ETV Bharat / state

బాధితులకు అండగా నిలిచిన వారికి పోలీసులు నోటీసులివ్వడం దారుణం: బీజేపీ నేతలు - BJP Leaders on YCP Leaders Attacks

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2024, 7:36 PM IST

Updated : May 20, 2024, 7:59 PM IST

BJP Leaders on YCP Leaders Attacks During Elections: విశాఖలో దాడులు చేసిన వారిని వదిలేసి బాధితులకు అండగా ఉన్న వారిపై పోలీసులు కేసులు పెట్టడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వైసీపీ నాయకుల ప్రోద్బలంతో జరిగిన ఈ దాడులకు సహకరించిన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

BJP Leaders on YCP Leaders Attacks
BJP Leaders on YCP Leaders Attacks (ETV Bharat)

BJP Leaders on YCP Leaders Attacks During Elections: ఎన్నికలలో కూటమికి ఓటు వేశారని విశాఖలో ఓ కుటుంబంపై వైసీపీ రౌడీలు విచక్షణారహితంగా దాడి చేస్తే వారిపై కేసులు నమోదు చేయకుండా వారికి అండగా నిలిచిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేటడాన్ని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తీవ్రంగా ఖండించారు. మహిళల పైన, బాలింతరాలి పైన వైసీపీ మద్దతు దారులు దాడి చేస్తే, దారుణానికి ఒడిగట్టిన వారి మీద చర్యలు తీసుకోకుండా బాదితులకు అండగా నిలిచిన కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకి, ఈ దారుణాన్ని ప్రజల ముందు ఉంచిన మీడియా వారికి 41ఏ నోటీసులు ఇవ్వడం అంటే అది ఆటవిక న్యాయం అవుతుందని లంకా దినకర్ మండిపడ్డారు. పోలీసు శాఖలో ఇంకా కొంత మంది జగన్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

33 చోట్ల హింసాత్మక ఘటనలు - ఏపీలో ఎన్నికల హింసపై సిట్‌ నివేదిక - డీజీపీకి అందజేత - SIT report to DGP

తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య ఉదంతం అనంతరం విశాఖలో కూడా అలాంటి వ్యవహారమే నడుస్తుందా అనే అనుమానం వస్తుందని లంకా దినకర్ అన్నారు. పోలింగ్ సమయంలో, అనంతరం ఓటమి తప్పదన్న నైరాశ్యంలో వైసీపీ నాయకుల ప్రోద్బలంతో జరిగిన దాడులకు సహకరించిన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ పట్టణంలో తమకు ఓటు వేయలేదనే చేసిన దాడులను దారి మళ్లించి కుటుంబ కలహాలుగా చిత్రీకరించే కుట్ర పాత్రధారులని శిక్షించాలని కోరారు. అంతే కాకుండా తిరుపతిలో పులివర్తి నానిపైన జరిగిన హత్యాయత్నాన్ని భాదితులపై నెట్టే ప్రయత్నం చేస్తున్న వారిని సిట్ గుర్తించి చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని లంకా దినకర్ డిమాండ్ చేశారు.

మీడియా గళాన్ని నొక్కే ప్రయత్నం చేస్తున్నారు - ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ - Atchannaidu on Visakha incident

Alliance Candidate Vishnukumar Raju Fire on Police: న్యాయం చేయాలని బాధితుల వైపు నిలబడితే కేసులు పెట్టి నోటీసులివ్వడమేంటని విశాఖ నార్త్‌ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు పోలీసులపై మండిపడ్డారు. కంచరపాలెం బర్మా క్యాంప్ వాసులు సుంకర ధనలక్ష్మి, ఆమె కుటుంబసభ్యులపై దాడి ఘటనను ఖండిస్తూ ఆయన ఈ నెల 17న మీడియా సమావేశం నిర్వహించారు. దీనిపై పోలీసులు సుమోటోగా కేసు పెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. పోలీసులు కేసు పెట్టిన నేపథ్యంలో ఆయన ఈ ఉదయం కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి 41-ఏ నోటీసులు అందుకున్నారు. పోలీసులు ప్రజలకు వాక్‌ స్వాతంత్య్రం లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాదితులకు అండగా నిలిచిన వారికి పోలీసులు నోటీసులివ్వడం దారుణమైన చర్య: లంకా దినకర్ (ETV Bharat)

ఎన్నికల అనంతరం హింస - బదిలీ అయిన వారి స్థానాల్లో కొత్తవారు నియామకం - 5 Dsps 3 Inspectors

BJP Leaders on YCP Leaders Attacks During Elections: ఎన్నికలలో కూటమికి ఓటు వేశారని విశాఖలో ఓ కుటుంబంపై వైసీపీ రౌడీలు విచక్షణారహితంగా దాడి చేస్తే వారిపై కేసులు నమోదు చేయకుండా వారికి అండగా నిలిచిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేటడాన్ని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తీవ్రంగా ఖండించారు. మహిళల పైన, బాలింతరాలి పైన వైసీపీ మద్దతు దారులు దాడి చేస్తే, దారుణానికి ఒడిగట్టిన వారి మీద చర్యలు తీసుకోకుండా బాదితులకు అండగా నిలిచిన కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకి, ఈ దారుణాన్ని ప్రజల ముందు ఉంచిన మీడియా వారికి 41ఏ నోటీసులు ఇవ్వడం అంటే అది ఆటవిక న్యాయం అవుతుందని లంకా దినకర్ మండిపడ్డారు. పోలీసు శాఖలో ఇంకా కొంత మంది జగన్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

33 చోట్ల హింసాత్మక ఘటనలు - ఏపీలో ఎన్నికల హింసపై సిట్‌ నివేదిక - డీజీపీకి అందజేత - SIT report to DGP

తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య ఉదంతం అనంతరం విశాఖలో కూడా అలాంటి వ్యవహారమే నడుస్తుందా అనే అనుమానం వస్తుందని లంకా దినకర్ అన్నారు. పోలింగ్ సమయంలో, అనంతరం ఓటమి తప్పదన్న నైరాశ్యంలో వైసీపీ నాయకుల ప్రోద్బలంతో జరిగిన దాడులకు సహకరించిన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ పట్టణంలో తమకు ఓటు వేయలేదనే చేసిన దాడులను దారి మళ్లించి కుటుంబ కలహాలుగా చిత్రీకరించే కుట్ర పాత్రధారులని శిక్షించాలని కోరారు. అంతే కాకుండా తిరుపతిలో పులివర్తి నానిపైన జరిగిన హత్యాయత్నాన్ని భాదితులపై నెట్టే ప్రయత్నం చేస్తున్న వారిని సిట్ గుర్తించి చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని లంకా దినకర్ డిమాండ్ చేశారు.

మీడియా గళాన్ని నొక్కే ప్రయత్నం చేస్తున్నారు - ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ - Atchannaidu on Visakha incident

Alliance Candidate Vishnukumar Raju Fire on Police: న్యాయం చేయాలని బాధితుల వైపు నిలబడితే కేసులు పెట్టి నోటీసులివ్వడమేంటని విశాఖ నార్త్‌ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు పోలీసులపై మండిపడ్డారు. కంచరపాలెం బర్మా క్యాంప్ వాసులు సుంకర ధనలక్ష్మి, ఆమె కుటుంబసభ్యులపై దాడి ఘటనను ఖండిస్తూ ఆయన ఈ నెల 17న మీడియా సమావేశం నిర్వహించారు. దీనిపై పోలీసులు సుమోటోగా కేసు పెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. పోలీసులు కేసు పెట్టిన నేపథ్యంలో ఆయన ఈ ఉదయం కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి 41-ఏ నోటీసులు అందుకున్నారు. పోలీసులు ప్రజలకు వాక్‌ స్వాతంత్య్రం లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాదితులకు అండగా నిలిచిన వారికి పోలీసులు నోటీసులివ్వడం దారుణమైన చర్య: లంకా దినకర్ (ETV Bharat)

ఎన్నికల అనంతరం హింస - బదిలీ అయిన వారి స్థానాల్లో కొత్తవారు నియామకం - 5 Dsps 3 Inspectors

Last Updated : May 20, 2024, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.