ETV Bharat / state

తక్కువ ధరకే బంగారం అంటూ ఐటీ ఉద్యోగి మోసం - 13 మంది వద్ద రూ.6 కోట్లకు పైగా వసూలు - Gold Scam in Hyderabad - GOLD SCAM IN HYDERABAD

6 Crore Gold Scam in Hyderabad : మార్కెట్​ రేటు కంటే తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. బాధితుల దగ్గర నుంచి రూ.6 కోట్లపైనే సేకరించాడు. చివరికి తిరుపతిలో భూ సమస్య ఉందని చెప్పి ఉడాయించాడు. దీంతో మోసపోయిన విషయాన్ని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారు దర్యాప్తు చేసి తిరుపతిలో నిందితుడ్ని పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్​లో జరిగింది.

Gold Scam Worth 6 Crore Rupees
Hyderabad LOW price Gold Scam
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 21, 2024, 3:20 PM IST

6 Crore Gold Scam in Hyderabad : తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మించి రూ.6.12 కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఐటీ ఉద్యోగి సైబరాబాద్‌ పోలీసులకు చిక్కాడు. ఈవోడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) డీసీపీ కె.ప్రసాద్‌ ఏసీపీ సోమనారాయణ సింగ్‌ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతికి చెందిన గంటా శ్రీధర్ ​(40) మాదాపూర్​లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. కొండాపూర్ మసీదు బండలో కుటుంబంతో నివసించేవాడు. తోటి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు కొంపల్లిలోని ఓ వ్యాపారితోనూ పరిచయం పెంచుకున్నాడు.

Low Price Gold Scam Accused Arrest : పరిచయం పెంచుకున్న వ్యక్తులు మార్కెట్‌ ధర కంటే తక్కువకే బంగారం కొనుగోలు చేస్తారని నిందితుడు తెలుసుకున్నాడు. దీంతో పథకం ప్రకారం తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని అందరూ పెట్టుబడులకు ముందుకు రావాలని ప్రేరణ కల్పించాడు. నగదు చెల్లించిన కొద్ది రోజుల తర్వాత బంగారం డెలివరీ అవుతుందని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన కొంపల్లి వ్యాపారి రూ.1.48 కోట్లు బదిలీ చేశారు. ఇలానే మరో 12 మంది నుంచి కలిపి నిందితుడు మొత్తం రూ.6.12 కోట్లు వసూలు చేశాడు.

ట్రేడింగ్​ పేరుతో టీచర్​కు టోకరా - రూ.29 లక్షలు కాజేసిన సైబర్​ నేరగాళ్లు - Cyber Criminals Fraud

Gold Scam Worth 6 Crore Rupees : బాధితులందరికీ కొన్ని ప్రామిసరీ నోట్లు, బాండ్లు, చెక్కులు నిందితుడు ఇచ్చాడు. సికింద్రాబాద్‌లోని 2 బంగారం దుకాణాల పేరుతో డబ్బు బదిలీ చేయించుకున్నాడు. అందరికీ మార్చి 22న బంగారం డెలివరీ చేస్తానని చెప్పాడు. అయితే మార్చి 5న అందరికీ ఫోన్‌ చేసి తిరుపతిలో తనకు సంబంధించిన భూ సమస్య ఉండటంతో వెళ్తున్నానని చెప్పి భార్యాపిల్లలతో సహా ఉడాయించాడు. అప్పటి నుంచి ఫోన్‌ చేసినా స్పందన లేదు. అనుమానం వచ్చిన బాధితులు నిందితుడి గురించి ఆరా తీయగా, కొండాపూర్‌లోని అతని ఫ్లాటు ఖాళీ చేశాడని, మోసపోయామని తెలుసుకున్నారు.

ఖాకీ ఉద్యోగాల పేరుతో రూ.11 లక్షలు కుచ్చుటోపీ - నకిలీ పోలీస్ అరెస్టు - fake cop arrested

తిరుపతిలో దొరికిన నిందితుడు : బాధితులు అందరూ కలిసి సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీసులను ఆశ్రయించారు. జరిగిన విషయాన్ని చెప్పి, ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన వివరాల ప్రకారం పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో నిందితుడ్ని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్​కు తీసుకువచ్చి శనివారం రిమాండ్​కు తరలించారు.

గడువు తీరాక చీటి డబ్బులు ఇవ్వకుండా వేధింపులు - నలుగురు నిర్వాహకులు అరెస్టు - Chit fund fraud four arrest

ఘరానా మోసం - క్రెడిట్ ​కార్డు రుణ పరిమితి పెంచుతామంటూ బ్యాంక్​ ఖాతా ఖాళీ - Cyber fraud in Hyderabad

6 Crore Gold Scam in Hyderabad : తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మించి రూ.6.12 కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఐటీ ఉద్యోగి సైబరాబాద్‌ పోలీసులకు చిక్కాడు. ఈవోడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) డీసీపీ కె.ప్రసాద్‌ ఏసీపీ సోమనారాయణ సింగ్‌ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతికి చెందిన గంటా శ్రీధర్ ​(40) మాదాపూర్​లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. కొండాపూర్ మసీదు బండలో కుటుంబంతో నివసించేవాడు. తోటి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు కొంపల్లిలోని ఓ వ్యాపారితోనూ పరిచయం పెంచుకున్నాడు.

Low Price Gold Scam Accused Arrest : పరిచయం పెంచుకున్న వ్యక్తులు మార్కెట్‌ ధర కంటే తక్కువకే బంగారం కొనుగోలు చేస్తారని నిందితుడు తెలుసుకున్నాడు. దీంతో పథకం ప్రకారం తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని అందరూ పెట్టుబడులకు ముందుకు రావాలని ప్రేరణ కల్పించాడు. నగదు చెల్లించిన కొద్ది రోజుల తర్వాత బంగారం డెలివరీ అవుతుందని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన కొంపల్లి వ్యాపారి రూ.1.48 కోట్లు బదిలీ చేశారు. ఇలానే మరో 12 మంది నుంచి కలిపి నిందితుడు మొత్తం రూ.6.12 కోట్లు వసూలు చేశాడు.

ట్రేడింగ్​ పేరుతో టీచర్​కు టోకరా - రూ.29 లక్షలు కాజేసిన సైబర్​ నేరగాళ్లు - Cyber Criminals Fraud

Gold Scam Worth 6 Crore Rupees : బాధితులందరికీ కొన్ని ప్రామిసరీ నోట్లు, బాండ్లు, చెక్కులు నిందితుడు ఇచ్చాడు. సికింద్రాబాద్‌లోని 2 బంగారం దుకాణాల పేరుతో డబ్బు బదిలీ చేయించుకున్నాడు. అందరికీ మార్చి 22న బంగారం డెలివరీ చేస్తానని చెప్పాడు. అయితే మార్చి 5న అందరికీ ఫోన్‌ చేసి తిరుపతిలో తనకు సంబంధించిన భూ సమస్య ఉండటంతో వెళ్తున్నానని చెప్పి భార్యాపిల్లలతో సహా ఉడాయించాడు. అప్పటి నుంచి ఫోన్‌ చేసినా స్పందన లేదు. అనుమానం వచ్చిన బాధితులు నిందితుడి గురించి ఆరా తీయగా, కొండాపూర్‌లోని అతని ఫ్లాటు ఖాళీ చేశాడని, మోసపోయామని తెలుసుకున్నారు.

ఖాకీ ఉద్యోగాల పేరుతో రూ.11 లక్షలు కుచ్చుటోపీ - నకిలీ పోలీస్ అరెస్టు - fake cop arrested

తిరుపతిలో దొరికిన నిందితుడు : బాధితులు అందరూ కలిసి సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీసులను ఆశ్రయించారు. జరిగిన విషయాన్ని చెప్పి, ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన వివరాల ప్రకారం పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో నిందితుడ్ని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్​కు తీసుకువచ్చి శనివారం రిమాండ్​కు తరలించారు.

గడువు తీరాక చీటి డబ్బులు ఇవ్వకుండా వేధింపులు - నలుగురు నిర్వాహకులు అరెస్టు - Chit fund fraud four arrest

ఘరానా మోసం - క్రెడిట్ ​కార్డు రుణ పరిమితి పెంచుతామంటూ బ్యాంక్​ ఖాతా ఖాళీ - Cyber fraud in Hyderabad

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.