Ind W vs Sa W Test 2024: భారత మహిళల జట్టు టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించింది. చెన్నై వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో టీమ్ఇండియా 603-6 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది. దీంతో టెస్టు ఫార్మాట్ చరిత్రలో సింగింల్ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు బాదిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. గతంలో ఆస్ట్రేలియా 575-9 పేరిట ఈ రికార్డు ఉంది. తాజా ఇన్నింగ్స్తో టీమ్ఇండియా మహిళలు ఈ రికార్డును బద్దలుకొట్టారు.
మహిళల టెస్టు క్రికెట్లో టాప్- 5 స్కోర్లు
- భారత్- 603/6d vs సౌతాఫ్రికా- 2024
- ఆస్ట్రేలియా- 575/9d vs సౌతాఫ్రికా- 2024
- ఆస్ట్రేలియా- 569/6d vs ఇంగ్లాండ్- 1998
- ఆస్ట్రేలియా- 525/10 vs భారత్- 1984
- న్యూజిలాండ్- 517/8 vs ఇంగ్లాండ్- 1996
ఇక ఓవర్నైట్ స్కోర్ 525-4తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 78 పరుగులు జోడించింది. ఈ సెషన్లో రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (69 పరుగులు), రిచా ఘోష్ (86 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరిద్దరూ 5వ వికెట్కు 143 పరుగులు భాగస్వామ్యం నిర్మించారు. సౌతాఫ్రికౌ బౌలర్లలో దెల్మి టక్కర్ 2, డి క్లర్క్, సెకుదునే, మల్బ తలో వికెట్ దక్కించుకున్నారు.