ETV Bharat / state

అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీ పడతా : సీఎం రేవంత్ రెడ్డి - Basavatarakam IndoAmerican Hospital

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 22, 2024, 2:20 PM IST

Updated : Jun 22, 2024, 4:00 PM IST

Basavatarakam Indo American Cancer Hospital : రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే హెల్త్​ టూరిజం హబ్​లో బసవతారకం ఆసుపత్రికి స్థలం కేటాయిస్తున్నట్లు సీఎం రేవంత్​ రెడ్డి వెల్లడించారు. నిస్వార్థంగా పేదలకు సేవలు అందిస్తుందని అన్నారు. హైదరాబాద్​లో బసవతారకం ఇండో అమెరికన్​ క్యాన్సర్​ ఆసుపత్రి 24వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్​ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Basavatarakam Indo American Cancer Hospital
Basavatarakam Indo American Cancer Hospital (ETV Bharat)

Basavatarakam Indo American Cancer Hospital 24th Anniversary : బసవతారకం ఆసుపత్రిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి కొనియాడారు. ఈ ఆసుపత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందన్నారు. నిస్వార్థంగా పేదలకు సేవలందించేందుకు ఆసుపత్రిని నిర్మించారని తెలిపారు. హైదరాబాద్​లో బసవతారకం ఇండో అమెరికన్​ క్యాన్సర్​ ఆసుపత్రి 24వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్​ రెడ్డి, మేనేజింగ్​ ట్రస్టీ బాలకృష్ణ, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, డా.నోరి దత్రాత్రేయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ బసవతారకం ఆసుపత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందన్నారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీపడాలని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. హెల్త్​ టూరిజం హబ్​ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.

CM Revanth Reddy Speech at Basavatarakam Hospital : శంషాబాద్​లో 500-1000 ఎకరాల్లో హబ్​ ఏర్పాటుకు యోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించే హెల్త్​ టూరిజం హబ్​లో బసవతారకం ఆసుపత్రికి స్థలం కేటాయిస్తామని వెల్లడించారు. బసవతారకం సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలని అనుకుంటుందని సీఎం రేవంత్​ రెడ్డి చెప్పారు.

చంద్రబాబులాగా 18 గంటలు పని చేయాలి : చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం తనకు వచ్చిందని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు 18 గంటలు పని చేసి, తాను 12 గంటలు పని చేస్తే సరిపోదని అన్నారు. రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

"మనలో ఉన్న సామర్థ్యం వెలికి రావాలి, ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం గల ఆటగాడితో పోటీపడాలి అని పెద్దలు చెబుతుంటారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరవాత అభివృద్ధి, సంక్షేమంలో వారితో పోటీపడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది అనుకున్నా కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తుంటే నేను మునుపటిలా పనిచేస్తే సరిపోదు."-రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి

బసవతారకం ఆసుపత్రి సేవలు మరింత విస్తరిస్తాం : క్యాన్సర్​ మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తోందని బసవతారకం మేనేజింగ్​ ట్రస్టీ బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సేవల విస్తరణ కోసం సీఎం సహకారం కోరామని తెలిపారు. సీఎం రేవంత్​ రెడ్డి కోరిన వెంటనే అంగీకారం తెలిపారని వివరించారు. దాతల సహకారంతో ఆసుపత్రి నేడు ఈ స్థాయికి చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు. బసవతారకం ఆసుపత్రి సేవలను మరింత విస్తరిస్తామని బాలకృష్ణ తెలిపారు.

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఎస్బీఐ మొబైల్‌ స్క్రీనింగ్‌ బస్సు - ప్రారంభించిన బాలకృష్ణ

Balakrishna Comments at Basavatharakam Hospital : 'దేశంలోనే రెండో ఉత్తమ క్యాన్సర్ ఆస్పత్రి.. బసవతారకం'

Basavatarakam Indo American Cancer Hospital 24th Anniversary : బసవతారకం ఆసుపత్రిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి కొనియాడారు. ఈ ఆసుపత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందన్నారు. నిస్వార్థంగా పేదలకు సేవలందించేందుకు ఆసుపత్రిని నిర్మించారని తెలిపారు. హైదరాబాద్​లో బసవతారకం ఇండో అమెరికన్​ క్యాన్సర్​ ఆసుపత్రి 24వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్​ రెడ్డి, మేనేజింగ్​ ట్రస్టీ బాలకృష్ణ, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, డా.నోరి దత్రాత్రేయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ బసవతారకం ఆసుపత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందన్నారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీపడాలని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. హెల్త్​ టూరిజం హబ్​ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.

CM Revanth Reddy Speech at Basavatarakam Hospital : శంషాబాద్​లో 500-1000 ఎకరాల్లో హబ్​ ఏర్పాటుకు యోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించే హెల్త్​ టూరిజం హబ్​లో బసవతారకం ఆసుపత్రికి స్థలం కేటాయిస్తామని వెల్లడించారు. బసవతారకం సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలని అనుకుంటుందని సీఎం రేవంత్​ రెడ్డి చెప్పారు.

చంద్రబాబులాగా 18 గంటలు పని చేయాలి : చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం తనకు వచ్చిందని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు 18 గంటలు పని చేసి, తాను 12 గంటలు పని చేస్తే సరిపోదని అన్నారు. రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

"మనలో ఉన్న సామర్థ్యం వెలికి రావాలి, ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం గల ఆటగాడితో పోటీపడాలి అని పెద్దలు చెబుతుంటారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరవాత అభివృద్ధి, సంక్షేమంలో వారితో పోటీపడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది అనుకున్నా కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తుంటే నేను మునుపటిలా పనిచేస్తే సరిపోదు."-రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి

బసవతారకం ఆసుపత్రి సేవలు మరింత విస్తరిస్తాం : క్యాన్సర్​ మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తోందని బసవతారకం మేనేజింగ్​ ట్రస్టీ బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సేవల విస్తరణ కోసం సీఎం సహకారం కోరామని తెలిపారు. సీఎం రేవంత్​ రెడ్డి కోరిన వెంటనే అంగీకారం తెలిపారని వివరించారు. దాతల సహకారంతో ఆసుపత్రి నేడు ఈ స్థాయికి చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు. బసవతారకం ఆసుపత్రి సేవలను మరింత విస్తరిస్తామని బాలకృష్ణ తెలిపారు.

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఎస్బీఐ మొబైల్‌ స్క్రీనింగ్‌ బస్సు - ప్రారంభించిన బాలకృష్ణ

Balakrishna Comments at Basavatharakam Hospital : 'దేశంలోనే రెండో ఉత్తమ క్యాన్సర్ ఆస్పత్రి.. బసవతారకం'

Last Updated : Jun 22, 2024, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.