ETV Bharat / sports

ఫైనల్​కు మను బాకర్- బ్యాడ్మింటన్​లో లక్ష్య, సాత్విక్- చిరాగ్ అదుర్స్- భారత్ డే 1 హైలైట్స్ ఇవే! - Paris Olympics 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 10:57 PM IST

Paris Olympics 2024 Day 1 India: పారిస్ ఒలింపిక్స్​ 2024లో తొలిరోజు భారత్​కు మిశ్రమ ఫలితాలు నమోదయ్యయి. షూటింగ్​లో మనూ బాకర్ ఫైనల్​కు చేరగా, బ్యాడ్మింటన్​లో లక్ష్యసేన్​, సాత్విక్- చిరాగ్ గ్రూప్ స్టేజ్​ తొలి రౌండ్​లో విజయం సాధించారు.

Paris Olympics 2024
Paris Olympics 2024 (Source: Associated Press)

Paris Olympics 2024 Day 1 India: పారిస్ ఒలింపిక్స్​ 2024లో తొలిరోజు భారత్​కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. రైఫిల్ షూటింగ్ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లలో భారత్​కు పరాభవం ఎదురవ్వగా, సింగిల్స్ పిస్టల్​ క్వాలిఫికేషన్‌లో మను బాకర్ అదరగొట్టింది. 580.27 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఎయిర్‌ పిస్టల్‌ సింగిల్స్‌లో 20 ఏళ్ల తర్వాత ఫైనల్‌ చేరిన భారత షూటర్‌గా మను బాకర్ రికార్డు సృష్టించింది. 2004 ఒలింపిక్స్‌లో ఇదే విభాగంలో సుమా శిరూర్ ఫైనల్‌కు చేరింది. కాగా, మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్స్‌ జులై 28న మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతాయి.

మరోవైపు బ్యాడ్మింటన్​లో భారత అథ్లెట్లు హవా కొనసాగింది. పురుషుల సింగిల్స్, డబుల్స్ ఈవెంట్లలో మన షట్లర్లు సత్తా చాటారు. తొలుత సింగిల్స్​ గ్రూప్​ స్టేజ్​లో స్టార్ షట్లర్ లక్ష్యసేన్ దూకుడుగా ఆడి ప్రత్యర్థిని వరుస సెట్లలో మట్టికరిపించాడు. పోటీలో పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించిన లక్ష్యసేన్ 21-08తో తొలి సెట్​ సొంతం చేసుకున్నాడు. ఇక రెండో సెట్​లో ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైనా 22-20తేడాతో నెగ్గి రెండో రౌండ్​కు దూసుకెళ్లాడు.

కాగా, పురుషుల డబుల్స్​లో భారత ద్వయం సాత్విక్- చిరాగ్ శెట్టి రఫ్పాడించారు. ఫ్రెంచ్ జోడీ లుకస్- రోనమ్​ను ఢీకొట్టిన సాత్విక్- చిరాగ్ ద్వయం వరుస సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించారు. 21-17, 21-14 తేడాతో ఫ్రెంచ్ జోడీని మట్టికరిపించి, గ్రూప్ స్టేజ్ రెండో రౌండ్​కు చేరుకున్నారు. ఇక జులై 29న అటు సింగిల్ ఈవెంట్లో లక్ష్యసేన్, డబుల్స్​లో సాత్విక్- చిరాగ్ రెండో రౌండ్​ ఆడనున్నారు. ఇక టేబుల్ టెన్నిస్​లో హర్మీత్ హర్మీత్ దేశాయ్ విజయం సాధించాడు. ప్రిలిమినరీ రౌండ్​లో ప్రత్యర్థి జోర్డాన్​పై 4-0 తేడాతో నెగ్గాడు.

షూటింగ్ విభాగంలో పలు ఈవెంట్లలో భారత్​కు నిరాశ ఎదురైంది. షూటర్‌ రిథమ్‌ సంగ్వాన్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ల 15వ స్థానంతో సరిపెట్టుకుంది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో రమిత-అర్జున్‌ బబుతా జోడీ 628.7 స్కోర్‌తో ఆరో స్థానంతో సరిపెట్టుకోగా, వలరివన్‌- సందీప్‌ సింగ్ 626.3 పాయింట్లతో 12వ స్థానానికి పరిమితమైంది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ పురుషుల విభాగంలో సరబ్‌జోత్‌ 9వ, అర్జున్‌ చీమా 18వ స్థానానికి పరిమితమయ్యారు.

క్వాలిఫయర్స్​లో మనూ బాకర్ అదుర్స్- ఫైనల్​కు దూసుకెళ్లిన షూటర్ - Paris Olympics 2024

పారిస్ ఒలింపిక్స్​లో బిల్​గేట్స్ అల్లుడు, బీజేపీ మహిళా ఎమ్మెల్యే- ఏ మెడల్ సాధిస్తారో! - Paris Olympics 2024

Paris Olympics 2024 Day 1 India: పారిస్ ఒలింపిక్స్​ 2024లో తొలిరోజు భారత్​కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. రైఫిల్ షూటింగ్ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లలో భారత్​కు పరాభవం ఎదురవ్వగా, సింగిల్స్ పిస్టల్​ క్వాలిఫికేషన్‌లో మను బాకర్ అదరగొట్టింది. 580.27 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఎయిర్‌ పిస్టల్‌ సింగిల్స్‌లో 20 ఏళ్ల తర్వాత ఫైనల్‌ చేరిన భారత షూటర్‌గా మను బాకర్ రికార్డు సృష్టించింది. 2004 ఒలింపిక్స్‌లో ఇదే విభాగంలో సుమా శిరూర్ ఫైనల్‌కు చేరింది. కాగా, మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్స్‌ జులై 28న మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతాయి.

మరోవైపు బ్యాడ్మింటన్​లో భారత అథ్లెట్లు హవా కొనసాగింది. పురుషుల సింగిల్స్, డబుల్స్ ఈవెంట్లలో మన షట్లర్లు సత్తా చాటారు. తొలుత సింగిల్స్​ గ్రూప్​ స్టేజ్​లో స్టార్ షట్లర్ లక్ష్యసేన్ దూకుడుగా ఆడి ప్రత్యర్థిని వరుస సెట్లలో మట్టికరిపించాడు. పోటీలో పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించిన లక్ష్యసేన్ 21-08తో తొలి సెట్​ సొంతం చేసుకున్నాడు. ఇక రెండో సెట్​లో ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైనా 22-20తేడాతో నెగ్గి రెండో రౌండ్​కు దూసుకెళ్లాడు.

కాగా, పురుషుల డబుల్స్​లో భారత ద్వయం సాత్విక్- చిరాగ్ శెట్టి రఫ్పాడించారు. ఫ్రెంచ్ జోడీ లుకస్- రోనమ్​ను ఢీకొట్టిన సాత్విక్- చిరాగ్ ద్వయం వరుస సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించారు. 21-17, 21-14 తేడాతో ఫ్రెంచ్ జోడీని మట్టికరిపించి, గ్రూప్ స్టేజ్ రెండో రౌండ్​కు చేరుకున్నారు. ఇక జులై 29న అటు సింగిల్ ఈవెంట్లో లక్ష్యసేన్, డబుల్స్​లో సాత్విక్- చిరాగ్ రెండో రౌండ్​ ఆడనున్నారు. ఇక టేబుల్ టెన్నిస్​లో హర్మీత్ హర్మీత్ దేశాయ్ విజయం సాధించాడు. ప్రిలిమినరీ రౌండ్​లో ప్రత్యర్థి జోర్డాన్​పై 4-0 తేడాతో నెగ్గాడు.

షూటింగ్ విభాగంలో పలు ఈవెంట్లలో భారత్​కు నిరాశ ఎదురైంది. షూటర్‌ రిథమ్‌ సంగ్వాన్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ల 15వ స్థానంతో సరిపెట్టుకుంది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో రమిత-అర్జున్‌ బబుతా జోడీ 628.7 స్కోర్‌తో ఆరో స్థానంతో సరిపెట్టుకోగా, వలరివన్‌- సందీప్‌ సింగ్ 626.3 పాయింట్లతో 12వ స్థానానికి పరిమితమైంది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ పురుషుల విభాగంలో సరబ్‌జోత్‌ 9వ, అర్జున్‌ చీమా 18వ స్థానానికి పరిమితమయ్యారు.

క్వాలిఫయర్స్​లో మనూ బాకర్ అదుర్స్- ఫైనల్​కు దూసుకెళ్లిన షూటర్ - Paris Olympics 2024

పారిస్ ఒలింపిక్స్​లో బిల్​గేట్స్ అల్లుడు, బీజేపీ మహిళా ఎమ్మెల్యే- ఏ మెడల్ సాధిస్తారో! - Paris Olympics 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.