ETV Bharat / state

'సీఎం నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు' - మీడియా ముందు సబిత ఇంద్రారెడ్డి కంటతడి - SABITA INDRAREDDY ON CM COMMENTS

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 31, 2024, 4:27 PM IST

Updated : Jul 31, 2024, 6:14 PM IST

Sabita indra reddy reacts on CM Revanth : సీఎం రేవంత్​రెడ్డి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని, మాజీమంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆక్షేపించారు. అక్కలను నమ్ముకుంటే ముంచుతారని, జూబ్లీ బస్టాండ్‌ అవుతుందని సీఎం రేవంత్ అసెంబ్లీలో​ వ్యాఖ్యానించారని ఆమె వాపోయారు. అక్కలు ఎప్పుడైనా అందరి క్షేమాన్ని కోరుకుంటారని, సీఎం అలా ఎందుకు మాట్లాడారో తమకు అర్ధం కాలేదని ఆమె పేర్కొన్నారు.

Sabita indra reddy reacts on CM Revanth
Sabita indra reddy reacts on CM Revanth (ETV Bharat)

Sabita Indrareddy fires on CM Revanth : శాసన సభలో ఏం జరిగిందో ప్రజలందరూ చూశారని, మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో కేటీఆర్‌ ప్రతి అంశాన్ని కూలంకషంగా వివరించే ప్రయత్నం చేశారని, కేటీఆర్‌ ప్రసంగం నుంచి దృష్టి మళ్లించేందుకు రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి మహిళలు అంటే గౌరవం లేదని, సోనియా మెుదలు సబిత వరకు అందరిపై సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

సీఎం Vs మాజీ మంత్రి - 'సబితక్క నన్ను మోసం చేసింది - రేవంత్ నన్నే టార్గెట్ చేశారు' - Sabitha Indra Reddy vs CM Revanth

మహిళలపై గౌరవం లేదు : అక్కలను నమ్ముకుంటే ముంచుతారని, జూబ్లీ బస్టాండ్‌ అవుతుందని సీఎం రేవంత్ అసెంబ్లీలో​ వ్యాఖ్యానించారని సబిత వాపోయారు. రేవంత్‌ కాంగ్రెస్‌లోకి రాకముందే హస్తం పార్టీకి తాము సేవలందించామని సబిత ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. భుజాన జెండా వేసుకుని కాంగ్రెస్‌ కోసం కష్టపడ్డామని, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తాను, సునీత కోరుకున్నట్లు ఆమె తెలిపారు. తాను, సునీత పార్టీకి మోసం చేశామని రేవంత్‌ మాట్లాడారని, రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి రావాలని కోరడమే తాను చేసిన తప్పని ఆమె తెలిపారు.

భేషరతుగా క్షమాపణ చెప్పాలి : ఆడబిడ్డలు క్షేమం కోరుకుంటారు, నమ్మినవారికి ప్రాణం ఇస్తారని మాజీమంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ రోజు జరిగిన అవమానం సునీత, సబితకు మాత్రమే కాదని, సభలో జరిగిన దానిపై ప్రతి ఇంట్లోని ఆడపిల్లలు ఆలోచిస్తున్నారని ఆమె తెలిపారు. 24 ఏళ్ల నుంచి తాను అసెంబ్లీకి వస్తున్నానని, సీఎం పీఠంపై చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్‌ను చూశానన్నారు. ఈరోజు సీఎం పీఠంపై రేవంత్‌రెడ్డిని కూడా చూస్తున్నానని, నిండు సభలో మహిళలపై మాట్లాడి సీఎం పీఠాన్నే రేవంత్‌రెడ్డి అగౌరపరిచారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

"సీఎం రేవంత్​రెడ్డి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. అక్కలను నమ్ముకుంటే ముంచుతారని, జూబ్లీ బస్టాండ్‌ అవుతుందని సీఎం రేవంత్ అసెంబ్లీలో​ వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డికి మహిళలు అంటే గౌరవం లేదు. సోనియా మెుదలు సబిత వరకు అందరిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు". - సబిత ఇంద్రారెడ్డి, మాజీమంత్రి

BRS MLA Sunitha slams CM Revanth :​ సీఎం, డిప్యూటీ సీఎం మాటలు మహిళలను గాయపరుస్తున్నాయని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చేసిన తప్పునకు రాష్ట్ర మహిళలందరికీ సీఎం, డిప్యూటీ సీఎం క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర మహిళలను అగౌరవపరిచేలా మాట్లాడారని, చేసిన తప్పునకు క్షమాపణ చెబుతారనుకున్నామన్నారు. పార్టీ మారారని అంటున్నవాళ్లు ఏ పార్టీ నుంచి వచ్చారో ఆలోచించుకోవాలని ఆమె తెలిపారు.

మహిళలలైన తనను, సబిత, డీ.కే.అరుణను పార్టీ నుంచి పంపించింది మీరు కాదా? అని సునీత లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. నిండు సభలో ఆరోజు ద్రౌపదికి అవమానం జరిగిందని, ఈ సభలో రాష్ట్రంలోకి మాతో పాటు మహిళలందరినీ అవమానపరిచినట్లుగా భావిస్తున్నామన్నారు. ఈరోజు కాంగ్రెస్‌లో మహిళలకు గౌరవం లేదని, కాంగ్రెస్‌ పార్టీని తాము మోసం చేశామని సీతక్క అంటున్నారని, సీతక్క ఏ పార్టీ నుంచి వచ్చిందని తాము అడుగుతున్నట్లు పేర్కొన్నారు.

బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు సీఎం క్షమాపణ చెప్పాలి : హరీశ్‌రావు - Harish Rao Reaction on CM Comments

మేం చేసిన అప్పుల గురించి చెప్పారు - మరి ఆస్తుల గురించి మాట్లాడాలి కదా? : కేటీఆర్ - KTR SLAMS CONGRESS GOVT IN ASSEMBLY

Sabita Indrareddy fires on CM Revanth : శాసన సభలో ఏం జరిగిందో ప్రజలందరూ చూశారని, మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో కేటీఆర్‌ ప్రతి అంశాన్ని కూలంకషంగా వివరించే ప్రయత్నం చేశారని, కేటీఆర్‌ ప్రసంగం నుంచి దృష్టి మళ్లించేందుకు రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి మహిళలు అంటే గౌరవం లేదని, సోనియా మెుదలు సబిత వరకు అందరిపై సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

సీఎం Vs మాజీ మంత్రి - 'సబితక్క నన్ను మోసం చేసింది - రేవంత్ నన్నే టార్గెట్ చేశారు' - Sabitha Indra Reddy vs CM Revanth

మహిళలపై గౌరవం లేదు : అక్కలను నమ్ముకుంటే ముంచుతారని, జూబ్లీ బస్టాండ్‌ అవుతుందని సీఎం రేవంత్ అసెంబ్లీలో​ వ్యాఖ్యానించారని సబిత వాపోయారు. రేవంత్‌ కాంగ్రెస్‌లోకి రాకముందే హస్తం పార్టీకి తాము సేవలందించామని సబిత ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. భుజాన జెండా వేసుకుని కాంగ్రెస్‌ కోసం కష్టపడ్డామని, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తాను, సునీత కోరుకున్నట్లు ఆమె తెలిపారు. తాను, సునీత పార్టీకి మోసం చేశామని రేవంత్‌ మాట్లాడారని, రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి రావాలని కోరడమే తాను చేసిన తప్పని ఆమె తెలిపారు.

భేషరతుగా క్షమాపణ చెప్పాలి : ఆడబిడ్డలు క్షేమం కోరుకుంటారు, నమ్మినవారికి ప్రాణం ఇస్తారని మాజీమంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ రోజు జరిగిన అవమానం సునీత, సబితకు మాత్రమే కాదని, సభలో జరిగిన దానిపై ప్రతి ఇంట్లోని ఆడపిల్లలు ఆలోచిస్తున్నారని ఆమె తెలిపారు. 24 ఏళ్ల నుంచి తాను అసెంబ్లీకి వస్తున్నానని, సీఎం పీఠంపై చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్‌ను చూశానన్నారు. ఈరోజు సీఎం పీఠంపై రేవంత్‌రెడ్డిని కూడా చూస్తున్నానని, నిండు సభలో మహిళలపై మాట్లాడి సీఎం పీఠాన్నే రేవంత్‌రెడ్డి అగౌరపరిచారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

"సీఎం రేవంత్​రెడ్డి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. అక్కలను నమ్ముకుంటే ముంచుతారని, జూబ్లీ బస్టాండ్‌ అవుతుందని సీఎం రేవంత్ అసెంబ్లీలో​ వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డికి మహిళలు అంటే గౌరవం లేదు. సోనియా మెుదలు సబిత వరకు అందరిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు". - సబిత ఇంద్రారెడ్డి, మాజీమంత్రి

BRS MLA Sunitha slams CM Revanth :​ సీఎం, డిప్యూటీ సీఎం మాటలు మహిళలను గాయపరుస్తున్నాయని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చేసిన తప్పునకు రాష్ట్ర మహిళలందరికీ సీఎం, డిప్యూటీ సీఎం క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర మహిళలను అగౌరవపరిచేలా మాట్లాడారని, చేసిన తప్పునకు క్షమాపణ చెబుతారనుకున్నామన్నారు. పార్టీ మారారని అంటున్నవాళ్లు ఏ పార్టీ నుంచి వచ్చారో ఆలోచించుకోవాలని ఆమె తెలిపారు.

మహిళలలైన తనను, సబిత, డీ.కే.అరుణను పార్టీ నుంచి పంపించింది మీరు కాదా? అని సునీత లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. నిండు సభలో ఆరోజు ద్రౌపదికి అవమానం జరిగిందని, ఈ సభలో రాష్ట్రంలోకి మాతో పాటు మహిళలందరినీ అవమానపరిచినట్లుగా భావిస్తున్నామన్నారు. ఈరోజు కాంగ్రెస్‌లో మహిళలకు గౌరవం లేదని, కాంగ్రెస్‌ పార్టీని తాము మోసం చేశామని సీతక్క అంటున్నారని, సీతక్క ఏ పార్టీ నుంచి వచ్చిందని తాము అడుగుతున్నట్లు పేర్కొన్నారు.

బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు సీఎం క్షమాపణ చెప్పాలి : హరీశ్‌రావు - Harish Rao Reaction on CM Comments

మేం చేసిన అప్పుల గురించి చెప్పారు - మరి ఆస్తుల గురించి మాట్లాడాలి కదా? : కేటీఆర్ - KTR SLAMS CONGRESS GOVT IN ASSEMBLY

Last Updated : Jul 31, 2024, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.