ETV Bharat / state

కోల్​కతా ఫ్యాషన్​ డిజైనర్లపై దాడి చేసిన అనంతపురం మహిళా డిజైనర్లు - ఎందుకో తెలుసా? - Fashion Designers clash

Anantapur Fashion Designers Clashes in AP : ఏపీలోని అనంతపురంలో కోల్​కతా ఫ్యాషన్ డిజైనర్లపై స్థానిక మహిళా డిజైనర్లు దాడికి పాల్పడ్డారు. చౌకగా మహిళల బ్లౌజ్ డిజైన్లు చేస్తున్నారని ఆరోపిస్తూ వారి దుకాణాల వద్ద హల్​చల్​ చేశారు. ఫ్లెక్సీలు చించివేసి నానా రభస సృష్టించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 28, 2024, 10:27 PM IST

Anantapur Fashion Designers Clashes in AP
Anantapur Fashion Designers Clashes in AP (ETV Bharat)

Clash Between Kolkata and Anantapur Fashion Designers in AP : వారు జీవనోపాధి కోసం రాష్ట్రాలు దాటి ఆంధ్రాకు వచ్చారు. ఇక్కడే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తమకు తెలిసినా మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైన్ పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తక్కువ ధరకే నాణ్యంగా పనులు చేస్తుండటంతో వారికి ఆర్డర్​లు పెరిగాయి. దీంతో స్థానిక మహిళా డిజైనర్లకు గిరాకీ తగ్గిపోయింది. ఈ క్రమంలోనే స్థానిక మహిళా డిజైనర్లు, స్థానికేతరులైన కోల్​కతా డిజైనర్ల షాపులపై దాడులు చేసి వారిని భయభ్రాంతులకు గురి చేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

తక్కువ ధరలకే నాణ్యమైన పనులు : ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కోల్​కతాలో జీవనోపాధి లేక 20 కుటుంబాలు రెండు దశాబ్దాల క్రితం పొట్ట చేతపట్టుకొని అనంతపురానికి వచ్చారు. ఇక్కడ మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరంతా పట్టణంలోని రహమత్​నగర్​లో దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరు నాణ్యమైన ఫ్యాషన్ డిజైన్లు, మగ్గం వర్క్ డిజైన్లను చాలా చౌకగా చేసి మహిళలకు ఇస్తున్నారు.

శుభకార్యాల్లో మహిళలు ధరించే బ్లౌజ్​లను చాలా మంది మగ్గం డిజైన్ వర్క్ చేయించుకుంటారు. వీటికి కోల్​కతా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచే మగ్గం వర్క్ డిజైనింగ్ బ్లౌజ్​లు, చీరలు దేశవ్యాప్తంగా ఎగుమతి అవుతుంటాయి. దీంతో వీరి చేతిపనికి విపరీతమైన ఆదరణ పెరిగింది. ఈ క్రమంలోనే వారు తమ ప్రాంతం నుంచి మరికొందరు కూలీలను పిలిపించుకొని అనంతపురంలో పెద్దఎత్తున డిజైనింగ్ వర్క్స్ చేయిస్తున్నారు.

దీంతో స్థానిక మహిళా డిజైనర్లకు గిరాకీ తగ్గిపోయింది. వీరు అధిక ధరలకు డిజైనింగ్ చేస్తుండటంతో ఇది సహించలేకపోయారు. ఈ క్రమంలోనే స్థానిక మహిళా డిజైనర్లు కోల్​కతా డిజైనర్ల దుకాణాల వద్ద హల్​చల్​ చేశారు. ఫ్లెక్సీలు చించేసి నానా రభస సృష్టించారు. అంతటితో ఆగకుండా నగరం వదిలి వెళ్లకపోతే ఈసారి మగ్గాలు ధ్వంసం చేస్తామని వారిని హెచ్చరించారు. దీంతో బాధితులు రెండో పట్టణ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

"మేము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటున్నాం. స్థానిక మహిళా డిజైనర్లు మా దుకాణాల వద్దకు వచ్చి ఫ్లెక్సీలు చించివేశారు. దుకాణాలు మూసివేయాలని చెబుతున్నారు. తక్కువ ధరకే పనులు చేస్తున్నారని అంటున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇస్తున్నారు. అందుకే మేము పోలీసులకు ఫిర్యాదు చేశాం." - సలీం, బాధితుడు

'నెల జీతం బోనస్​, వారానికి ఐదు రోజులే పని' - ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - AP Govt Good News To Employees

అభివృద్ధి దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు - అమరావతికి కేంద్ర సంస్థల రాక! - AP govt To Setup Central Offices

Clash Between Kolkata and Anantapur Fashion Designers in AP : వారు జీవనోపాధి కోసం రాష్ట్రాలు దాటి ఆంధ్రాకు వచ్చారు. ఇక్కడే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తమకు తెలిసినా మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైన్ పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తక్కువ ధరకే నాణ్యంగా పనులు చేస్తుండటంతో వారికి ఆర్డర్​లు పెరిగాయి. దీంతో స్థానిక మహిళా డిజైనర్లకు గిరాకీ తగ్గిపోయింది. ఈ క్రమంలోనే స్థానిక మహిళా డిజైనర్లు, స్థానికేతరులైన కోల్​కతా డిజైనర్ల షాపులపై దాడులు చేసి వారిని భయభ్రాంతులకు గురి చేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

తక్కువ ధరలకే నాణ్యమైన పనులు : ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కోల్​కతాలో జీవనోపాధి లేక 20 కుటుంబాలు రెండు దశాబ్దాల క్రితం పొట్ట చేతపట్టుకొని అనంతపురానికి వచ్చారు. ఇక్కడ మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరంతా పట్టణంలోని రహమత్​నగర్​లో దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరు నాణ్యమైన ఫ్యాషన్ డిజైన్లు, మగ్గం వర్క్ డిజైన్లను చాలా చౌకగా చేసి మహిళలకు ఇస్తున్నారు.

శుభకార్యాల్లో మహిళలు ధరించే బ్లౌజ్​లను చాలా మంది మగ్గం డిజైన్ వర్క్ చేయించుకుంటారు. వీటికి కోల్​కతా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచే మగ్గం వర్క్ డిజైనింగ్ బ్లౌజ్​లు, చీరలు దేశవ్యాప్తంగా ఎగుమతి అవుతుంటాయి. దీంతో వీరి చేతిపనికి విపరీతమైన ఆదరణ పెరిగింది. ఈ క్రమంలోనే వారు తమ ప్రాంతం నుంచి మరికొందరు కూలీలను పిలిపించుకొని అనంతపురంలో పెద్దఎత్తున డిజైనింగ్ వర్క్స్ చేయిస్తున్నారు.

దీంతో స్థానిక మహిళా డిజైనర్లకు గిరాకీ తగ్గిపోయింది. వీరు అధిక ధరలకు డిజైనింగ్ చేస్తుండటంతో ఇది సహించలేకపోయారు. ఈ క్రమంలోనే స్థానిక మహిళా డిజైనర్లు కోల్​కతా డిజైనర్ల దుకాణాల వద్ద హల్​చల్​ చేశారు. ఫ్లెక్సీలు చించేసి నానా రభస సృష్టించారు. అంతటితో ఆగకుండా నగరం వదిలి వెళ్లకపోతే ఈసారి మగ్గాలు ధ్వంసం చేస్తామని వారిని హెచ్చరించారు. దీంతో బాధితులు రెండో పట్టణ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

"మేము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటున్నాం. స్థానిక మహిళా డిజైనర్లు మా దుకాణాల వద్దకు వచ్చి ఫ్లెక్సీలు చించివేశారు. దుకాణాలు మూసివేయాలని చెబుతున్నారు. తక్కువ ధరకే పనులు చేస్తున్నారని అంటున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇస్తున్నారు. అందుకే మేము పోలీసులకు ఫిర్యాదు చేశాం." - సలీం, బాధితుడు

'నెల జీతం బోనస్​, వారానికి ఐదు రోజులే పని' - ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - AP Govt Good News To Employees

అభివృద్ధి దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు - అమరావతికి కేంద్ర సంస్థల రాక! - AP govt To Setup Central Offices

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.