ETV Bharat / state

బీఆర్​ఎస్​కు మరో షాక్ - కాంగ్రెస్​ గూటికి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 17, 2024, 3:43 PM IST

Chevella MP Ranjith Reddy Joined Congress : బీఆర్​ఎస్​ పార్టీకి మరో ఎదురదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి రాజీనామా చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్​కు రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే దీపదాస్​ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఇటీవల సీఎంతో భేటీ అయిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా హస్తం కండువా కప్పుకున్నారు.

Chevella_MP_Ranjith_Reddy_Joined_Congress
Chevella_MP_Ranjith_Reddy_Joined_Congress

Chevella MP Ranjith Reddy Joined Congress : పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్​ఎస్​ పార్టీలో రాజకీయ వలసలు రాజుకుంటున్నాయి. ఓవైపు అధికార పార్టీ కాంగ్రెస్, మరోవైపు బీజేపీలోకి కీలక నేతలు వలస వెళ్తున్నారు. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్​కు రాజీనామా చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా గులాబీ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన సోషల్ మీడియా(Social Media) వేదిక ఎక్స్​లో పోస్టు చేశారు.

MLA Danam Nagender Joined Congress : చేవెళ్ల ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. క్లిష్టపరిస్థితుల్లో తాను భిన్న మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. తన రాజీనామాను పార్టీ అధ్యక్షుడు ఆమోదించాలని రంజిత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గులాబీ పార్టీలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఏఐసీసీ ఇన్​ఛార్జి దీపాదాస్​ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలోకి వెళ్లారు. మరోవైపు గులాబీ పార్టీ నేత, ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం సైతం హస్తం గూటికి చేరారు.

ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే టైమ్ చెప్పండి- బీఆర్​ఎస్​కు ఐదో మనిషి కూడా మిగలడు: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్​ పార్టీ నుంచి చేవెళ్ల లోక్​సభ అభ్యర్థిగా, సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డికి మరోసారి అవకాశం కేసీఆర్​ కల్పించినా పోటీకి ఆసక్తి చూపకపోవడంతో అభ్యర్థి కోసం బీఆర్​ఎస్​ నాయకత్వం పలుపేర్లు పరిశీలించింది. గతంలో అక్కడ నుంచి బరిలో నిలిచిన అనేక మంది సీనియర్లు మారిన రాజకీయ పరిస్థితులతో వెనకడుగు వేశారు. చివరకు తర్జన భర్జనపడి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌(Kasani Gnaneshwar) పేరును గులాబీ పార్టీ​ ఖరారు చేసింది. కాంగ్రెస్, టీడీపీల్లో పలు హోదాల్లో కాసాని పని చేసిన విషయం తెలిసిందే.

Telangana Lok Sabha Polls 2024 : పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న రంజిత్​ రెడ్డి, ఎట్టకేలకు పార్టీని వీడనున్నట్లు ఇవాళ ప్రకటించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్​ పార్టీలోకి చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కాంగ్రెస్​లో చేరడంతో ఉత్కంఠకు తెర పడింది.

చేవెళ్ల నుంచి బరిలో దించేందుకు వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌ రెడ్డిని హస్తం పార్టీలోకి తీసుకొచ్చారు. ఆమెనే బలమైన నాయకురాలిగా స్థానిక నేతల మద్దతు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ రంజిత్​ రెడ్డి చేరికతో ఆ స్థానంపై కొంత సందిగ్ధత నెలకొనే అవకాశం ఏర్పడవచ్చు. మరోవైపు ఈనెల 18న కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ(Congress Central Election Committee) సమావేశం జరగనుంది. ఆరోజు లేదా మరుసటి రోజున మిగిలిన స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

బీజేపీ ఆకాశంలోకి- కాంగ్రెస్ పాతాళంలోకి! 40 ఏళ్లలో ఎంతో మార్పు

Chevella MP Ranjith Reddy Joined Congress : పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్​ఎస్​ పార్టీలో రాజకీయ వలసలు రాజుకుంటున్నాయి. ఓవైపు అధికార పార్టీ కాంగ్రెస్, మరోవైపు బీజేపీలోకి కీలక నేతలు వలస వెళ్తున్నారు. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్​కు రాజీనామా చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా గులాబీ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన సోషల్ మీడియా(Social Media) వేదిక ఎక్స్​లో పోస్టు చేశారు.

MLA Danam Nagender Joined Congress : చేవెళ్ల ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. క్లిష్టపరిస్థితుల్లో తాను భిన్న మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. తన రాజీనామాను పార్టీ అధ్యక్షుడు ఆమోదించాలని రంజిత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గులాబీ పార్టీలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఏఐసీసీ ఇన్​ఛార్జి దీపాదాస్​ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలోకి వెళ్లారు. మరోవైపు గులాబీ పార్టీ నేత, ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం సైతం హస్తం గూటికి చేరారు.

ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే టైమ్ చెప్పండి- బీఆర్​ఎస్​కు ఐదో మనిషి కూడా మిగలడు: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్​ పార్టీ నుంచి చేవెళ్ల లోక్​సభ అభ్యర్థిగా, సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డికి మరోసారి అవకాశం కేసీఆర్​ కల్పించినా పోటీకి ఆసక్తి చూపకపోవడంతో అభ్యర్థి కోసం బీఆర్​ఎస్​ నాయకత్వం పలుపేర్లు పరిశీలించింది. గతంలో అక్కడ నుంచి బరిలో నిలిచిన అనేక మంది సీనియర్లు మారిన రాజకీయ పరిస్థితులతో వెనకడుగు వేశారు. చివరకు తర్జన భర్జనపడి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌(Kasani Gnaneshwar) పేరును గులాబీ పార్టీ​ ఖరారు చేసింది. కాంగ్రెస్, టీడీపీల్లో పలు హోదాల్లో కాసాని పని చేసిన విషయం తెలిసిందే.

Telangana Lok Sabha Polls 2024 : పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న రంజిత్​ రెడ్డి, ఎట్టకేలకు పార్టీని వీడనున్నట్లు ఇవాళ ప్రకటించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్​ పార్టీలోకి చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కాంగ్రెస్​లో చేరడంతో ఉత్కంఠకు తెర పడింది.

చేవెళ్ల నుంచి బరిలో దించేందుకు వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌ రెడ్డిని హస్తం పార్టీలోకి తీసుకొచ్చారు. ఆమెనే బలమైన నాయకురాలిగా స్థానిక నేతల మద్దతు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ రంజిత్​ రెడ్డి చేరికతో ఆ స్థానంపై కొంత సందిగ్ధత నెలకొనే అవకాశం ఏర్పడవచ్చు. మరోవైపు ఈనెల 18న కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ(Congress Central Election Committee) సమావేశం జరగనుంది. ఆరోజు లేదా మరుసటి రోజున మిగిలిన స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

బీజేపీ ఆకాశంలోకి- కాంగ్రెస్ పాతాళంలోకి! 40 ఏళ్లలో ఎంతో మార్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.