ETV Bharat / sports

భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం - అసలు ఎవరీ ప్రవీణ్‌ కుమార్‌? - Who Is Praveen Kumar wins Gold

author img

By ETV Bharat Sports Team

Published : Sep 6, 2024, 6:22 PM IST

Paralympics 2024 Praveen Kumar Gold Medal : ప్రస్తుతం జరుగుతోన్న పారిస్ పారాలింపిక్స్​లో హైజంప్​లో ప్రవీణ్​ కుమార్ గోల్డ్ మెడల్ సాధించాడు. తద్వారా పారాలింపిక్స్‌లో వరుసగా రెండో పతకాలు సాధించిన అథ్లెట్​గా నిలిచాడు. అలానే హైజంప్​లో భారత్​ తరఫున గోల్డ్​ మెడల్​ సాధించిన రెండో ఆటగాడు కూడా ప్రవీణే. అసలు ఇంతకీ అతడు ఎవరంటే?

source AFP
Paralympics 2024 Praveen Kumar Gold Medal (source AFP)

Paralympics 2024 Praveen Kumar Gold Medal : పారిస్‌ పారాలింపిక్స్​ 2024లో భారత అథ్లెట్లు తమ ప్రతిభను చాటుతూ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. వైకల్యాలను అధిగమించి మరీ పతకాలను సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. పురుషుల హై జంప్‌ టీ64 ఈవెంట్​లో ప్రవీణ్‌ కుమార్‌ అగ్ర స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్​ను దక్కించుకున్నాడు. టీ 64 హై జంప్‌ పోటీల్లో 2.08 మీటర్ల ఎత్తు జంప్ చేసి స్వర్ణాన్ని ముద్దాడాడు. ఈ సీజన్‌లో ఇదే అత్యుత్తమ హై జంప్‌ రికార్డ్​. ఈ మెడల్​తో భారత్​ ఖాతాలో పతకాల సంఖ్య 26కు చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి.

అతిచిన్న వయసులోనే రికార్డ్​ - 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లోనూ ప్రవీణ్​ సిల్వర్ మెడల్ సాధించాడు. తద్వారా అప్పుడు అతడు అతి చిన్న వయసులోనే ఒలింపిక్‌ మెడల్ సాధించిన పారా అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు. ఇంకా ప్రస్తుత పారాలింపిక్స్​లో మెడల్​ అందుకోవడంతో, ప్రవీణ్ పారాలింపిక్స్‌లో వరుసగా రెండో పతకాన్ని సాధించినట్టైంది.

అలానే హైజంప్​లో భారత్​ తరఫున గోల్డ్​ మెడల్​ సాధించిన రెండో ఆటగాడు కూడా ప్రవీణే. అంతకుముందు మరియప్పన్‌ తంగవేలు ఈ హైజంప్​లో స్వర్ణాన్ని ముద్దాడాడు. ఇంకా పారిస్‌ పారాలింపిక్స్​లో గోల్డ్ మెడల్ సాధించిన మూడో హైజంపర్‌గానూ నిలిచాడు. ఇకపోతే ఈ పారిస్​ పారాలింపిక్స్​లో ఇప్పటికే హైజంప్‌ టీ-63 ఈవెంట్​లో శరద్‌ కుమార్‌ సిల్వర్​(1.88 మీటర్లు), తంగవేలు మరియప్పన్‌ బ్రాంజ్​(1.85 మీటర్లు) మెడల్​ను దక్కించుకున్నారు.

అసలు ఎవరీ ప్రవీణ్‌ కుమార్‌ - ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన 21ఏళ్ల అథ్లెట్‌ ప్రవీణ్ కుమార్. ఇతడికి పుట్టుకతోనే కాలి వైకల్యం ఉంది. ఓ కాలు చిన్నగా ఉండటం వల్ల చిన్నప్పుడు ఆత్మన్యూనతా భావంతో గడిపేవాడు ప్రవీణ్. అయితే ఆ బాధను అధిగమించడానికి క్రీడల వైపు ఆసక్తిని మళ్లించాడు. మొదట వాలీబాల్​పై ఆసక్తిని పెంచుకుని దానినే ఎక్కువగా ఆడేవాడు. కానీ ఆ తర్వాత ఓ పారా అథ్లెటిక్స్‌ కోచ్‌ అతడి సామర్థ్యాన్ని గుర్తించి హైజంప్‌లో పోటీ పడేలా ప్రోత్సహించాడు. అప్పటి నుంచి ప్రవీణ్​ కెరీర్‌ మలుపు తిరిగింది.

2019లో స్విట్జర్లాండ్‌ వేదికగా జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో ప్రవీణ్ సిల్వర్​ మెడల్ సాధించాడు. ఆ తర్వాత 2021లో దుబాయ్‌ వేదికగా జరిగిన గ్రాండ్‌ ప్రీ అథ్లెటిక్స్‌ ఈవెంట్‌లోనూ గోల్డ్​ మెడల్​ను సాధించాడు. అదే ఏడాది టోక్యో పారాలింపిక్స్‌లోనూ సిల్వర్​ మెడల్​ను దక్కించుకున్నాడు. 2022లో ఏషియన్‌ పారా గేమ్స్‌లోనూ గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు 2.05 మీటర్లతో ఆసియా రికార్డును క్రియేట్ చేశాడు.

పారాలింపిక్స్‌ 2024 - హైజంప్‌లో భారత్‌కు స్వర్ణం

ఇండియా క్రికెట్ 'కుబేరుడు' ఇతడే - సచిన్, విరాట్ కాదు! - Indias Richest Cricketer

Paralympics 2024 Praveen Kumar Gold Medal : పారిస్‌ పారాలింపిక్స్​ 2024లో భారత అథ్లెట్లు తమ ప్రతిభను చాటుతూ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. వైకల్యాలను అధిగమించి మరీ పతకాలను సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. పురుషుల హై జంప్‌ టీ64 ఈవెంట్​లో ప్రవీణ్‌ కుమార్‌ అగ్ర స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్​ను దక్కించుకున్నాడు. టీ 64 హై జంప్‌ పోటీల్లో 2.08 మీటర్ల ఎత్తు జంప్ చేసి స్వర్ణాన్ని ముద్దాడాడు. ఈ సీజన్‌లో ఇదే అత్యుత్తమ హై జంప్‌ రికార్డ్​. ఈ మెడల్​తో భారత్​ ఖాతాలో పతకాల సంఖ్య 26కు చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి.

అతిచిన్న వయసులోనే రికార్డ్​ - 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లోనూ ప్రవీణ్​ సిల్వర్ మెడల్ సాధించాడు. తద్వారా అప్పుడు అతడు అతి చిన్న వయసులోనే ఒలింపిక్‌ మెడల్ సాధించిన పారా అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు. ఇంకా ప్రస్తుత పారాలింపిక్స్​లో మెడల్​ అందుకోవడంతో, ప్రవీణ్ పారాలింపిక్స్‌లో వరుసగా రెండో పతకాన్ని సాధించినట్టైంది.

అలానే హైజంప్​లో భారత్​ తరఫున గోల్డ్​ మెడల్​ సాధించిన రెండో ఆటగాడు కూడా ప్రవీణే. అంతకుముందు మరియప్పన్‌ తంగవేలు ఈ హైజంప్​లో స్వర్ణాన్ని ముద్దాడాడు. ఇంకా పారిస్‌ పారాలింపిక్స్​లో గోల్డ్ మెడల్ సాధించిన మూడో హైజంపర్‌గానూ నిలిచాడు. ఇకపోతే ఈ పారిస్​ పారాలింపిక్స్​లో ఇప్పటికే హైజంప్‌ టీ-63 ఈవెంట్​లో శరద్‌ కుమార్‌ సిల్వర్​(1.88 మీటర్లు), తంగవేలు మరియప్పన్‌ బ్రాంజ్​(1.85 మీటర్లు) మెడల్​ను దక్కించుకున్నారు.

అసలు ఎవరీ ప్రవీణ్‌ కుమార్‌ - ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన 21ఏళ్ల అథ్లెట్‌ ప్రవీణ్ కుమార్. ఇతడికి పుట్టుకతోనే కాలి వైకల్యం ఉంది. ఓ కాలు చిన్నగా ఉండటం వల్ల చిన్నప్పుడు ఆత్మన్యూనతా భావంతో గడిపేవాడు ప్రవీణ్. అయితే ఆ బాధను అధిగమించడానికి క్రీడల వైపు ఆసక్తిని మళ్లించాడు. మొదట వాలీబాల్​పై ఆసక్తిని పెంచుకుని దానినే ఎక్కువగా ఆడేవాడు. కానీ ఆ తర్వాత ఓ పారా అథ్లెటిక్స్‌ కోచ్‌ అతడి సామర్థ్యాన్ని గుర్తించి హైజంప్‌లో పోటీ పడేలా ప్రోత్సహించాడు. అప్పటి నుంచి ప్రవీణ్​ కెరీర్‌ మలుపు తిరిగింది.

2019లో స్విట్జర్లాండ్‌ వేదికగా జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో ప్రవీణ్ సిల్వర్​ మెడల్ సాధించాడు. ఆ తర్వాత 2021లో దుబాయ్‌ వేదికగా జరిగిన గ్రాండ్‌ ప్రీ అథ్లెటిక్స్‌ ఈవెంట్‌లోనూ గోల్డ్​ మెడల్​ను సాధించాడు. అదే ఏడాది టోక్యో పారాలింపిక్స్‌లోనూ సిల్వర్​ మెడల్​ను దక్కించుకున్నాడు. 2022లో ఏషియన్‌ పారా గేమ్స్‌లోనూ గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు 2.05 మీటర్లతో ఆసియా రికార్డును క్రియేట్ చేశాడు.

పారాలింపిక్స్‌ 2024 - హైజంప్‌లో భారత్‌కు స్వర్ణం

ఇండియా క్రికెట్ 'కుబేరుడు' ఇతడే - సచిన్, విరాట్ కాదు! - Indias Richest Cricketer

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.