ETV Bharat / state

ఆధార్‌లేనోళ్లతో అడ్డగోలు దందా - హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన మాఫియా - Business with Illegal Migrants

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 10:49 AM IST

Illegal Immigrants in Hyderabad : దేశ, విదేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్లతో వ్యాపారం సాగిస్తున్న దళారుల దందా తాజాగా వెలుగు చూసింది. ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులు, మొబైల్‌ ఫోన్లు వంటి ఏమీ లేని వాళ్లతో నగరంలోని దళారులు దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Doing Business with Illegal Immigrants in Hyderabad
Illegal Immigrants in Hyderabad (ETV Bharat)

Doing Business with Illegal Immigrants in Hyderabad : దేశ, విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన అక్రమ వలసదారులతో తోపుడుబండ్లు పెట్టించి వ్యాపారం సాగిస్తున్న దళారుల దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. గుడిమల్కాపూర్, ఆసిఫ్‌నగర్, జియాగూడ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్​కు అంతరాయం కలిగేలా చిరువ్యాపారులు రోడ్లను ఆక్రమించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చలానాలు, కేసులు నమోదు చేసేందుకు చిరునామా అడిగితే తమ పేరుతో ఆధార్, ఓటరు గుర్తింపుకార్డులు, మొబైల్‌ ఫోన్లు వంటివి ఏమీ లేవన్నారు.

వీళ్లే ఎందుకంటే : తాము ఎక్కడ నుంచి వచ్చామనేది చెప్పకుండా ఏమార్చే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. దాదాపు 40 మంది బంగ్లాదేశ్‌, పశ్చిమబెంగాల్, బిహార్ నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. వీరిని పనిలో కుదుర్చుకున్న వ్యక్తిని ప్రశ్నించేందుకు ప్రయత్నించిన పోలీసులపై అతడు తిరగబడినట్టు సమాచారం. వలస వచ్చిన వాళ్లల్లో కొందరికి పాన్‌మసాలా ప్యాకెట్‌ కొనిస్తే చాలు రోజంతా పనిచేస్తారు. మరికొంతమందికి పూట భోజనం పెట్టిస్తే రేయింబవళ్లు కష్టపడతారు. సొంతూల్లో ఉపాధిలేక పొట్టకూటి కోసం పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​, బిహార్, యూపీ, రాజస్థాన్​ నుంచి వేలాది మంది నగరానికి వలస వస్తున్నారు.

ఈ క్రమంలో కొందరు రౌడీషీటర్లు, దుకాణదారులు వలస వచ్చిన వారికి తోపుడుబండ్లు అప్పగించి కూరగాయలు, పండ్లు, వస్తువులను విక్రయించే ఏజెంట్లుగా మార్చుకుంటున్నారు. ఒక్కొకరికి రోజుకు రూ.100 చొప్పున కమీషన్‌ ఇస్తున్నారు. అక్కడ వచ్చే జీతం చాలక కొందరు డ్రగ్స్‌ సరఫరా, ద్విచక్రవాహనాలు, గృహదొంగతనాలకు సైతం పాల్పడుతున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. పోలీసు రికార్డులో వీరి వివరాలు నమోదు చేయకపోవడంతో నిందితులను గుర్తించడం పెద్ద సవాల్​గా మారుతోందన్నారు.

భారీగా బంగ్లాదేశీయులు? - కొద్దినెలల క్రితమే రైల్వేపోలీసులు సుమారు 10 మంది బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు. వీరిలో మైనర్లను వాళ్ల సొంతూర్లకు చేర్చారు. దళారులు, బంధువుల ద్వారా నగరానికి వచ్చిన బంగ్లాదేశీయులు గుడిమల్కాపూర్, ఆసిఫ్‌నగర్, హబీబ్‌నగర్, జియాగూడ, చాంద్రాయణగుట్ట, బార్కస్, అత్తాపూర్, బాలాపూర్‌ తదితర ప్రాంతాల్లో స్థానికులతో కలిసి కూలీపనులు, చిరు వ్యాపారాలు చేస్తున్నారని, దొంగతనాలకు సైతం పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Doing Business with Illegal Immigrants in Hyderabad : దేశ, విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన అక్రమ వలసదారులతో తోపుడుబండ్లు పెట్టించి వ్యాపారం సాగిస్తున్న దళారుల దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. గుడిమల్కాపూర్, ఆసిఫ్‌నగర్, జియాగూడ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్​కు అంతరాయం కలిగేలా చిరువ్యాపారులు రోడ్లను ఆక్రమించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చలానాలు, కేసులు నమోదు చేసేందుకు చిరునామా అడిగితే తమ పేరుతో ఆధార్, ఓటరు గుర్తింపుకార్డులు, మొబైల్‌ ఫోన్లు వంటివి ఏమీ లేవన్నారు.

వీళ్లే ఎందుకంటే : తాము ఎక్కడ నుంచి వచ్చామనేది చెప్పకుండా ఏమార్చే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. దాదాపు 40 మంది బంగ్లాదేశ్‌, పశ్చిమబెంగాల్, బిహార్ నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. వీరిని పనిలో కుదుర్చుకున్న వ్యక్తిని ప్రశ్నించేందుకు ప్రయత్నించిన పోలీసులపై అతడు తిరగబడినట్టు సమాచారం. వలస వచ్చిన వాళ్లల్లో కొందరికి పాన్‌మసాలా ప్యాకెట్‌ కొనిస్తే చాలు రోజంతా పనిచేస్తారు. మరికొంతమందికి పూట భోజనం పెట్టిస్తే రేయింబవళ్లు కష్టపడతారు. సొంతూల్లో ఉపాధిలేక పొట్టకూటి కోసం పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​, బిహార్, యూపీ, రాజస్థాన్​ నుంచి వేలాది మంది నగరానికి వలస వస్తున్నారు.

ఈ క్రమంలో కొందరు రౌడీషీటర్లు, దుకాణదారులు వలస వచ్చిన వారికి తోపుడుబండ్లు అప్పగించి కూరగాయలు, పండ్లు, వస్తువులను విక్రయించే ఏజెంట్లుగా మార్చుకుంటున్నారు. ఒక్కొకరికి రోజుకు రూ.100 చొప్పున కమీషన్‌ ఇస్తున్నారు. అక్కడ వచ్చే జీతం చాలక కొందరు డ్రగ్స్‌ సరఫరా, ద్విచక్రవాహనాలు, గృహదొంగతనాలకు సైతం పాల్పడుతున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. పోలీసు రికార్డులో వీరి వివరాలు నమోదు చేయకపోవడంతో నిందితులను గుర్తించడం పెద్ద సవాల్​గా మారుతోందన్నారు.

భారీగా బంగ్లాదేశీయులు? - కొద్దినెలల క్రితమే రైల్వేపోలీసులు సుమారు 10 మంది బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు. వీరిలో మైనర్లను వాళ్ల సొంతూర్లకు చేర్చారు. దళారులు, బంధువుల ద్వారా నగరానికి వచ్చిన బంగ్లాదేశీయులు గుడిమల్కాపూర్, ఆసిఫ్‌నగర్, హబీబ్‌నగర్, జియాగూడ, చాంద్రాయణగుట్ట, బార్కస్, అత్తాపూర్, బాలాపూర్‌ తదితర ప్రాంతాల్లో స్థానికులతో కలిసి కూలీపనులు, చిరు వ్యాపారాలు చేస్తున్నారని, దొంగతనాలకు సైతం పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.