఫ్​ కాలేజీలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ సమావేశంలో సీఎం రేవంత్​ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరగాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలకు ఒకట్రెండు రోజుల ముందే ఇందుకు సంబంధించి స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని సూచించారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 8, 2024, 6:53 PM IST

CM Revanth
CM Revanth's Meeting with Industrial Leaders (ETV Bharat)

CM Revanth Reddy on Skill University Establishment in Telangana : రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఒకట్రెండు రోజుల ముందే ఇందుకు సంబంధించి స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సీఎం సూచించారు. వాటిని పరిశీలించి, 24 గంటల్లో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీలో సీఎం, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమావేశమయ్యారు.

5 రోజులకోసారి సమావేశమవ్వండి : గచ్చిబౌలిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటికీ అందుబాటులో ఉన్నందున ఈ ప్రాంగణంలో వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని రేవంత్ రెడ్డి సూచించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎస్​బీ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, అంతవరకు ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులందరినీ తాత్కాలిక బోర్డుగా భావించాలని సీఎం నిర్ణయించారు. పరిశ్రమ అవసరాలకు తగినట్లు ఇందులో ఉండాల్సిన కోర్సులు, కరిక్యులమ్​పై అధ్యయనం చేయాలని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు ఇంకా 15 రోజులే ఉన్నందున ప్రతీ 5 రోజులకోసారి సమావేశం కావాలని సీఎం వారికి దిశా నిర్దేశం చేశారు.

నిపుణులైన కన్సల్టెంట్​ను నియమించుకోండి : ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులన్నీ తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణులైన ఒక కన్సల్టెంట్​ను నియమించుకోవాలని సీఎం సూచించారు. ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్​ రంజన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్​ రెడ్డి, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ఛైర్మన్ సతీశ్​ రెడ్డి, భారత్ బయోటెక్ హరి ప్రసాద్, క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి, ఐ ల్యాబ్స్ శ్రీనిరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి ముందు ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్​ను ముఖ్యమంత్రి పరిశీలించారు.

ఏఐ సిటీ కోసం హైదరాబాద్​లో 200 ఎకరాల కేటాయింపు : మంత్రి శ్రీధర్ బాబు - Minister Sridhar launch Tech Hub

CM Revanth Reddy on Skill University Establishment in Telangana : రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఒకట్రెండు రోజుల ముందే ఇందుకు సంబంధించి స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సీఎం సూచించారు. వాటిని పరిశీలించి, 24 గంటల్లో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీలో సీఎం, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమావేశమయ్యారు.

5 రోజులకోసారి సమావేశమవ్వండి : గచ్చిబౌలిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటికీ అందుబాటులో ఉన్నందున ఈ ప్రాంగణంలో వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని రేవంత్ రెడ్డి సూచించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎస్​బీ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, అంతవరకు ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులందరినీ తాత్కాలిక బోర్డుగా భావించాలని సీఎం నిర్ణయించారు. పరిశ్రమ అవసరాలకు తగినట్లు ఇందులో ఉండాల్సిన కోర్సులు, కరిక్యులమ్​పై అధ్యయనం చేయాలని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు ఇంకా 15 రోజులే ఉన్నందున ప్రతీ 5 రోజులకోసారి సమావేశం కావాలని సీఎం వారికి దిశా నిర్దేశం చేశారు.

నిపుణులైన కన్సల్టెంట్​ను నియమించుకోండి : ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులన్నీ తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణులైన ఒక కన్సల్టెంట్​ను నియమించుకోవాలని సీఎం సూచించారు. ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్​ రంజన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్​ రెడ్డి, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ఛైర్మన్ సతీశ్​ రెడ్డి, భారత్ బయోటెక్ హరి ప్రసాద్, క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి, ఐ ల్యాబ్స్ శ్రీనిరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి ముందు ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్​ను ముఖ్యమంత్రి పరిశీలించారు.

ఏఐ సిటీ కోసం హైదరాబాద్​లో 200 ఎకరాల కేటాయింపు : మంత్రి శ్రీధర్ బాబు - Minister Sridhar launch Tech Hub

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.