ETV Bharat / sports

ఈ 5 యంగ్ ప్లేయర్స్​కు భలే ఛాన్స్​ - టీమ్​ ఇండియాలో స్థిరపడతారా?

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్​ కోసం ఎంపికైన ఈ యంగ్​ ప్లేయర్స్​లో తమదైన ముద్ర వేసి భారత జట్టులో స్థిరపడే వారు ఎవరో?

Young cricketers In TeamIndia
Young cricketers In TeamIndia (source IANS and ANI)
author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

IND VS AUS, SA Series Young cricketers In TeamIndia : జట్టును ముందుండి నడిపించిన స్టార్ ప్లేయర్స్​, ఎన్నో రికార్డులను, విజయాలను అందించిన మేటి ఆటగాళ్లు, ఆట నుంచి నిష్క్రమించాల్సిన సమయం వస్తే అప్పుడా జట్టు కాస్త ఇబ్బంది పడడం సహజం! గతంలో దిగ్గజాలు ఒక్కొక్కరుగా నిష్క్రమించినప్పుడు భారత జట్టు కొంత కాలం అలానే తడబడింది. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి కనపడుతోంది. ఇప్పటికే టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ టెస్టులు, వన్డేల్లోనూ ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని అర్థమవుతోంది! జడేజా, అశ్విన్‌ లాంటి సీనియర్లు కూడా చరమాంక దశలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీమ్ మేనేజ్​మెంట్​, సెలక్టర్లు యంగ్ ప్లేయర్స్​పై దృష్టి సారించారు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ కోసం యంగ్ ప్లేయర్స్​కు అవకాశం ఇచ్చారు. మరి వీరిలో తమదైన ముద్ర వేసి భారత జట్టులో ఎవరు స్థిరపడతారో.

పేస్‌ ఆల్‌రౌండర్‌గా నితీశ్ కుమార్ (Nitish Kumar vs Australia)

ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున బరిలోకి దిగిన నితీశ్ కుమార్ 303 పరుగులు, 3 వికెట్లతో అదరగొట్టి, రీసెంట్​గానే టీమ్‌ఇండియా టీ20 జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఇప్పుడేమో టెస్టు జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు.

బంగ్లాదేశ్‌పై తన అరంగేట్ర సిరీస్‌లోనే ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో 90 పరుగులు, 3 వికెట్లతో మెప్పించాడు 21 ఏళ్ల ఈ విశాఖ కుర్రాడు. హార్దిక్‌ పాండ్య సహా ఇతర పేస్‌ ఆల్‌రౌండర్లు తరచూ గాయాలు పడుతుండటంతో భవిష్యత్‌ ప్రత్యామ్నాయంగా మారాడు. ఆస్ట్రేలియా టూర్​ కోసం సెలక్ట్ చేసిన 18 మంది ప్లేయర్ల భారత జట్టులో నితీశ్‌ ఒక్కడే పేస్‌ ఆల్‌రౌండర్‌.

కాబట్టి ఈ ఆస్ట్రేలియా సిరీస్‌లో నితీశ్​కు ఆడే ఛాన్స్ వస్తే ఆస్ట్రేలియా పిచ్‌లపై అతడు కీలకంగా మారే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా-ఎతో సిరీస్‌ కోసం కూడా భారత్‌-ఎ తరపున ఆసీస్​ గడ్డపై అడుగుపెట్టాడు. అక్టోబర్ 31 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్​లో అక్కడి పిచ్​ పరిస్థితులపై నితీశ్​కు అవగాహన వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు అతడు కెరీర్​లో 21 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్​లు ఆడాడు. 708 పరుగులు చేసి 55 వికెట్లు పడగొట్టాడు.

అభిమన్యు ఈశ్వరన్‌ ఎంట్రీ (Abhimanyu Eeswaran vs australia)

ఈ పేరు గత కొంత కాలంగా భారత క్రికెట్​లో ఎక్కువగానే వినిపిస్తోంది. దేశవాళీల్లో నిలకడగా రాణిస్తూ ఆకట్టుకుంటున్నాడు. 2022 బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ కోసం అతణ్ని తీసుకున్నా తుదిజట్టులో చోటు దక్కలేదు.

ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్‌ కోసం ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుల్లో ఓ మ్యాచ్​కు వ్యక్తిగత కారణాలతో రోహిత్‌ దూరమవుతాడని అంటున్నారు. ఆ మ్యాచ్‌లోనే అభిమన్యు ఓపెనర్​గా బరిలోనే దిగుతాడని అంటున్నారు.

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్లో ఫుల్ ఎక్స్​పీరియన్స్​ ఉన్న ఈ బంగాల్‌ ప్లేయర్​ 99 మ్యాచ్‌ల్లో 49.92 యావరేజ్​తో 7638 పరుగులు చేశాడు. గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ శతకాలు బాదాడు. దులీప్‌ ట్రోఫీలో రెండు శతకాలు, ఇరానీ కప్‌లో 191 పరుగుల ఇన్నింగ్స్, ఉత్తరప్రదేశ్‌తో రంజీ మ్యాచ్‌లో సెంచరీ కొట్టాడు.

140 కిలోమీటర్ల వేగంతో హర్షిత్ రాణా (Harshit rana vs australia)

22 ఏళ్ల దిల్లీ కుర్రాడు హర్షిత్ రాణాది పశ్చిమ దిల్లీ. సెహ్వాగ్, నెహ్రా, ఇషాంత్, గంభీర్, కోహ్లీ లాంటి ఆటగాళ్లు ఇక్కడ నుంచే వచ్చారు. హర్షిత్ రాణా పదునైన వేగంతో బంతులు విసిరి వికెట్లు పడగొట్టగలడు. కీలక సమయాల్లో జట్టుకు విజయాలు అందిస్తుంటాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 20.15 యావరేజ్​తో 19 వికెట్లు తీశాడు.

దేశవాళీల్లో దిల్లీ జట్టు తరపున 9 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో 36 వికెట్లు తీశాడు హర్షిత్. ఓ సెంచరీతో పాటు 410 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో అదిరే ప్రదర్శన చేసి శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్‌తో సిరీస్‌లకు ఎంపికయ్యాడు. కానీ అతడికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు.

ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు కూడా సెలెక్ట్ అయ్యాడు. మరి 6.2 అడుగుల ఎత్తు ఉండే హర్షిత్‌ తుది జట్టులోకి ఎంపిక అయితే, ఇతడి 140 కిలోమీటర్ల వేగంతో విసిరే బౌన్సర్లను బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో.

అలాగే పిచ్‌ పరిస్థితులకు అనుగుణంగా వేగాన్ని తగ్గించి, వైవిధ్యంతోనూ అతడు బ్యాటర్లను బోల్తా కొట్టించగలగే సత్తా ఉంది.

పవర్‌ హిట్టర్‌ రమణ్‌దీప్‌ సింగ్‌ (RamanDeep Singh VS South Africa)

27 ఏళ్ల పంజాబ్‌ పేస్‌ ఆల్‌రౌండర్‌ రమణ్‌దీప్‌ సింగ్‌ అలవోకగా భారీ షాట్లు ఆడుతాడు. రీసెంట్​గానే వర్థమాన జట్ల ఆసియా కప్‌లో సెమీస్‌లో అఫ్గానిస్థాన్​పై 34 బంతుల్లోనే 64 పరుగులు సాధించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేయర్​గా బరిలోకి దిగి 9 ఇన్నింగ్స్‌ల్లో 125 పరుగులు చేశాడు. అది కూడా 200కుపైగా స్ట్రైక్‌రేట్​తో. ఫీల్డింగ్‌లో చురుగ్గా కదలుతాడు. పేసర్‌గానూ రాణిస్తున్నాడు రమణ్​దీప్​.

ఇప్పటివరకూ దేశవాళీల్లో 37 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 170 స్ట్రైక్‌రేట్‌తో 544 పరుగులు చేశాడు రమణ్​దీప్​. 16 వికెట్లు కూడా తీశాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ ఇలా మూడు విభాగాల్లోనూ రాణించడం వల్ల ఇతడిని దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సెలక్ట్ చేశారు. భారత జట్టులో బౌలింగ్‌ కూడా చేయగల బ్యాటర్ల సంఖ్యను పెంచే దిశగా ఇతడిని ఎంపిక చేశారని తెలుస్తోంది.

బరువు తగ్గి వేగం పెంచిన వైశాఖ్​ జయ్​కుమార్ (Vijaykumar Vyshak vs Southafrica)

ఒకప్పుడు అధిక బరువుతో, ఫిట్‌నెస్‌ లేక, బౌలింగ్‌లో వేగం లేక కష్టాలు పడిన వైశాఖ్‌ జయ్‌కుమార్‌ ఇప్పుడు టీమ్‌ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫిట్‌గా మారి చోటు సంపాదించుకున్నాడు.

ఇతడిది కర్ణాటక. 27 ఏళ్ల వయసు. అయితే ఈ పేసర్‌ 5 ఏళ్ల క్రితం అధిక బరువుతో బాగా ఇబ్బండి పడ్డాడు. కానీ వెనకడుగు వేయలేదు. ఫిట్‌నెస్​తో పాటు బౌలింగ్‌లోనూ వేగాన్ని పెంచుకున్నాడు.

కర్ణాటక తరపున దేశవాళీ క్రికెట్​లో నిలకడగా రాణించడంతో పాటు, ఐపీఎల్‌లో ఆర్సీబీకి ఆడుతూ ఆకర్షించాడు. 25 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 24.11 యావరేజ్​తో 99 వికెట్లు తీశాడు. 21 లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో 34 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో బెంగళూరు తరఫున 11 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. అలా ఇప్పుడు సౌతాఫ్రికాతో టీ20 సిరీస్​కు ఎంపికయ్యాడు.

కివీస్​తో సిరీస్ ఓటమి- భారత్​ WTC ఫైనల్​ ఛాన్స్​లు ఎలా ఉన్నాయంటే?

సీనియర్లపై గంభీర్ స్ట్రిక్ట్​ యాక్షన్​ - 'ఇకపై ప్రాక్టీస్​కు వారు కూడా రావాల్సిందే'

IND VS AUS, SA Series Young cricketers In TeamIndia : జట్టును ముందుండి నడిపించిన స్టార్ ప్లేయర్స్​, ఎన్నో రికార్డులను, విజయాలను అందించిన మేటి ఆటగాళ్లు, ఆట నుంచి నిష్క్రమించాల్సిన సమయం వస్తే అప్పుడా జట్టు కాస్త ఇబ్బంది పడడం సహజం! గతంలో దిగ్గజాలు ఒక్కొక్కరుగా నిష్క్రమించినప్పుడు భారత జట్టు కొంత కాలం అలానే తడబడింది. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి కనపడుతోంది. ఇప్పటికే టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ టెస్టులు, వన్డేల్లోనూ ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని అర్థమవుతోంది! జడేజా, అశ్విన్‌ లాంటి సీనియర్లు కూడా చరమాంక దశలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీమ్ మేనేజ్​మెంట్​, సెలక్టర్లు యంగ్ ప్లేయర్స్​పై దృష్టి సారించారు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ కోసం యంగ్ ప్లేయర్స్​కు అవకాశం ఇచ్చారు. మరి వీరిలో తమదైన ముద్ర వేసి భారత జట్టులో ఎవరు స్థిరపడతారో.

పేస్‌ ఆల్‌రౌండర్‌గా నితీశ్ కుమార్ (Nitish Kumar vs Australia)

ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున బరిలోకి దిగిన నితీశ్ కుమార్ 303 పరుగులు, 3 వికెట్లతో అదరగొట్టి, రీసెంట్​గానే టీమ్‌ఇండియా టీ20 జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఇప్పుడేమో టెస్టు జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు.

బంగ్లాదేశ్‌పై తన అరంగేట్ర సిరీస్‌లోనే ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో 90 పరుగులు, 3 వికెట్లతో మెప్పించాడు 21 ఏళ్ల ఈ విశాఖ కుర్రాడు. హార్దిక్‌ పాండ్య సహా ఇతర పేస్‌ ఆల్‌రౌండర్లు తరచూ గాయాలు పడుతుండటంతో భవిష్యత్‌ ప్రత్యామ్నాయంగా మారాడు. ఆస్ట్రేలియా టూర్​ కోసం సెలక్ట్ చేసిన 18 మంది ప్లేయర్ల భారత జట్టులో నితీశ్‌ ఒక్కడే పేస్‌ ఆల్‌రౌండర్‌.

కాబట్టి ఈ ఆస్ట్రేలియా సిరీస్‌లో నితీశ్​కు ఆడే ఛాన్స్ వస్తే ఆస్ట్రేలియా పిచ్‌లపై అతడు కీలకంగా మారే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా-ఎతో సిరీస్‌ కోసం కూడా భారత్‌-ఎ తరపున ఆసీస్​ గడ్డపై అడుగుపెట్టాడు. అక్టోబర్ 31 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్​లో అక్కడి పిచ్​ పరిస్థితులపై నితీశ్​కు అవగాహన వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు అతడు కెరీర్​లో 21 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్​లు ఆడాడు. 708 పరుగులు చేసి 55 వికెట్లు పడగొట్టాడు.

అభిమన్యు ఈశ్వరన్‌ ఎంట్రీ (Abhimanyu Eeswaran vs australia)

ఈ పేరు గత కొంత కాలంగా భారత క్రికెట్​లో ఎక్కువగానే వినిపిస్తోంది. దేశవాళీల్లో నిలకడగా రాణిస్తూ ఆకట్టుకుంటున్నాడు. 2022 బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ కోసం అతణ్ని తీసుకున్నా తుదిజట్టులో చోటు దక్కలేదు.

ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్‌ కోసం ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుల్లో ఓ మ్యాచ్​కు వ్యక్తిగత కారణాలతో రోహిత్‌ దూరమవుతాడని అంటున్నారు. ఆ మ్యాచ్‌లోనే అభిమన్యు ఓపెనర్​గా బరిలోనే దిగుతాడని అంటున్నారు.

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్లో ఫుల్ ఎక్స్​పీరియన్స్​ ఉన్న ఈ బంగాల్‌ ప్లేయర్​ 99 మ్యాచ్‌ల్లో 49.92 యావరేజ్​తో 7638 పరుగులు చేశాడు. గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ శతకాలు బాదాడు. దులీప్‌ ట్రోఫీలో రెండు శతకాలు, ఇరానీ కప్‌లో 191 పరుగుల ఇన్నింగ్స్, ఉత్తరప్రదేశ్‌తో రంజీ మ్యాచ్‌లో సెంచరీ కొట్టాడు.

140 కిలోమీటర్ల వేగంతో హర్షిత్ రాణా (Harshit rana vs australia)

22 ఏళ్ల దిల్లీ కుర్రాడు హర్షిత్ రాణాది పశ్చిమ దిల్లీ. సెహ్వాగ్, నెహ్రా, ఇషాంత్, గంభీర్, కోహ్లీ లాంటి ఆటగాళ్లు ఇక్కడ నుంచే వచ్చారు. హర్షిత్ రాణా పదునైన వేగంతో బంతులు విసిరి వికెట్లు పడగొట్టగలడు. కీలక సమయాల్లో జట్టుకు విజయాలు అందిస్తుంటాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 20.15 యావరేజ్​తో 19 వికెట్లు తీశాడు.

దేశవాళీల్లో దిల్లీ జట్టు తరపున 9 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో 36 వికెట్లు తీశాడు హర్షిత్. ఓ సెంచరీతో పాటు 410 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో అదిరే ప్రదర్శన చేసి శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్‌తో సిరీస్‌లకు ఎంపికయ్యాడు. కానీ అతడికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు.

ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు కూడా సెలెక్ట్ అయ్యాడు. మరి 6.2 అడుగుల ఎత్తు ఉండే హర్షిత్‌ తుది జట్టులోకి ఎంపిక అయితే, ఇతడి 140 కిలోమీటర్ల వేగంతో విసిరే బౌన్సర్లను బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో.

అలాగే పిచ్‌ పరిస్థితులకు అనుగుణంగా వేగాన్ని తగ్గించి, వైవిధ్యంతోనూ అతడు బ్యాటర్లను బోల్తా కొట్టించగలగే సత్తా ఉంది.

పవర్‌ హిట్టర్‌ రమణ్‌దీప్‌ సింగ్‌ (RamanDeep Singh VS South Africa)

27 ఏళ్ల పంజాబ్‌ పేస్‌ ఆల్‌రౌండర్‌ రమణ్‌దీప్‌ సింగ్‌ అలవోకగా భారీ షాట్లు ఆడుతాడు. రీసెంట్​గానే వర్థమాన జట్ల ఆసియా కప్‌లో సెమీస్‌లో అఫ్గానిస్థాన్​పై 34 బంతుల్లోనే 64 పరుగులు సాధించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేయర్​గా బరిలోకి దిగి 9 ఇన్నింగ్స్‌ల్లో 125 పరుగులు చేశాడు. అది కూడా 200కుపైగా స్ట్రైక్‌రేట్​తో. ఫీల్డింగ్‌లో చురుగ్గా కదలుతాడు. పేసర్‌గానూ రాణిస్తున్నాడు రమణ్​దీప్​.

ఇప్పటివరకూ దేశవాళీల్లో 37 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 170 స్ట్రైక్‌రేట్‌తో 544 పరుగులు చేశాడు రమణ్​దీప్​. 16 వికెట్లు కూడా తీశాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ ఇలా మూడు విభాగాల్లోనూ రాణించడం వల్ల ఇతడిని దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సెలక్ట్ చేశారు. భారత జట్టులో బౌలింగ్‌ కూడా చేయగల బ్యాటర్ల సంఖ్యను పెంచే దిశగా ఇతడిని ఎంపిక చేశారని తెలుస్తోంది.

బరువు తగ్గి వేగం పెంచిన వైశాఖ్​ జయ్​కుమార్ (Vijaykumar Vyshak vs Southafrica)

ఒకప్పుడు అధిక బరువుతో, ఫిట్‌నెస్‌ లేక, బౌలింగ్‌లో వేగం లేక కష్టాలు పడిన వైశాఖ్‌ జయ్‌కుమార్‌ ఇప్పుడు టీమ్‌ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫిట్‌గా మారి చోటు సంపాదించుకున్నాడు.

ఇతడిది కర్ణాటక. 27 ఏళ్ల వయసు. అయితే ఈ పేసర్‌ 5 ఏళ్ల క్రితం అధిక బరువుతో బాగా ఇబ్బండి పడ్డాడు. కానీ వెనకడుగు వేయలేదు. ఫిట్‌నెస్​తో పాటు బౌలింగ్‌లోనూ వేగాన్ని పెంచుకున్నాడు.

కర్ణాటక తరపున దేశవాళీ క్రికెట్​లో నిలకడగా రాణించడంతో పాటు, ఐపీఎల్‌లో ఆర్సీబీకి ఆడుతూ ఆకర్షించాడు. 25 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 24.11 యావరేజ్​తో 99 వికెట్లు తీశాడు. 21 లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో 34 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో బెంగళూరు తరఫున 11 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. అలా ఇప్పుడు సౌతాఫ్రికాతో టీ20 సిరీస్​కు ఎంపికయ్యాడు.

కివీస్​తో సిరీస్ ఓటమి- భారత్​ WTC ఫైనల్​ ఛాన్స్​లు ఎలా ఉన్నాయంటే?

సీనియర్లపై గంభీర్ స్ట్రిక్ట్​ యాక్షన్​ - 'ఇకపై ప్రాక్టీస్​కు వారు కూడా రావాల్సిందే'

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.