ETV Bharat / sports

క్రికెట్ లవర్స్​కు గుడ్​న్యూస్- థియేటర్లలో T20 వరల్డ్​కప్​ మ్యాచ్​లు! - 2024 T20 World Cup

T20 World Cup Matches Screening: యావత్ క్రికెట్ ప్రపంచం టీ20 వరల్డ్​కప్​ కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ సినిమా కంపెనీ 'పీవీఆర్ సినిమాస్' వరల్డ్​కప్​లోని కీలక మ్యాచ్​లను తమ థియేటర్లలో లైవ్ స్ట్రీనింగ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది.

author img

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 12:31 PM IST

Updated : May 15, 2024, 2:05 PM IST

World Cup Matches Screening
World Cup Matches Screening (Source: ETV Bharat)

T20 World Cup Matches Screening: 2024 టీ20 వరల్డ్​కప్​ మజా మూడు వారాల్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఐసీసీ టోర్నీ ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ కోసం యావత్ క్రీడా ప్రపంచం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో భారత అతిపెద్ద సినిమా ఆపరేటర్ కంపెనీ 'పీవీఆర్ సినిమాస్' (PVR Cinemas) క్రికెట్ ఫ్యాన్స్​కు కొత్త అనుభూతినిచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

ప్రపంచకప్ టోర్నీలో పలు కీలక మ్యాచ్​లు సిల్వర్ స్క్రీన్​పై లైవ్ స్ట్రీమింగ్ చేయాలని భావిస్తోంది. దీనిపై పీవీఆర్ సినిమాస్ యాజమాన్యం ఐసీసీతో చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ నితిన్ సూద్ ఓ సందర్భంలో చెప్పారు. 'ప్రేక్షకులకు ఎల్లప్పుడు దగ్గరగా ఉండాలన్నదే మా లక్ష్యం. గతేడాది భారత్​లో జరిగిన వన్డే వరల్డ్​కప్​నకు భారీగా ప్రేక్షకుల మద్దతు లభించింది. ఇప్పుడు జరగనున్న టీ20 టోర్నీ, వన్డే ఫార్మాట్​ కంటే తక్కువ సమయంలో ముగుస్తుంది. దీంతో గతేడాది వన్డే ప్రపంచకప్​తో పోలిస్తే, టీ20 మ్యాచ్​లకు ఎక్కువ ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నాం. టీ20 మ్యాచ్​ను బిగ్​ స్క్రీన్​పై చూసేందుకు కచ్చితంగా భారీ సంఖ్యలో ఆడియెన్స్ వస్తారు' అని నితిన్ అభిప్రాయపడ్డారు.

అయితే భారత్​లో ప్రస్తుతం లోక్​సభ ఎన్నికలు, ఐపీఎల్​ టోర్నీ జరుగుతున్న కారణంగా పెద్ద సినిమాల రిలీజ్​లు ఆగిపోయాయి. పలు ఇండస్ట్రీల భారీ బడ్జెట్ సినిమాలన్నీ జూన్​ తర్వాతే విడుదల కానున్నాయి. దీంతో వేసవి సెలవులు ఉన్నప్పటికీ ఇండియన్ బాక్సాఫీస్ కాస్త నెమ్మదించింది. థియేటర్లకు వెళ్లేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అందుకే వరల్డ్​కప్ మ్యాచ్​ల ప్రదర్శనతో ఆడియెన్స్​ను మళ్లీ థియేటర్లకు రప్పించాలని ఇలా ప్లాన్ చేస్తున్నారు.

ఇక జూన్ 2 నుంచి 29 వరకు ఈ టోర్నీ జరగనుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి టోర్నీలో 20 దేశాలు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించి మ్యాచ్​లు నిర్వహించనున్నారు. టీమ్ఇండియా స్టార్లు ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఇదే చివరి వరల్డ్​కప్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో టోర్నీకి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ జూన్ 5న ఐర్లాండ్​తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక 9న పాకిస్థాన్​తో తలపడనుంది.

రెండో సెమీస్​కు రిజర్వ్​ డేను తొలిగించిన ఐసీసీ - T20 world cup 2024

హెడ్​కోచ్ రేస్​లో లక్ష్మణ్, లాంగర్?- ఉండాల్సిన ఆ అర్హతలివే! - Team India New Head Coach

T20 World Cup Matches Screening: 2024 టీ20 వరల్డ్​కప్​ మజా మూడు వారాల్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఐసీసీ టోర్నీ ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ కోసం యావత్ క్రీడా ప్రపంచం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో భారత అతిపెద్ద సినిమా ఆపరేటర్ కంపెనీ 'పీవీఆర్ సినిమాస్' (PVR Cinemas) క్రికెట్ ఫ్యాన్స్​కు కొత్త అనుభూతినిచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

ప్రపంచకప్ టోర్నీలో పలు కీలక మ్యాచ్​లు సిల్వర్ స్క్రీన్​పై లైవ్ స్ట్రీమింగ్ చేయాలని భావిస్తోంది. దీనిపై పీవీఆర్ సినిమాస్ యాజమాన్యం ఐసీసీతో చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ నితిన్ సూద్ ఓ సందర్భంలో చెప్పారు. 'ప్రేక్షకులకు ఎల్లప్పుడు దగ్గరగా ఉండాలన్నదే మా లక్ష్యం. గతేడాది భారత్​లో జరిగిన వన్డే వరల్డ్​కప్​నకు భారీగా ప్రేక్షకుల మద్దతు లభించింది. ఇప్పుడు జరగనున్న టీ20 టోర్నీ, వన్డే ఫార్మాట్​ కంటే తక్కువ సమయంలో ముగుస్తుంది. దీంతో గతేడాది వన్డే ప్రపంచకప్​తో పోలిస్తే, టీ20 మ్యాచ్​లకు ఎక్కువ ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నాం. టీ20 మ్యాచ్​ను బిగ్​ స్క్రీన్​పై చూసేందుకు కచ్చితంగా భారీ సంఖ్యలో ఆడియెన్స్ వస్తారు' అని నితిన్ అభిప్రాయపడ్డారు.

అయితే భారత్​లో ప్రస్తుతం లోక్​సభ ఎన్నికలు, ఐపీఎల్​ టోర్నీ జరుగుతున్న కారణంగా పెద్ద సినిమాల రిలీజ్​లు ఆగిపోయాయి. పలు ఇండస్ట్రీల భారీ బడ్జెట్ సినిమాలన్నీ జూన్​ తర్వాతే విడుదల కానున్నాయి. దీంతో వేసవి సెలవులు ఉన్నప్పటికీ ఇండియన్ బాక్సాఫీస్ కాస్త నెమ్మదించింది. థియేటర్లకు వెళ్లేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అందుకే వరల్డ్​కప్ మ్యాచ్​ల ప్రదర్శనతో ఆడియెన్స్​ను మళ్లీ థియేటర్లకు రప్పించాలని ఇలా ప్లాన్ చేస్తున్నారు.

ఇక జూన్ 2 నుంచి 29 వరకు ఈ టోర్నీ జరగనుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి టోర్నీలో 20 దేశాలు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించి మ్యాచ్​లు నిర్వహించనున్నారు. టీమ్ఇండియా స్టార్లు ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఇదే చివరి వరల్డ్​కప్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో టోర్నీకి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ జూన్ 5న ఐర్లాండ్​తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక 9న పాకిస్థాన్​తో తలపడనుంది.

రెండో సెమీస్​కు రిజర్వ్​ డేను తొలిగించిన ఐసీసీ - T20 world cup 2024

హెడ్​కోచ్ రేస్​లో లక్ష్మణ్, లాంగర్?- ఉండాల్సిన ఆ అర్హతలివే! - Team India New Head Coach

Last Updated : May 15, 2024, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.