ETV Bharat / sports

ఒలింపిక్స్​కు హై సెక్యూరిటీ- పారిస్​లో ఇండియన్​ డాగ్ స్వ్కాడ్- డ్యూటీలో 45వేల మంది పోలీసులు! - 2024 Paris Olympics

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 6:27 PM IST

2024 Paris Olympics Security: విశ్వ క్రీడల సంరంభానికి అతిథ్యం ఇస్తున్న ఫ్రాన్స్‌ ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. భద్రత కోసం భారీగా నిధులు కేటాయించడమే కాకుండా వేలాదిగా సెక్యూరిటీ అధికారులను, శిక్షణ పొందిన జాగిలాలను వినియోగిస్తోంది.

Paris Olympics Security
Paris Olympics Security (Source: Associated Press)

2024 Paris Olympics Security: పారిస్ ఒలింపిక్స్ 2024 విశ్వ క్రీడల సంరంభానికి సమయం దగ్గరపడుతోంది. ముచ్చటగా మూడోసారి ఒలింపిక్స్‌కు అతిథ్యం ఇస్తున్న పారిస్‌, విశ్వ క్రీడలను ఘనంగా నిర్వహించాలని పట్టుదలగా ఉంది. ఈ విశ్వక్రీడల్లో పాల్గొనేందుకు 180+ దేశాల నుంచి అథ్లెట్లు పారిస్​కు రానున్నారు. ఇక వివిధ దేశాల ప్రముఖులు, సెలబ్రిటీలు ప్రత్యక్షంగా ఒలింపిక్స్ క్రీడలు​ వీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో విశ్వక్రీడల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఫ్రాన్స్‌ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. భద్రత కోసం ఫ్రాన్స్ ఇప్పటికే, భారత ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఒలింపిక్స్‌ భద్రత కోసం భారత ప్రభుత్వం సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కే- 9 జాతి శునకాలను పారిస్‌కు పంపింది. ఈ శునకాలు ఇప్పటికే పారిస్‌లో భద్రతా విధుల్లో పాల్గొంటున్నాయి.

పటిష్ఠ భద్రత
ఒలింపిక్స్ క్రీడలను ప్రశాతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ఆతిథ్య దేశాలు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. 2000లో సిడ్నీ ఒలింపిక్స్‌లో భద్రత కోసం 250 మిలియన్ డాలర్లు ఖర్చు చేయగా, 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో 1.5 బిలియన్‌ డాలర్లు ఖర్చు అయ్యింది. 2004 తర్వాత నిర్వహించిన ప్రతీ ఒలింపిక్స్‌లోనూ భద్రత కోసం ఖర్చు 1 బిలియన్ డాలర్‌ నుంచి 2 బిలియన్‌ డాలర్ల మధ్య ఖర్చు పెడుతున్నారు.

ఇక కొవిడ్ సమయంలో ఒలిపింక్స్ ఆతిథ్య హక్కులు పొందిన జపాన్ కేవలం కరోనా పరీక్షలు, క్వారంటైన్‌ల కోసమే 2.8 బిలియన్‌ డాలర్లను ఖర్చు పెట్టింది. ఈ క్రమంలో 2024 ఆతిథ్య హక్కులు పొందిన పారిస్ కూడా భద్రత కోసం భారీగా నిధులు కేటాయించింది. పారిస్‌లో భద్రత కోసం ఫ్రాన్స్‌ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది. టెర్రరిస్టుల ప్రత్యేక స్థావరాలను గుర్తించే సామర్థ్యం ఉన్న బెల్జియన్ మలినోయిస్ జాతి శునకాలను పారిస్​లో మోహరించారు. ఈ జాతి శునకాలు ఏదైనా అనుమానాస్పద ఉనికిని చాలా వేగంగా గుర్తిస్తాయి.

విధుల్లో స్పెషల్ డాగ్​స్క్వాడ్
విధుల్లో స్పెషల్ డాగ్​స్క్వాడ్ (Source: Associated Press)

రోజుకు 35 వేలమందితో
పారిస్‌లో రోజుకు 30,000 మంది పోలీసు అధికారులతో భద్రత కల్పిస్తున్నారు. జూలై 26 నుంచి ఆగస్టు 11 మధ్య రోజూ దాదాపు 30,000 మంది పోలీసు అధికారులను మోహరిస్తోంది. సీన్ నదిలో ప్రారంభమయ్యే వేడుకల కోసం 45,000 మందితో భద్రత కల్పిస్తున్నారు. రోజూ కనీసం 35,000 నుంచి 45,000 మంది భద్రత సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు .

పారిస్‌ భద్రతలో భారత్‌ మార్క్‌
పారిస్‌ భద్రతలో భారత్‌కు చెందిన K9 విభాగంలో 10 జాతి శునకాలు ఉన్నాయి. ఇందులో ఆరు బెల్జియన్ షెపర్డ్‌లు, మూడు జర్మన్ షెపర్డ్‌లు, ఒక లాబ్రడార్ రిట్రీవర్ జాతి శునకాలు ఉన్నాయి. ఒలింపిక్స్ నిర్వహించే సమయంలో ఇవి పెట్రోలింగ్ చేస్తాయి.పారిస్‌కు బయలుదేరే ముందు ఈ శునకాలకు 10 వారాలపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు
వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు (Source: Associated Press)

భారత్ నుంచి
ఈసారి భారత్‌ నుంచి ఒలింపిక్స్ కోసం 117 మంది అథ్లెట్లతో పాటు 140 మంది సహాయక సిబ్బంది యూరప్‌కు వెళ్లనున్నారు. భారత అథ్లెట్లలో 70 మంది పురుషులు, 47 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. అథ్లెటిక్స్‌లో 29 మంది క్రీడాకారులు ఒలింపిక్స్‌కు ఎంపికయ్యారు. తర్వాత షూటింగ్‌లో 21మంది భారత ఆటగాళ్లు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

ఆర్చరీలో ఈసారి భారత్ బోణీ పక్కా!- ఒలింపిక్స్​లో స్టార్ అథ్లెట్లు - Paris Olympics 2024

ఒలింపిక్స్‌లో భారత్ పతకాల పర్వం - ఇప్పటివరకు ఎన్ని గెలిచిందంటే? - Paris Olympics 2024

2024 Paris Olympics Security: పారిస్ ఒలింపిక్స్ 2024 విశ్వ క్రీడల సంరంభానికి సమయం దగ్గరపడుతోంది. ముచ్చటగా మూడోసారి ఒలింపిక్స్‌కు అతిథ్యం ఇస్తున్న పారిస్‌, విశ్వ క్రీడలను ఘనంగా నిర్వహించాలని పట్టుదలగా ఉంది. ఈ విశ్వక్రీడల్లో పాల్గొనేందుకు 180+ దేశాల నుంచి అథ్లెట్లు పారిస్​కు రానున్నారు. ఇక వివిధ దేశాల ప్రముఖులు, సెలబ్రిటీలు ప్రత్యక్షంగా ఒలింపిక్స్ క్రీడలు​ వీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో విశ్వక్రీడల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఫ్రాన్స్‌ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. భద్రత కోసం ఫ్రాన్స్ ఇప్పటికే, భారత ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఒలింపిక్స్‌ భద్రత కోసం భారత ప్రభుత్వం సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కే- 9 జాతి శునకాలను పారిస్‌కు పంపింది. ఈ శునకాలు ఇప్పటికే పారిస్‌లో భద్రతా విధుల్లో పాల్గొంటున్నాయి.

పటిష్ఠ భద్రత
ఒలింపిక్స్ క్రీడలను ప్రశాతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ఆతిథ్య దేశాలు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. 2000లో సిడ్నీ ఒలింపిక్స్‌లో భద్రత కోసం 250 మిలియన్ డాలర్లు ఖర్చు చేయగా, 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో 1.5 బిలియన్‌ డాలర్లు ఖర్చు అయ్యింది. 2004 తర్వాత నిర్వహించిన ప్రతీ ఒలింపిక్స్‌లోనూ భద్రత కోసం ఖర్చు 1 బిలియన్ డాలర్‌ నుంచి 2 బిలియన్‌ డాలర్ల మధ్య ఖర్చు పెడుతున్నారు.

ఇక కొవిడ్ సమయంలో ఒలిపింక్స్ ఆతిథ్య హక్కులు పొందిన జపాన్ కేవలం కరోనా పరీక్షలు, క్వారంటైన్‌ల కోసమే 2.8 బిలియన్‌ డాలర్లను ఖర్చు పెట్టింది. ఈ క్రమంలో 2024 ఆతిథ్య హక్కులు పొందిన పారిస్ కూడా భద్రత కోసం భారీగా నిధులు కేటాయించింది. పారిస్‌లో భద్రత కోసం ఫ్రాన్స్‌ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది. టెర్రరిస్టుల ప్రత్యేక స్థావరాలను గుర్తించే సామర్థ్యం ఉన్న బెల్జియన్ మలినోయిస్ జాతి శునకాలను పారిస్​లో మోహరించారు. ఈ జాతి శునకాలు ఏదైనా అనుమానాస్పద ఉనికిని చాలా వేగంగా గుర్తిస్తాయి.

విధుల్లో స్పెషల్ డాగ్​స్క్వాడ్
విధుల్లో స్పెషల్ డాగ్​స్క్వాడ్ (Source: Associated Press)

రోజుకు 35 వేలమందితో
పారిస్‌లో రోజుకు 30,000 మంది పోలీసు అధికారులతో భద్రత కల్పిస్తున్నారు. జూలై 26 నుంచి ఆగస్టు 11 మధ్య రోజూ దాదాపు 30,000 మంది పోలీసు అధికారులను మోహరిస్తోంది. సీన్ నదిలో ప్రారంభమయ్యే వేడుకల కోసం 45,000 మందితో భద్రత కల్పిస్తున్నారు. రోజూ కనీసం 35,000 నుంచి 45,000 మంది భద్రత సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు .

పారిస్‌ భద్రతలో భారత్‌ మార్క్‌
పారిస్‌ భద్రతలో భారత్‌కు చెందిన K9 విభాగంలో 10 జాతి శునకాలు ఉన్నాయి. ఇందులో ఆరు బెల్జియన్ షెపర్డ్‌లు, మూడు జర్మన్ షెపర్డ్‌లు, ఒక లాబ్రడార్ రిట్రీవర్ జాతి శునకాలు ఉన్నాయి. ఒలింపిక్స్ నిర్వహించే సమయంలో ఇవి పెట్రోలింగ్ చేస్తాయి.పారిస్‌కు బయలుదేరే ముందు ఈ శునకాలకు 10 వారాలపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు
వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు (Source: Associated Press)

భారత్ నుంచి
ఈసారి భారత్‌ నుంచి ఒలింపిక్స్ కోసం 117 మంది అథ్లెట్లతో పాటు 140 మంది సహాయక సిబ్బంది యూరప్‌కు వెళ్లనున్నారు. భారత అథ్లెట్లలో 70 మంది పురుషులు, 47 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. అథ్లెటిక్స్‌లో 29 మంది క్రీడాకారులు ఒలింపిక్స్‌కు ఎంపికయ్యారు. తర్వాత షూటింగ్‌లో 21మంది భారత ఆటగాళ్లు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

ఆర్చరీలో ఈసారి భారత్ బోణీ పక్కా!- ఒలింపిక్స్​లో స్టార్ అథ్లెట్లు - Paris Olympics 2024

ఒలింపిక్స్‌లో భారత్ పతకాల పర్వం - ఇప్పటివరకు ఎన్ని గెలిచిందంటే? - Paris Olympics 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.