ETV Bharat / state

కొండా సురేఖ వ్యాఖ్యలతో మా కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది : నాగార్జున

మంత్రి కొండా సురేఖపై క్రిమినల్‌, పరువునష్టం దావా వేసిన హీరో నాగార్జున - నాంపల్లి కోర్టుకు హాజరైన అక్కినేని నాగార్జున వెంట అమల, నాగచైతన్య

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

NAGARJUNA DEFAMATION SUIT HEARING
ACTOR NAGARJUNA DEFAMATION SUIT UPDATES (ETV Bharat)

Akkineni Nagarjuna Defamation Suit Updates : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ న‌టుడు అక్కినేని నాగార్జున క్రిమినల్ కేసుతో పాటు, పరువు నష్టం దావా వేసిన విష‌యం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరగగా, నాగార్జున వాంగ్మూలాన్ని నేడు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు నాంపల్లి కోర్టుకు అక్కినేని నాగార్జున హాజరవ్వగా ఆయన వెంట తన సతీమణి అక్కినేని అమల, కుమారుడు నాగ చైతన్య వచ్చారు. ఈ కేసులో నాగార్జున వాంగ్మూలాన్ని కోర్టు రికార్డ్​ చేసింది. ఆయనతో పాటు మిగతా సాక్షుల స్టేట్​మెంట్​ల‌ను సైతం నమోదు చేస్తోంది.

మంత్రి వ్యాఖ్యలతో మా కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైంది : ఈ క్రమంలో పిటిషన్‌ ఎందుకు దాఖలు చేసారని నాగార్జునను ధర్మాసనం ప్రశ్నించగా, మంత్రి కొండా సురేఖ తన కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వివరించారు. మంత్రి చేసిన కామెంట్స్ వల్ల తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని కోర్టుకు తెలిపారు. తన కుమారుడు నాగచైతన్య, సమంత విడాకులు పైనా మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని తన వాంగ్మూలంలో వివరించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అసత్య ఆరోపణలన్న ఆయన, రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మంత్రి వ్యాఖ్యలతో తన కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైందని పేర్కొన్నారు.

Akkineni Nagarjuna Defamation Suit Updates : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ న‌టుడు అక్కినేని నాగార్జున క్రిమినల్ కేసుతో పాటు, పరువు నష్టం దావా వేసిన విష‌యం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరగగా, నాగార్జున వాంగ్మూలాన్ని నేడు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు నాంపల్లి కోర్టుకు అక్కినేని నాగార్జున హాజరవ్వగా ఆయన వెంట తన సతీమణి అక్కినేని అమల, కుమారుడు నాగ చైతన్య వచ్చారు. ఈ కేసులో నాగార్జున వాంగ్మూలాన్ని కోర్టు రికార్డ్​ చేసింది. ఆయనతో పాటు మిగతా సాక్షుల స్టేట్​మెంట్​ల‌ను సైతం నమోదు చేస్తోంది.

మంత్రి వ్యాఖ్యలతో మా కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైంది : ఈ క్రమంలో పిటిషన్‌ ఎందుకు దాఖలు చేసారని నాగార్జునను ధర్మాసనం ప్రశ్నించగా, మంత్రి కొండా సురేఖ తన కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వివరించారు. మంత్రి చేసిన కామెంట్స్ వల్ల తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని కోర్టుకు తెలిపారు. తన కుమారుడు నాగచైతన్య, సమంత విడాకులు పైనా మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని తన వాంగ్మూలంలో వివరించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అసత్య ఆరోపణలన్న ఆయన, రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మంత్రి వ్యాఖ్యలతో తన కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైందని పేర్కొన్నారు.

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.