ETV Bharat / state

ఏపీలో మరో స్కీమ్ అమలు - సాయం రూ.10వేలకు పెంచుతూ ఉత్తర్వులు - Dupa Deepa Naivedyam Scheme charges

ఆంధ్రప్రదేశ్​లో మరో స్కీమ్ అమలు - ధూప, దీప, నైవేద్యం పథకం సాయం రూ.10వేలకు పెంపు.

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

AP Govt Increased Dupa Deepa Naivedyam Scheme Charges : మరో ఎన్నికల హమీ అమలుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆదాయం లేని చిన్న గుళ్లల్లో ధూప, దీప, నైవేద్యాలు నిర్వహించేందుకు అందించే సాయాన్ని రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ ఏపీ సర్కార్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల 5,400 ఆలయాలకు ప్రతినెలా రూ.10వేల చొప్పున అందనుంది.

ఆదాయం లేని చిన్న గుళ్లల్లో స్వామి, అమ్మవార్లకు నిత్యం దీపం వెలిగించి, నైవేద్యం పెట్టేందుకు ధూప, దీప, నైవేద్యం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. గతంలో నెలకు రూ.2,500 అందిస్తుండగా 2015లో టీడీపీ ప్రభుత్వం దీనిని రూ.5 వేలకు పెంచింది. అయితే పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఈ సాయాన్ని రూ.10 వేలకు పెంచుతామని కూటమి నేతలు ఇటీవల ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ మేరకు తాజాగా సాయాన్ని రూ.10 వేలకు పెంచుతూ దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.సత్యనారాయణ ఉత్తర్వు జారీ చేశారు.

దీపావళికి వంటింట్లో 'మహాశక్తి' వెలుగులు - అప్పటి నుంచే ఉచిత గ్యాస్​ సిలిండర్ల పంపిణీ - Free LPG Cylinder Scheme

ఆన్​లైనలో జమ : ఇందులో రూ.7 వేలు అర్చకుడికి భృతిగా, రూ.3 వేలు ధూప, దీప, నైవేద్యానికి వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు. దీన్ని ప్రతినెలా అర్చకుడి ఖాతాలో ఆన్‌లైన్‌ ద్వారా జమచేయనున్నారు. డీడీఎన్‌ఎస్‌ సాయం పెంచడంతో ఏడాదికి ప్రభుత్వంపై అదనంగా రూ.32.40 కోట్ల భారం పడనుంది. దీనిని దేవాదాయశాఖకు చెందిన సర్వ శ్రేయో నిధి (సీజీఎఫ్‌) నుంచి వినియోగించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.

గర్భిణులకు 'అమ్మ కోసం' - మూడో నెల నుంచి ప్రసవం వరకు బాధ్యతంతా ప్రభుత్వానిదే! - Amma Kosam Scheme In Telangana

రైతుల కోసం కేంద్రం అదిరే స్కీమ్- ప్రతినెలా రూ.3000 పెన్షన్ పొందండిలా! - Pradhan Mantri Kisan Mandhan Yojana

AP Govt Increased Dupa Deepa Naivedyam Scheme Charges : మరో ఎన్నికల హమీ అమలుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆదాయం లేని చిన్న గుళ్లల్లో ధూప, దీప, నైవేద్యాలు నిర్వహించేందుకు అందించే సాయాన్ని రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ ఏపీ సర్కార్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల 5,400 ఆలయాలకు ప్రతినెలా రూ.10వేల చొప్పున అందనుంది.

ఆదాయం లేని చిన్న గుళ్లల్లో స్వామి, అమ్మవార్లకు నిత్యం దీపం వెలిగించి, నైవేద్యం పెట్టేందుకు ధూప, దీప, నైవేద్యం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. గతంలో నెలకు రూ.2,500 అందిస్తుండగా 2015లో టీడీపీ ప్రభుత్వం దీనిని రూ.5 వేలకు పెంచింది. అయితే పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఈ సాయాన్ని రూ.10 వేలకు పెంచుతామని కూటమి నేతలు ఇటీవల ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ మేరకు తాజాగా సాయాన్ని రూ.10 వేలకు పెంచుతూ దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.సత్యనారాయణ ఉత్తర్వు జారీ చేశారు.

దీపావళికి వంటింట్లో 'మహాశక్తి' వెలుగులు - అప్పటి నుంచే ఉచిత గ్యాస్​ సిలిండర్ల పంపిణీ - Free LPG Cylinder Scheme

ఆన్​లైనలో జమ : ఇందులో రూ.7 వేలు అర్చకుడికి భృతిగా, రూ.3 వేలు ధూప, దీప, నైవేద్యానికి వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు. దీన్ని ప్రతినెలా అర్చకుడి ఖాతాలో ఆన్‌లైన్‌ ద్వారా జమచేయనున్నారు. డీడీఎన్‌ఎస్‌ సాయం పెంచడంతో ఏడాదికి ప్రభుత్వంపై అదనంగా రూ.32.40 కోట్ల భారం పడనుంది. దీనిని దేవాదాయశాఖకు చెందిన సర్వ శ్రేయో నిధి (సీజీఎఫ్‌) నుంచి వినియోగించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.

గర్భిణులకు 'అమ్మ కోసం' - మూడో నెల నుంచి ప్రసవం వరకు బాధ్యతంతా ప్రభుత్వానిదే! - Amma Kosam Scheme In Telangana

రైతుల కోసం కేంద్రం అదిరే స్కీమ్- ప్రతినెలా రూ.3000 పెన్షన్ పొందండిలా! - Pradhan Mantri Kisan Mandhan Yojana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.