Another Low Pressure is Expected by September 5 : రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరో షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ విభాగం వెల్లడించింది. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో ఏపిలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రాజస్థాన్ లోని జైసల్మెర్ నుంచి విదర్భ తెలంగాణ మీదుగా మచిలీపట్నం వరకూ రుతుపవన ద్రోణి ఏర్పడింది.
రాష్ట్ర ప్రజలకు మరో షాక్ - సెప్టెంబర్ 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! - Another low pressure in ap
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 2, 2024, 3:46 PM IST
|Updated : Sep 2, 2024, 3:53 PM IST
Another Low Pressure is Expected by September 5 : ఇప్పటికే వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావారణ శాఖ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Another Low Pressure is Expected by September 5 : రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరో షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ విభాగం వెల్లడించింది. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో ఏపిలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రాజస్థాన్ లోని జైసల్మెర్ నుంచి విదర్భ తెలంగాణ మీదుగా మచిలీపట్నం వరకూ రుతుపవన ద్రోణి ఏర్పడింది.