ETV Bharat / sports

వినేశ్ ఫొగాట్‌ వ్యవహారం - ప్రపంచ రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ కీలక నిర్ణయం! - Vinesh Phogat Disqualification

author img

By ETV Bharat Sports Team

Published : Aug 12, 2024, 6:54 PM IST

Paris olympics 2024 vinesh Phogat : రెజ్లర్ల బరువు కొలిచే నియమ నిబంధనల్లో మార్పులు చేయబోతున్నారని సమాచారం అందింది. ప్రస్తుతం ఈ విషయమై ప్రపంచ రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ యోచిస్తున్నట్లు తెలిసింది.

source Associated Press
Paris olympics 2024 vinesh Phogat (source Associated Press)

Paris olympics 2024 vinesh Phogat : పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేయడం తీవ్ర వివాదస్పదమైన సంగతి తెలిసిందే. తుది పోరుకు చేరిన తర్వాత 100 గ్రాముల అదనపు బరువు ఉందన్న కారణంతో ఆమెపై అనర్హత వేటు శారు. అయితే ఈ నిర్ణయాన్ని క్రీడాభిమానులతో పాటు ఇతర దేశాల రెజ్లర్లు కూడా వ్యతిరేకించారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

ఈ క్రమంలో ప్రపంచ రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఇక నుంచి రెజ్లర్ల బరువు కొలిచే రూల్స్​లో(wrestling weight rules) మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం అందింది. అయితే, ఈ మార్పులు పూర్తి స్థాయిలో చేయకుండా కొన్ని స్వల్ప మార్పులు చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అథ్లెట్ల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే వీటి గురించి అధికారికంగా ప్రకటిస్తారట.

కాగా, 50 కేజీల విభాగంలో పోటీ పడి 100 గ్రాముల అదనపు బరువుతో అనర్హతకు గురైంది వినేశ్ ఫొగాట్. దీంతో ఆటకు రిటైర్మెంట్​ ప్రకటించిన ఆమె ప్రస్తుతం న్యాయ పోరాటం చేస్తోంది. ఈ అనర్హత వేటును సవాలు చేస్తూ కోర్టు ఆఫ్‌ ఆర్బిట్రేషన్ ఫర్‌ స్పోర్ట్స్‌(CAS)ను ఆశ్రయించింది వినేశ్​. తనకు రజత పతకం ఇవ్వాలని అప్పీలులో కోరింది. ఆమె అప్పీల్​ను విచారణకు స్వీకరించిన కాస్‌ ఆగస్టు 13న సాయంత్రం ఆరు గంటల్లోగా తుది తీర్పును ఇవ్వనుంది. దీంతో పారిస్‌ ఒలింపిక్స్​లో రెజ్లింగ్‌లో వినేశ్‌ ఫొగాట్‌కు పతకం వస్తుందా లేదా అంశంపై ఇంకా ఉత్కంఠత కొనసాగుతూనే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Paris olympics 2024 vinesh Phogat : పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేయడం తీవ్ర వివాదస్పదమైన సంగతి తెలిసిందే. తుది పోరుకు చేరిన తర్వాత 100 గ్రాముల అదనపు బరువు ఉందన్న కారణంతో ఆమెపై అనర్హత వేటు శారు. అయితే ఈ నిర్ణయాన్ని క్రీడాభిమానులతో పాటు ఇతర దేశాల రెజ్లర్లు కూడా వ్యతిరేకించారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

ఈ క్రమంలో ప్రపంచ రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఇక నుంచి రెజ్లర్ల బరువు కొలిచే రూల్స్​లో(wrestling weight rules) మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం అందింది. అయితే, ఈ మార్పులు పూర్తి స్థాయిలో చేయకుండా కొన్ని స్వల్ప మార్పులు చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అథ్లెట్ల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే వీటి గురించి అధికారికంగా ప్రకటిస్తారట.

కాగా, 50 కేజీల విభాగంలో పోటీ పడి 100 గ్రాముల అదనపు బరువుతో అనర్హతకు గురైంది వినేశ్ ఫొగాట్. దీంతో ఆటకు రిటైర్మెంట్​ ప్రకటించిన ఆమె ప్రస్తుతం న్యాయ పోరాటం చేస్తోంది. ఈ అనర్హత వేటును సవాలు చేస్తూ కోర్టు ఆఫ్‌ ఆర్బిట్రేషన్ ఫర్‌ స్పోర్ట్స్‌(CAS)ను ఆశ్రయించింది వినేశ్​. తనకు రజత పతకం ఇవ్వాలని అప్పీలులో కోరింది. ఆమె అప్పీల్​ను విచారణకు స్వీకరించిన కాస్‌ ఆగస్టు 13న సాయంత్రం ఆరు గంటల్లోగా తుది తీర్పును ఇవ్వనుంది. దీంతో పారిస్‌ ఒలింపిక్స్​లో రెజ్లింగ్‌లో వినేశ్‌ ఫొగాట్‌కు పతకం వస్తుందా లేదా అంశంపై ఇంకా ఉత్కంఠత కొనసాగుతూనే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

త్రుటిలో పతకం మిస్ - వినేశ్​ సహా ఒలింపిక్స్​లో డిస్​క్వాలిఫై అయిన భారత ప్లేయర్స్ ఎవరంటే? - Paris Olympics Disqualifed Players

'కుస్తీ గెలిచింది, నేను ఓడాను' - రిటైర్మెంట్ ప్రకటించిన వినేశ్​ - Vinesh Phogat Retirement

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.