ETV Bharat / sports

టీమ్​ఇండియా మాజీ కోచ్‌తో బరిలోకి పాకిస్థాన్ - ప్రభావం చూపుతుందా? - T20 World Cup 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 3, 2024, 9:42 AM IST

T20 World Cup 2024 Pakisthan Coach : టీ20 వరల్డ్ కప్​ 2024 మొదలైపోయింది. అయితే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 9న జరగనుంది. అయితే పాక్ జట్టుకు గ్యారీ కిరస్టన్‌ కోచ్​గా వ్యవహరిస్తున్నాడు. అయితే గ్యారీ కిరస్టన్​ను తక్కువ అంచనా వెయ్యకూడదని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాలు స్టోరీలో.

Source ANI
T20 World Cup 2024 Pakisthan Coach (Source ANI)

T20 World Cup 2024 Pakisthan Coach : పాకిస్థాన్ వైట్ బాల్ కోచ్‌గా ఉన్న గ్యారీ కిరస్టన్​ ముందు మరో సవాల్ నిలిచింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు టీ20 వరల్డ్ కప్​ 2024లో తమ జట్టు బాధ్యతలను అతడికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో గ్యారీ మెంటార్​గా వ్యవహరిస్తున్న గుజరాత్ టైటాన్స్ ఊహించిన దాని కన్నా మెరుగ్గా రాణించడం సహా అతడి ట్రాక్ రికార్డ్​ను పరిశీలించి ఈ ప్రపంచకప్​లో కోచ్​గా బాధ్యతలు అప్పగించింది. దీంతో ఈ వరల్డ్​ కప్​లో అతడి నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు ఎలాంటి ప్రభావం చూపిస్తుందా అనేది ప్రాధాన్యత సంతరించుకుంది.

దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ అయిన గ్యారీ కిస్టన్​కు ఇండియన్ క్రికెట్ అభిమానుల్లో మంచి స్థానం ఉంది. 2008 నుంచి 2011వరకూ టీమ్​ఇండియా కోసం పనిచేశాడు. 2011 వరల్డ్ కప్ సమయంలో టీమ్​ఇండియాకు కోచ్‌గా వ్యవహరించాడు గ్యారీ. ఆ మెగా ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ గెలిచిన యువరాజ్ సింగ్ సైతం గ్యారీని బెస్ట్ కోచ్‌గా అభివర్ణించాడు. సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లాంటి వాళ్లు కూడా అతని మేనేజ్మెంట్ స్కిల్స్‌పై ప్రశంసలు కురిపించారు.

ప్రస్తుతం పాకిస్థాన్​ లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్ క్రికెట్ బ్యాటింగ్ కోచ్‌గానూ, జట్టుకు మెంటార్​గానూ పనిచేస్తున్నాడు గ్యారీ. అలానే ఐపీఎల్​లోనూ దిల్లీ డేర్ డెవిల్స్​, ఆర్సీబీ, గుజరాత్​ కోచ్​గా, మెంటార్​గా అతడికి సుదీర్ఘ అనుభవం ఉంది. ముఖ్యంగా భారత ఆటగాళ్లతో పని చేసిన అనుభవం బాగానే ఉంది. అయితే టీ20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ ప్రకారం భారత్‌, పాకిస్థాన్​ మధ్య జూన్ 9న మ్యాచ్ జరగనుంది. న్యూయార్క్‌లోని నాస్సౌ కౌంటీ గ్రౌండ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ జరగనుంది. దీంతో టీమ్​ఇండియా ప్లేయర్ల బలాలు, బలహీనతలు తెలిసి ఉన్న అతనే పాకిస్థాన్ జట్టును వెనకనుంచి నడిపిస్తుండటంతో కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలానే ఈ ప్రపంచకప్​లో అతడి సలహాలు, సూచనలు వల్ల పాకిస్థాన్​ జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తుందా అని కూడా ఆలోచిస్తున్నారు.

మరోవైపు మెంటల్​ కండీషన్ కోచ్‌గా వ్యవహరించిన ప్యాడీ అప్టన్ గ్యారీ కిరస్టన్​ గురించి మాట్లాడుతూ ఇదేం పెద్ద ఆలోచించాల్సిన విషయం కాదంటున్నారు. "ఈ రోజుల్లో మ్యాచ్ వీడియోలు చూసి ప్లేయర్‌ను అంచనా వేయడం ప్రత్యర్థులకు చాలా సులువుగా ఉంది. ఇదే తరహాలో ప్రపంచంలోని చాలా మంది ప్లేయర్లు ఇతర టీమ్​లోని వాళ్లను పలు లీగ్స్‌లలో దెబ్బతీస్తున్నారు. వాటి వల్ల ఆల్రెడీ మనం కావాల్సిన విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇక కిర్‌స్టన్ పాక్ కోచ్ అవడం వల్ల వచ్చిన నష్టమేం లేదు" అని అంటున్నాడు.

అయితే టీమ్​ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గ్యారీపై ప్రశంసలు కురిపించాడు. అతడికి ఏ ప్లేయర్​కు ఎంత ప్రాక్టీస్ అవసరమో బాగా తెలుసని చెప్తున్నాడు. అతని వల్ల ప్లేయర్లు బాగా కంఫర్ట్​గా ఫీలవుతారని చెప్పాడు. తాను జట్టులో ఉన్న సమయంలో తనకు 50 బంతులు, రాహుల్ ద్రవిడ్​కు 200, సచిన్ తెందుల్కర్‌కు 300, గౌతమ్​ గంభీర్‌కు 400 బాల్స్​ ప్రాక్టీస్ చేయించేవాడని పేర్కొన్నాడు. అలా ప్లేయర్ల మనసులు తెలిసినవాడిగా గ్యారీకి మంచి పేరుంది.

క్యాన్సర్‌ను జయించి - ప్రపంచకప్​ జట్టుకు కెప్టెన్​గా ఎంపికై - T20 WorldCup 2024

పసికూనపై అతి కష్టంగా - పాపువా న్యూగినీపై విండీస్ విజయం - T20 World Cup 2024

T20 World Cup 2024 Pakisthan Coach : పాకిస్థాన్ వైట్ బాల్ కోచ్‌గా ఉన్న గ్యారీ కిరస్టన్​ ముందు మరో సవాల్ నిలిచింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు టీ20 వరల్డ్ కప్​ 2024లో తమ జట్టు బాధ్యతలను అతడికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో గ్యారీ మెంటార్​గా వ్యవహరిస్తున్న గుజరాత్ టైటాన్స్ ఊహించిన దాని కన్నా మెరుగ్గా రాణించడం సహా అతడి ట్రాక్ రికార్డ్​ను పరిశీలించి ఈ ప్రపంచకప్​లో కోచ్​గా బాధ్యతలు అప్పగించింది. దీంతో ఈ వరల్డ్​ కప్​లో అతడి నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు ఎలాంటి ప్రభావం చూపిస్తుందా అనేది ప్రాధాన్యత సంతరించుకుంది.

దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ అయిన గ్యారీ కిస్టన్​కు ఇండియన్ క్రికెట్ అభిమానుల్లో మంచి స్థానం ఉంది. 2008 నుంచి 2011వరకూ టీమ్​ఇండియా కోసం పనిచేశాడు. 2011 వరల్డ్ కప్ సమయంలో టీమ్​ఇండియాకు కోచ్‌గా వ్యవహరించాడు గ్యారీ. ఆ మెగా ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ గెలిచిన యువరాజ్ సింగ్ సైతం గ్యారీని బెస్ట్ కోచ్‌గా అభివర్ణించాడు. సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లాంటి వాళ్లు కూడా అతని మేనేజ్మెంట్ స్కిల్స్‌పై ప్రశంసలు కురిపించారు.

ప్రస్తుతం పాకిస్థాన్​ లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్ క్రికెట్ బ్యాటింగ్ కోచ్‌గానూ, జట్టుకు మెంటార్​గానూ పనిచేస్తున్నాడు గ్యారీ. అలానే ఐపీఎల్​లోనూ దిల్లీ డేర్ డెవిల్స్​, ఆర్సీబీ, గుజరాత్​ కోచ్​గా, మెంటార్​గా అతడికి సుదీర్ఘ అనుభవం ఉంది. ముఖ్యంగా భారత ఆటగాళ్లతో పని చేసిన అనుభవం బాగానే ఉంది. అయితే టీ20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ ప్రకారం భారత్‌, పాకిస్థాన్​ మధ్య జూన్ 9న మ్యాచ్ జరగనుంది. న్యూయార్క్‌లోని నాస్సౌ కౌంటీ గ్రౌండ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ జరగనుంది. దీంతో టీమ్​ఇండియా ప్లేయర్ల బలాలు, బలహీనతలు తెలిసి ఉన్న అతనే పాకిస్థాన్ జట్టును వెనకనుంచి నడిపిస్తుండటంతో కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలానే ఈ ప్రపంచకప్​లో అతడి సలహాలు, సూచనలు వల్ల పాకిస్థాన్​ జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తుందా అని కూడా ఆలోచిస్తున్నారు.

మరోవైపు మెంటల్​ కండీషన్ కోచ్‌గా వ్యవహరించిన ప్యాడీ అప్టన్ గ్యారీ కిరస్టన్​ గురించి మాట్లాడుతూ ఇదేం పెద్ద ఆలోచించాల్సిన విషయం కాదంటున్నారు. "ఈ రోజుల్లో మ్యాచ్ వీడియోలు చూసి ప్లేయర్‌ను అంచనా వేయడం ప్రత్యర్థులకు చాలా సులువుగా ఉంది. ఇదే తరహాలో ప్రపంచంలోని చాలా మంది ప్లేయర్లు ఇతర టీమ్​లోని వాళ్లను పలు లీగ్స్‌లలో దెబ్బతీస్తున్నారు. వాటి వల్ల ఆల్రెడీ మనం కావాల్సిన విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇక కిర్‌స్టన్ పాక్ కోచ్ అవడం వల్ల వచ్చిన నష్టమేం లేదు" అని అంటున్నాడు.

అయితే టీమ్​ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గ్యారీపై ప్రశంసలు కురిపించాడు. అతడికి ఏ ప్లేయర్​కు ఎంత ప్రాక్టీస్ అవసరమో బాగా తెలుసని చెప్తున్నాడు. అతని వల్ల ప్లేయర్లు బాగా కంఫర్ట్​గా ఫీలవుతారని చెప్పాడు. తాను జట్టులో ఉన్న సమయంలో తనకు 50 బంతులు, రాహుల్ ద్రవిడ్​కు 200, సచిన్ తెందుల్కర్‌కు 300, గౌతమ్​ గంభీర్‌కు 400 బాల్స్​ ప్రాక్టీస్ చేయించేవాడని పేర్కొన్నాడు. అలా ప్లేయర్ల మనసులు తెలిసినవాడిగా గ్యారీకి మంచి పేరుంది.

క్యాన్సర్‌ను జయించి - ప్రపంచకప్​ జట్టుకు కెప్టెన్​గా ఎంపికై - T20 WorldCup 2024

పసికూనపై అతి కష్టంగా - పాపువా న్యూగినీపై విండీస్ విజయం - T20 World Cup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.