ETV Bharat / state

వరద బాధితుల కోసం 'అక్షయపాత్ర' - 5 లక్షల మందికి భోజనం - AkshayaPatra Food for Flood Victims

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 5:38 PM IST

Updated : Sep 3, 2024, 6:56 PM IST

Akshaya Patra Preparing Food for Flood Victims: మంగళగిరిలోని అక్షయపాత్ర వరద బాధితుల కోసం భోజన ప్యాకెట్లను సిద్ధం చేసింది. అక్షయపాత్ర వంటశాలలో వరద బాధితుల కోసం 5 లక్షల ప్యాకెట్లు సిద్ధం చేసింది. ప్రభుత్వం, దాతల సహకారంతో ఈ అరుదైన రికార్డు సాధించామని అక్షయపాత్ర అధికారి చెప్పారు.

akshayapatra_food_for_flood_victims
akshayapatra_food_for_flood_victims (ETV Bharat)

Akshaya Patra Preparing Food for Flood Victims: గుంటూరు జిల్లా మంగళగిరిలోని హరేరామ హరేకృష్ణ మూవ్​మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే అక్షయపాత్ర మరో అరుదైన రికార్డును సాధించింది. అక్షయపాత్ర వంటశాలలో వరద బాధితుల కోసం 5 లక్షల ఫుడ్ ప్యాకెట్లు సిద్ధం చేసింది. ప్రభుత్వం, దాతల సహకారంతో ఈ అరుదైన రికార్డు సాధించామని అక్షయపాత్ర అధికారి విలాస దాసప్రభు చెప్పారు. వరద బాధితుల కోసం మంచి రుచికరమైన, పౌష్టికాహారాన్ని తయారు చేస్తున్నట్లు వివరించారు.

మొదటి రోజు 60 వేలు, 2వ రోజు లక్ష, 3వ రోజు 2 లక్షలు, 4వ రోజు 5 లక్షల మంది వరద బాధితులకు ఆహారాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇంత పెద్దమొత్తంలో తయారైన ఆహారాన్ని ప్యాకింగ్ చేసేందుకు స్వచ్ఛందంగా మహిళలు, వివిధ సంస్థలు, అసోసియేషన్ సిబ్బంది, మెప్మా, మహిళా పోలీసులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ ఆహారాన్ని సక్రమంగా బాధితులకు అందించేందుకు మంగళగిరి నగరపాలక సంస్థ అధికారులు పెద్ద కసరత్తు చేస్తున్నారు.

గుంటూరు, చిలకలూరిపేట, తెనాలి పురపాలక సంఘం నుంచి రోజుకు 400 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఏయే వాహనం ఎక్కడికి వెళ్లాలి ఎన్ని ఆహార ప్యాకెట్లు పంపుతున్నారని కచ్చితంగా లెక్కవేసి మరీ పంపుతున్నారు. ఆహారాన్ని బాధితుల వద్దకు చేరేవేసేందుకు ఆయా పాఠశాలలు, కళాశాలల యజమానులు ఉచితంగా వాహనాలు పంపుతున్నారు. ఈ వాహనాల్లోకి ఆహార ప్యాకెట్లు ఎక్కించేందుకు మంగళగిరికి చెందిన మోటారు మెకానిక్ అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

గత రెండు రోజులుగా 6 లక్షల మందికి భోజనం తయారు చేసి పంపిస్తున్నాము. ప్రభుత్వ సహకారంతో ఇది చేయగలుగుతున్నాము. మేము భోజమం సిద్ధం చేస్తుంటే ప్రభుత్వం తమ వాలంటీర్లతో ప్యాకింగ్, సరఫరా చేయిస్తుంది. ప్రభుత్వం, దాతల సహకారంతోనే వరద బాధితుల కోసం ఆహారాన్ని తయారు చేస్తున్నాము. మొదటి రోజు 60 వేలు, 2వ రోజు లక్ష, 3వ రోజు 2 లక్షలు, 4వ రోజు 5 లక్షల మంది వరద బాధితులకు ఆహారాన్ని సరఫరా చేశాము.- విలాసదాస ప్రభు, అక్షయపాత్ర అధికారి

ఏవరూ భయపడొద్దు - అన్ని విధాలా ఆదుకుంటాం: ప్రజలకు మంత్రుల భరోసా - Ministers Visit Flooded Areas

పెద్ద మనసు చాటుకున్న సీనీ హీరోలు - వరద సాయం ఎవరెంత ఇచ్చారంటే! - Tollywood donates to flood victims

Akshaya Patra Preparing Food for Flood Victims: గుంటూరు జిల్లా మంగళగిరిలోని హరేరామ హరేకృష్ణ మూవ్​మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే అక్షయపాత్ర మరో అరుదైన రికార్డును సాధించింది. అక్షయపాత్ర వంటశాలలో వరద బాధితుల కోసం 5 లక్షల ఫుడ్ ప్యాకెట్లు సిద్ధం చేసింది. ప్రభుత్వం, దాతల సహకారంతో ఈ అరుదైన రికార్డు సాధించామని అక్షయపాత్ర అధికారి విలాస దాసప్రభు చెప్పారు. వరద బాధితుల కోసం మంచి రుచికరమైన, పౌష్టికాహారాన్ని తయారు చేస్తున్నట్లు వివరించారు.

మొదటి రోజు 60 వేలు, 2వ రోజు లక్ష, 3వ రోజు 2 లక్షలు, 4వ రోజు 5 లక్షల మంది వరద బాధితులకు ఆహారాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇంత పెద్దమొత్తంలో తయారైన ఆహారాన్ని ప్యాకింగ్ చేసేందుకు స్వచ్ఛందంగా మహిళలు, వివిధ సంస్థలు, అసోసియేషన్ సిబ్బంది, మెప్మా, మహిళా పోలీసులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ ఆహారాన్ని సక్రమంగా బాధితులకు అందించేందుకు మంగళగిరి నగరపాలక సంస్థ అధికారులు పెద్ద కసరత్తు చేస్తున్నారు.

గుంటూరు, చిలకలూరిపేట, తెనాలి పురపాలక సంఘం నుంచి రోజుకు 400 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఏయే వాహనం ఎక్కడికి వెళ్లాలి ఎన్ని ఆహార ప్యాకెట్లు పంపుతున్నారని కచ్చితంగా లెక్కవేసి మరీ పంపుతున్నారు. ఆహారాన్ని బాధితుల వద్దకు చేరేవేసేందుకు ఆయా పాఠశాలలు, కళాశాలల యజమానులు ఉచితంగా వాహనాలు పంపుతున్నారు. ఈ వాహనాల్లోకి ఆహార ప్యాకెట్లు ఎక్కించేందుకు మంగళగిరికి చెందిన మోటారు మెకానిక్ అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

గత రెండు రోజులుగా 6 లక్షల మందికి భోజనం తయారు చేసి పంపిస్తున్నాము. ప్రభుత్వ సహకారంతో ఇది చేయగలుగుతున్నాము. మేము భోజమం సిద్ధం చేస్తుంటే ప్రభుత్వం తమ వాలంటీర్లతో ప్యాకింగ్, సరఫరా చేయిస్తుంది. ప్రభుత్వం, దాతల సహకారంతోనే వరద బాధితుల కోసం ఆహారాన్ని తయారు చేస్తున్నాము. మొదటి రోజు 60 వేలు, 2వ రోజు లక్ష, 3వ రోజు 2 లక్షలు, 4వ రోజు 5 లక్షల మంది వరద బాధితులకు ఆహారాన్ని సరఫరా చేశాము.- విలాసదాస ప్రభు, అక్షయపాత్ర అధికారి

ఏవరూ భయపడొద్దు - అన్ని విధాలా ఆదుకుంటాం: ప్రజలకు మంత్రుల భరోసా - Ministers Visit Flooded Areas

పెద్ద మనసు చాటుకున్న సీనీ హీరోలు - వరద సాయం ఎవరెంత ఇచ్చారంటే! - Tollywood donates to flood victims

Last Updated : Sep 3, 2024, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.