ETV Bharat / state

'నేను చూసుకుంటా - ధైర్యంగా ఉండండి' - అచ్యుతాపురం బాధితులకు బాబు భరోసా - CBN VISITS ATCHUTAPURAM VICTIMS

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 22, 2024, 1:41 PM IST

Updated : Aug 22, 2024, 1:59 PM IST

AP CM Chandrababu Consoles Atchutapuram SEZ Victims : ఏపీలోని అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఇప్పటికే 17 మంది మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో క్షతగాత్రులను విశాఖలోని మెడికవర్ ఆస్పత్రిలో ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ప్రమాద బాధితులు ధైర్యంగా ఉండాలని, ఎంత ఖర్చయినా రక్షించుకుంటాని వారికి భరోసానిచ్చారు.

AP CM Chandrababu
AP CM Chandrababu (ETV Bharat)

AP CM Chandrababu Consoles Atchutapuram SEZ Victims : అచ్యుతాపురం సెజ్‌ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన బాధితుల వద్దకు వెళ్లి వారి క్షేమసమాచారాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని భరోసా కల్పిస్తూ, తానుండగా వారికేం కాదనే ధైర్యాన్ని ఇచ్చారు. ఎంత ఖర్చయినా వాళ్లను తాను రక్షించుకుంటానని బాధితులకు భరోసా కల్పించారు. మరోవైపు వారి ఆరోగ్యంపై వైద్యులను ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు బాధితులకు పరిహారం ప్రకటించారు. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 1 కోటి ప్రకటించారు. తీవ్ర గాయాలైనవారికి రూ.50 లక్షలు చొప్పున, స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షలు చొప్పున పరిహారం చెల్లిస్తామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించినట్లు తెలిపారు.

"ఎంత ఖర్చు అయినా అందరికీ వైద్య సేవలందిస్తాం. అవసరమైన వారికి ప్లాస్టిక్‌ సర్జరీ కూడా చేయిస్తాం. ధైర్యంగా ఉండాలి. మేము అన్నీ చూసుకుంటాం. ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసింది. 17 మంది మరణించారు, 36 మందికి గాయాలయ్యాయి. 10 మందికి తీవ్రగాయాలు, 26 మందికి స్వల్పగాయాలయ్యాయి. బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలందించాలని ఆదేశించాం. తీవ్ర గాయాలైనవారికి రూ.50 లక్షలు చొప్పున పరిహారం, స్వల్ప గాయాలైనవారికి రూ.25 లక్షలు చొప్పున పరిహారం అందిస్తాం." - చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం

AP CM Chandrababu Consoles Atchutapuram SEZ Victims : అచ్యుతాపురం సెజ్‌ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన బాధితుల వద్దకు వెళ్లి వారి క్షేమసమాచారాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని భరోసా కల్పిస్తూ, తానుండగా వారికేం కాదనే ధైర్యాన్ని ఇచ్చారు. ఎంత ఖర్చయినా వాళ్లను తాను రక్షించుకుంటానని బాధితులకు భరోసా కల్పించారు. మరోవైపు వారి ఆరోగ్యంపై వైద్యులను ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు బాధితులకు పరిహారం ప్రకటించారు. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 1 కోటి ప్రకటించారు. తీవ్ర గాయాలైనవారికి రూ.50 లక్షలు చొప్పున, స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షలు చొప్పున పరిహారం చెల్లిస్తామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించినట్లు తెలిపారు.

"ఎంత ఖర్చు అయినా అందరికీ వైద్య సేవలందిస్తాం. అవసరమైన వారికి ప్లాస్టిక్‌ సర్జరీ కూడా చేయిస్తాం. ధైర్యంగా ఉండాలి. మేము అన్నీ చూసుకుంటాం. ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసింది. 17 మంది మరణించారు, 36 మందికి గాయాలయ్యాయి. 10 మందికి తీవ్రగాయాలు, 26 మందికి స్వల్పగాయాలయ్యాయి. బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలందించాలని ఆదేశించాం. తీవ్ర గాయాలైనవారికి రూ.50 లక్షలు చొప్పున పరిహారం, స్వల్ప గాయాలైనవారికి రూ.25 లక్షలు చొప్పున పరిహారం అందిస్తాం." - చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం

Last Updated : Aug 22, 2024, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.