ETV Bharat / sports

షఫాలీ వర్మ @200- దెబ్బకు వరల్డ్​ రికార్డ్ బ్రేక్ - Ind w vs Sa w Test 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 28, 2024, 4:06 PM IST

Updated : Jun 28, 2024, 5:17 PM IST

Shafali Verma 200: టీమ్ఇండియా మహిళల జట్టు యంగ్ బ్యాటర్ షఫాలీ వర్మ వరల్డ్​ రికార్డ్ క్రియేట్ చేసింది.

SHAFALI VERMA
SHAFALI VERMA (Source: Getty Images)

Shafali Verma 200: టీమ్ఇండియా మహిళల జట్టు యంగ్ బ్యాటర్ షఫాలీ వర్మ వరల్డ్​ రికార్డ్ క్రియేట్ చేసింది. చెన్నై వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్​లో మహిళల క్రికెట్​లోనే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించింది. షఫాలీ 194 బంతుల్లోనే 200 మార్క్ అందుకుంది. ఈ క్రమంలో ఆసీస్ బ్యాటర్ అనబెల్ (248 బంతుల్లో) రికార్డ్​ను షఫాలీ బ్రేక్ చేసింది.

కాగా, టీమ్ఇండియా నుంచి టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో బ్యాటర్​గా నిలిచింది. 2002లో అప్పటి భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ మార్క్ అందుకుంది. అంటే దాదాపు 22ఏళ్ల తర్వాత మహిళల క్రికెట్​లో టీమ్ఇండియా బ్యాటర్ డబుల్ సాధించింది. ఇక షఫాలీ ఓవరాల్​గా ఉమెన్స్ క్రికెట్​లో టెస్టు డబుల్ సెంచరీ సాధించిన 10వ బ్యాటర్​గా నిలిచింది.

స్మృతి జస్ట్ మిస్
ఈ మ్యాచ్​లో మరో ఓపెనర్ స్మృతి మంధాన కూడా రఫ్పాడించింది. షఫాలీతో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించింది. ఈ మ్యాచ్​లో మంధాన 149 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఒక్క పరుగు తేడాతో కెరీర్​లో తొలి 150 మిస్ చేసుకుంది. వీరిద్దరు తొలి వికెట్​కు 292 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించారు. ఇది మహిళల టెస్టు క్రికెట్​లో అత్యధిక తొలి వికెట్ పార్ట్​నర్​షిప్.

ఇక మ్యాచ్​విషయానికొస్తే, తొలి రోజు ఆట ముగిసేసరికి టీమ్ఇండియా 525-4 భారీ స్కోర్ చేసింది. క్రీజులో హర్మన్​ప్రీత్ సింగ్ (42 పరుగులు), రిచా ఘోష్ (43 పరుగులు) ఉన్నారు. ఓపెనర్లు షఫాలీ వర్మ (205), స్మృతి మంధాన (149), జెమీమా రోడ్రిగ్స్​ (55 పరుగులు) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో దెల్మి టక్కర్ 2, డి క్లర్క్ 1 వికెట్ పడగొట్టారు.

అందులోనూ రికార్డే మహిళల టెస్టులో ఒక రోజులో అత్యధిక పరుగులు చేసిన జట్టుగానూ టీమ్ఇండియా రికార్డు సృష్టించింది. 2002లో బంగ్లాదేశ్​పై శ్రీలంక (509-9 స్కోర్) రికార్డు బద్దలైంది. ఈ మ్యాచ్​లో భారత్ తొలి రోజే 525 పరుగులు చేసింది.

2024 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్- భారత్ x పాక్ మ్యాచ్ ఎప్పుడంటే? - Asia Cup 2024 Schedule

అమ్మాయిలు అదరహో - వన్డే టోర్నీలో భారీ విజయం

Shafali Verma 200: టీమ్ఇండియా మహిళల జట్టు యంగ్ బ్యాటర్ షఫాలీ వర్మ వరల్డ్​ రికార్డ్ క్రియేట్ చేసింది. చెన్నై వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్​లో మహిళల క్రికెట్​లోనే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించింది. షఫాలీ 194 బంతుల్లోనే 200 మార్క్ అందుకుంది. ఈ క్రమంలో ఆసీస్ బ్యాటర్ అనబెల్ (248 బంతుల్లో) రికార్డ్​ను షఫాలీ బ్రేక్ చేసింది.

కాగా, టీమ్ఇండియా నుంచి టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో బ్యాటర్​గా నిలిచింది. 2002లో అప్పటి భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ మార్క్ అందుకుంది. అంటే దాదాపు 22ఏళ్ల తర్వాత మహిళల క్రికెట్​లో టీమ్ఇండియా బ్యాటర్ డబుల్ సాధించింది. ఇక షఫాలీ ఓవరాల్​గా ఉమెన్స్ క్రికెట్​లో టెస్టు డబుల్ సెంచరీ సాధించిన 10వ బ్యాటర్​గా నిలిచింది.

స్మృతి జస్ట్ మిస్
ఈ మ్యాచ్​లో మరో ఓపెనర్ స్మృతి మంధాన కూడా రఫ్పాడించింది. షఫాలీతో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించింది. ఈ మ్యాచ్​లో మంధాన 149 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఒక్క పరుగు తేడాతో కెరీర్​లో తొలి 150 మిస్ చేసుకుంది. వీరిద్దరు తొలి వికెట్​కు 292 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించారు. ఇది మహిళల టెస్టు క్రికెట్​లో అత్యధిక తొలి వికెట్ పార్ట్​నర్​షిప్.

ఇక మ్యాచ్​విషయానికొస్తే, తొలి రోజు ఆట ముగిసేసరికి టీమ్ఇండియా 525-4 భారీ స్కోర్ చేసింది. క్రీజులో హర్మన్​ప్రీత్ సింగ్ (42 పరుగులు), రిచా ఘోష్ (43 పరుగులు) ఉన్నారు. ఓపెనర్లు షఫాలీ వర్మ (205), స్మృతి మంధాన (149), జెమీమా రోడ్రిగ్స్​ (55 పరుగులు) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో దెల్మి టక్కర్ 2, డి క్లర్క్ 1 వికెట్ పడగొట్టారు.

అందులోనూ రికార్డే మహిళల టెస్టులో ఒక రోజులో అత్యధిక పరుగులు చేసిన జట్టుగానూ టీమ్ఇండియా రికార్డు సృష్టించింది. 2002లో బంగ్లాదేశ్​పై శ్రీలంక (509-9 స్కోర్) రికార్డు బద్దలైంది. ఈ మ్యాచ్​లో భారత్ తొలి రోజే 525 పరుగులు చేసింది.

2024 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్- భారత్ x పాక్ మ్యాచ్ ఎప్పుడంటే? - Asia Cup 2024 Schedule

అమ్మాయిలు అదరహో - వన్డే టోర్నీలో భారీ విజయం

Last Updated : Jun 28, 2024, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.