ETV Bharat / state

రైలు ప్రయాణంలో కునుకు తీస్తున్నారా? తస్మాత్​ జాగ్రత్త - లేకపోతే అంతే సంగతులు - Train Robberies in Telangana

Theft Cases in Trains : అర్ధరాత్రి రైళ్లలో ప్రయాణికులే లక్ష్యంగా చేసుకుని, అంతరాష్ట్ర ముఠాలు చోరీలకు పాల్పడుతున్నారు. రైల్వే పోలీసుల నిఘా లోపంతో ప్రయాణికుల భద్రత కొరవడిందని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా శిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి పాల్పడిన ముఠా ఆనవాళ్లు ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించలేకపోయారు. తరచూ రైళ్లలో దొంగతనాలు పరిపాటిగా మారిన నేపథ్యంలో, చోరీలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 10:42 AM IST

Train Robberies in Telangana
Train Robberies in Telangana (Etv Bharat)

Train Robberies in Telangana : రైల్వేలోని ప్రజారవాణా విభాగంలో భద్రత లోపం కారణంగా దొంగలు రెచ్చిపోతున్నారు. తమ చేతివాటం చూపిస్తూ రైల్వే పోలీసులకే సవాల్ విసురుతున్నారు. తాజాగా శిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన దొంగతనం కలకలం రేపింది. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు అధికశాతం రైళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Shirdi - Kakinada Express Robbery : అంతరాష్ట్ర ముఠాలు పక్కా పథకం ప్రకారం దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. ఒక్కో ముఠాలో 5 నుంచి 8 మంది సభ్యులు వరకు ఉంటారు. వారిలో తప్పనిసరిగా ఒకరిద్దరు మహిళలు ఉండేవిధంగా చూసుకుంటారు. దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల గురించి ఆరా తీస్తారు. వారు నిద్రలోకి జారగానే ముఠాలు బెర్తుల కింద ఉన్న బ్యాగులు, చేతి సంచులు, సెల్‌ఫోన్లు వంటి విలువైన వస్తువులు కాజేసి రైలు వేగం తగ్గగానే కిందకు దూకుతారు. కొన్నిసందర్భాల్లో చైన్‌ లాగి పారిపోతుంటారు. దొంగతనం చేశాక ముఠా సభ్యులంతా ఎక్కడ కలవాలనేది ముందుగానే నిర్ణయించుకుంటారు. దీని ప్రకారం కొల్లగొట్టిన సొమ్ముతో అజ్ఞాతంలోకి వెళ్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి రైళ్లు. ఇంతటి కీలకమైన ప్రజారవాణాలో భద్రత లోపం కారణంగానే ఏఓబీ, ఏజెన్సీ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున గంజాయి నగరానికి చేరుతుందని ఆరోపణలు వస్తున్నాయి. సరుకు రవాణాకు అధికశాతం స్మగ్లరు రైళ్లనే సురక్షితంగా భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం, బంగారం, బాల కార్మికుల రవాణా జరుగుతోంది. ఈ అక్రమ కార్యక్రమాలను మించి దొంగతనాలు రైల్వే పోలీసులకు సవాల్‌గా మారాయి. కొన్ని సందర్భాల్లో ప్రయాణీకుల ఏమరపాటు దొంగలకు అనువుగా మారుతోంది. సెల్‌పోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు ఛార్జింగ్‌ పెట్టి వదిలేస్తున్నారు.

క్షణాల్లో మాయమవుతున్న దొంగలు : విహారయాత్రలు, శుభకార్యాలకు వెళ్లే మహిళలు విలువైన ఆభరణాలు ధరిస్తున్నారు. బోగీల్లో చేరిన ముఠా సభ్యులు కొందరు ప్రయాణికల మధ్య చేరి పరిసరాలను అంచనా వేస్తారు. ఒంటరిగా ఉన్న వృద్ధులకు దగ్గరై తినుబండారాల్లో మత్తుపదారాల ఉంచి నిద్రలోకి జారుకునేలా చేస్తారు. ప్రయాణికులంతా ఆదమరచి నిద్ర పోతున్నారని నిర్ణయించుకున్నాక విలువైన వస్తువులు దొంగిలించి క్షణాల్లో మాయమవుతారు. గమ్యం చేరాక, నిద్రమత్తు వీడాక తమ వస్తువులు మాయమైనట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

217 జీరో ఎఫ్ఐఆర్​లు నమోదు : సికింద్రాబాద్‌ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రోజూ ఏదో ఒక ప్రాంతంలో 20 వరకు దొంగతనాలు జరుగుతున్నట్లు పోలీసులు అంచనా వేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు సికింద్రాబాద్‌ జీఆర్పీ నమోదు చేసిన కేసుల్లో 217 జీరో ఎఫ్ఐఆర్ ఉన్నాయి. వీరంతా ఏపీ తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిషా తదితర రాష్ట్రాల్లో సొత్తు పోగొట్టుకొని ఇక్కడ ఫిర్యాదు చేశారు.

కృష్ణా కెనాల్ రైల్వే జంక్షన్ సమీపంలో దొంగల బీభత్సం

రైలు ప్రయాణికులే లక్ష్యంగా చోరీలు చేస్తున్న ముఠా అరెస్టు

Train Robberies in Telangana : రైల్వేలోని ప్రజారవాణా విభాగంలో భద్రత లోపం కారణంగా దొంగలు రెచ్చిపోతున్నారు. తమ చేతివాటం చూపిస్తూ రైల్వే పోలీసులకే సవాల్ విసురుతున్నారు. తాజాగా శిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన దొంగతనం కలకలం రేపింది. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు అధికశాతం రైళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Shirdi - Kakinada Express Robbery : అంతరాష్ట్ర ముఠాలు పక్కా పథకం ప్రకారం దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. ఒక్కో ముఠాలో 5 నుంచి 8 మంది సభ్యులు వరకు ఉంటారు. వారిలో తప్పనిసరిగా ఒకరిద్దరు మహిళలు ఉండేవిధంగా చూసుకుంటారు. దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల గురించి ఆరా తీస్తారు. వారు నిద్రలోకి జారగానే ముఠాలు బెర్తుల కింద ఉన్న బ్యాగులు, చేతి సంచులు, సెల్‌ఫోన్లు వంటి విలువైన వస్తువులు కాజేసి రైలు వేగం తగ్గగానే కిందకు దూకుతారు. కొన్నిసందర్భాల్లో చైన్‌ లాగి పారిపోతుంటారు. దొంగతనం చేశాక ముఠా సభ్యులంతా ఎక్కడ కలవాలనేది ముందుగానే నిర్ణయించుకుంటారు. దీని ప్రకారం కొల్లగొట్టిన సొమ్ముతో అజ్ఞాతంలోకి వెళ్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి రైళ్లు. ఇంతటి కీలకమైన ప్రజారవాణాలో భద్రత లోపం కారణంగానే ఏఓబీ, ఏజెన్సీ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున గంజాయి నగరానికి చేరుతుందని ఆరోపణలు వస్తున్నాయి. సరుకు రవాణాకు అధికశాతం స్మగ్లరు రైళ్లనే సురక్షితంగా భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం, బంగారం, బాల కార్మికుల రవాణా జరుగుతోంది. ఈ అక్రమ కార్యక్రమాలను మించి దొంగతనాలు రైల్వే పోలీసులకు సవాల్‌గా మారాయి. కొన్ని సందర్భాల్లో ప్రయాణీకుల ఏమరపాటు దొంగలకు అనువుగా మారుతోంది. సెల్‌పోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు ఛార్జింగ్‌ పెట్టి వదిలేస్తున్నారు.

క్షణాల్లో మాయమవుతున్న దొంగలు : విహారయాత్రలు, శుభకార్యాలకు వెళ్లే మహిళలు విలువైన ఆభరణాలు ధరిస్తున్నారు. బోగీల్లో చేరిన ముఠా సభ్యులు కొందరు ప్రయాణికల మధ్య చేరి పరిసరాలను అంచనా వేస్తారు. ఒంటరిగా ఉన్న వృద్ధులకు దగ్గరై తినుబండారాల్లో మత్తుపదారాల ఉంచి నిద్రలోకి జారుకునేలా చేస్తారు. ప్రయాణికులంతా ఆదమరచి నిద్ర పోతున్నారని నిర్ణయించుకున్నాక విలువైన వస్తువులు దొంగిలించి క్షణాల్లో మాయమవుతారు. గమ్యం చేరాక, నిద్రమత్తు వీడాక తమ వస్తువులు మాయమైనట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

217 జీరో ఎఫ్ఐఆర్​లు నమోదు : సికింద్రాబాద్‌ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రోజూ ఏదో ఒక ప్రాంతంలో 20 వరకు దొంగతనాలు జరుగుతున్నట్లు పోలీసులు అంచనా వేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు సికింద్రాబాద్‌ జీఆర్పీ నమోదు చేసిన కేసుల్లో 217 జీరో ఎఫ్ఐఆర్ ఉన్నాయి. వీరంతా ఏపీ తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిషా తదితర రాష్ట్రాల్లో సొత్తు పోగొట్టుకొని ఇక్కడ ఫిర్యాదు చేశారు.

కృష్ణా కెనాల్ రైల్వే జంక్షన్ సమీపంలో దొంగల బీభత్సం

రైలు ప్రయాణికులే లక్ష్యంగా చోరీలు చేస్తున్న ముఠా అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.