ETV Bharat / state

దారుణం!! 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం - ఆపై కాల్వలోకి తోసి? - 8 YEAR OLD GIRL RAPE IN NANDYALA

Minor Girl Gang Rape in Nandyala : ముక్కుపచ్చలారని పసికందు పదేళ్లు కూడా నిండకముందే ప్రాణం విడిచింది. ఆడుతూ పాడుతూ స్నేహితులతో కలిసి స్కూల్​కు వెళ్లాల్సిన ఆ చిన్నారి కామాంధుల కాటుకు బలైపోయింది. కామంతో కళ్లుమూసుకుపోయిన ముగ్గురు మైనర్ బాలురి చేతిలో పట్టుమని పదేళ్లు కూడా లేని ఆ చిన్నారి ప్రాణం రాలిపోయింది. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఆ మృగాలు రేప్ చేసిన విషయం అందరికీ తెలిసిపోతుందని ఆ పసిపాపను కిరాతకంగా చంపేశారు. ఈ దారుణ ఘటన ఏపీలోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 10, 2024, 12:02 PM IST

Eight year old girl raped
Eight year old girl raped (ETV Bharat)

Minor Girl Rape in Nandyala : ఏపీలోని నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం అందరికీ తెలిసిపోతుందని ఆ బాలికను హత్య చేశారు. తమ కుమార్తె కనిపించకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు మైనర్ బాలురను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక మూడు రోజుల క్రితం అదృశ్యమైంది. దీంతో ఆమె తండ్రి నందికొట్కూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం వెతకడం ప్రారంభించారు. ఎంతకీ ఆచూకీ దొరకకపోవడంతో చివరకు జాగిలాల సాయం తీసుకున్నారు. అయినా ఆమె ఆచూకీ లభించలేదు.

40ఏళ్ల తర్వాత రేప్​ కేస్ నిందితుడు అరెస్ట్- ఆ టెక్నాలజీతోనే! - Man Arrested After 40 Years

అయితే స్థానికులను ఆరా తీసిన పోలీసులకు అందిన సమాచారంతో ముగ్గురు మైనర్‌ బాలురను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఆదివారం సాయంత్రం ముచ్చుమర్రి పార్కు వద్ద బాలిక ఆడుకుంటుండగా సమీపంలోని ఎత్తిపోతల పథకం వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం బయటపడుతుందనే భయంతో బాలికను కాల్వలోకి తోసేశామని చెప్పినట్లు వెల్లడించారు. నిందితుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు జాగిలాల సాయంతో బాలిక ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

బాపట్ల జిల్లాలో దారుణం - మైనర్​ బాలికపై గ్యాంగ్​ రేప్ - MINOR GIRL RAPED IN AP

Minor Girl Rape in Nandyala : ఏపీలోని నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం అందరికీ తెలిసిపోతుందని ఆ బాలికను హత్య చేశారు. తమ కుమార్తె కనిపించకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు మైనర్ బాలురను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక మూడు రోజుల క్రితం అదృశ్యమైంది. దీంతో ఆమె తండ్రి నందికొట్కూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం వెతకడం ప్రారంభించారు. ఎంతకీ ఆచూకీ దొరకకపోవడంతో చివరకు జాగిలాల సాయం తీసుకున్నారు. అయినా ఆమె ఆచూకీ లభించలేదు.

40ఏళ్ల తర్వాత రేప్​ కేస్ నిందితుడు అరెస్ట్- ఆ టెక్నాలజీతోనే! - Man Arrested After 40 Years

అయితే స్థానికులను ఆరా తీసిన పోలీసులకు అందిన సమాచారంతో ముగ్గురు మైనర్‌ బాలురను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఆదివారం సాయంత్రం ముచ్చుమర్రి పార్కు వద్ద బాలిక ఆడుకుంటుండగా సమీపంలోని ఎత్తిపోతల పథకం వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం బయటపడుతుందనే భయంతో బాలికను కాల్వలోకి తోసేశామని చెప్పినట్లు వెల్లడించారు. నిందితుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు జాగిలాల సాయంతో బాలిక ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

బాపట్ల జిల్లాలో దారుణం - మైనర్​ బాలికపై గ్యాంగ్​ రేప్ - MINOR GIRL RAPED IN AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.