ETV Bharat / sports

మరణించిన 15 ఏళ్ల తర్వాత టెస్టుల్లో అరంగేట్రం చేసిన క్రికెటర్! - అదెలా సాధ్యమైందంటే? - TEST DEBUT AFTER15 YEARS DEATH

author img

By ETV Bharat Sports Team

Published : Sep 9, 2024, 7:34 PM IST

Cricketer Harry Lee TEST DEBUT AFTER15 YEARS DEATH : మరణించిన 15 ఏళ్ల తర్వాత ఓ క్రికెటర్ టెస్టుల్లో అరంగేట్రం చేశారని మీకు తెలుసా? అదేంటీ చనిపోయిన వ్యక్తి క్రికెట్ ఆడటం ఏంటని అనుకుంటున్నారా? దాని గురించే ఈ కథనం.

Cricket
Cricket (Getty Images)

Cricketer Harry Lee TEST DEBUT AFTER15 YEARS DEATH : నాగార్జున, సుమంత్ హీరోలుగా తెరకెక్కిన 'స్నేహమంటే ఇదేరా' సినిమా మీకు గుర్తుంది కదా. అందులో సుమంత్ ఆర్మీకి వెళ్తారు. అక్కడ జరిగిన ఓ యుద్ధంలో సుమంత్ మరణించినట్లు అతడి కుటుంబ సభ్యులకు వార్త వస్తుంది. తీరా కొన్నేళ్ల తర్వాత సుమంత్ ఇంటికి తిరిగి వస్తారు. అచ్చం అలాంటి ఘటనే ఓ క్రికెటర్ విషయంలోనూ జరిగింది. దీంతో అతడు మరణించిన 15 ఏళ్ల తర్వాత టెస్టు క్రికెట్​లో అరంగేట్రం చేయాల్సి వచ్చింది! అసలేం జరిగిందంటే?

ఇష్టం లేకపోయినా సైన్యంలోకి! - క్రికెటర్ హ్యారీ లీ 1890వ సంవత్సరంలో ఇంగ్లాండ్​లో జన్మించాడు. అతడికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. తనకు ఇష్టం లేకపోయినా హ్యారీ అనుకోకుండా మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చింది. యుద్ధం ప్రారంభమైనప్పుడు కూడా హ్యారీ క్రికెట్ ప్రాక్టీస్​లోనే బిజీగా ఉండేవాడు. అతడు 'మిడిల్‌ సెక్స్' టీమ్​ తరఫున లీ లార్డ్స్ గ్రౌండ్​లో తొలి సెంచరీ(139) చేసిన కొన్నాళ్లకే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది.

ప్రమాదంలో కన్నుమూశాడని వార్తలు! - లండన్‌ రెజిమెంట్​లో భాగమైన 13వ బెటాలియన్​లో చేరాడు హ్యారీ లీ. కొన్ని నెలలపాటు శిక్షణ పొందిన తర్వాత 1915 ఫిబ్రవరిలో ఆయన విధుల్లో చేరాడు. ఆ తర్వాత ఫ్రాన్స్ వెళ్లాడు. అక్కడ జర్మనీ జరిపిన దాడిలో వందలాది బ్రిటిష్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అందులో హ్యారీ లీ కూడా ఉన్నారని, ఆయన కుటుంబానికి మరణవార్త వెళ్లింది. దీంతో వారంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే వాస్తవానికి లీ కన్నుమూయలేదు. తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడి జాడ కనిపించకపోవడం వల్ల, హ్యారీ మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. కానీ ఆ తర్వాత హ్యారీ జర్మనీ జరిపిన దాడి నుంచి బయట పడినట్లు తెలిసింది. అతడి చనిపోలేదని నిర్ధరణ అయింది. అతడు ఫ్రాన్స్​లోని ఓ ఆస్పత్రిలో కొంత కాలం పాటు చికిత్స తీసుకుని బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఇండియాతో సైతం ఆడిన హ్యారీ లీ - 1915 అక్టోబరు 1న స్వదేశానికి బయలుదేరాడు హ్యారీ. గాయం కారణంగా ఒక కాలు చాలా పొట్టిగా తయారైంది. అయినా క్రికెట్ పై ఇష్టంతో 1916 ప్రారంభంలో హ్యారీ రాయల్ ఆర్మీ సర్వీస్ కార్ప్స్ కోసం ఒక మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్​లో సెంచరీ చేశాడు. ఎక్కువగా హ్యారీ ఫస్ట్ కెరీర్ మ్యాచ్​లో ఆడాడు. 437 మ్యాచులో 20వేలకు పైగా పరుగులు చేశాడు. 401 వికెట్లను పడగొట్టాడు. భారత్​లోనూ హ్యారీ లీ క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలోనే 1930లో హ్యారీ దక్షిణాఫ్రికాపై ఓ టెస్టు మ్యాచ్ ఆడాడు. అందులో 19 పరుగులు చేశాడు. అలా అతడు మరణించిన 15 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్​లోకి అడుగుపెట్టాడు!

క్రికెటర్ నుంచి బ్యాంకర్‌గా మారిన సెహ్వాగ్ టీమ్‌మేట్ ఎవరంటే? - Virender Sehwag Cricket Friend

'మమ్మల్ని ఓడించడాన్ని ఇండియన్స్ బాగా ఇష్టపడతారు!' - Border Gavaskar Trophy 2024 25

Cricketer Harry Lee TEST DEBUT AFTER15 YEARS DEATH : నాగార్జున, సుమంత్ హీరోలుగా తెరకెక్కిన 'స్నేహమంటే ఇదేరా' సినిమా మీకు గుర్తుంది కదా. అందులో సుమంత్ ఆర్మీకి వెళ్తారు. అక్కడ జరిగిన ఓ యుద్ధంలో సుమంత్ మరణించినట్లు అతడి కుటుంబ సభ్యులకు వార్త వస్తుంది. తీరా కొన్నేళ్ల తర్వాత సుమంత్ ఇంటికి తిరిగి వస్తారు. అచ్చం అలాంటి ఘటనే ఓ క్రికెటర్ విషయంలోనూ జరిగింది. దీంతో అతడు మరణించిన 15 ఏళ్ల తర్వాత టెస్టు క్రికెట్​లో అరంగేట్రం చేయాల్సి వచ్చింది! అసలేం జరిగిందంటే?

ఇష్టం లేకపోయినా సైన్యంలోకి! - క్రికెటర్ హ్యారీ లీ 1890వ సంవత్సరంలో ఇంగ్లాండ్​లో జన్మించాడు. అతడికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. తనకు ఇష్టం లేకపోయినా హ్యారీ అనుకోకుండా మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చింది. యుద్ధం ప్రారంభమైనప్పుడు కూడా హ్యారీ క్రికెట్ ప్రాక్టీస్​లోనే బిజీగా ఉండేవాడు. అతడు 'మిడిల్‌ సెక్స్' టీమ్​ తరఫున లీ లార్డ్స్ గ్రౌండ్​లో తొలి సెంచరీ(139) చేసిన కొన్నాళ్లకే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది.

ప్రమాదంలో కన్నుమూశాడని వార్తలు! - లండన్‌ రెజిమెంట్​లో భాగమైన 13వ బెటాలియన్​లో చేరాడు హ్యారీ లీ. కొన్ని నెలలపాటు శిక్షణ పొందిన తర్వాత 1915 ఫిబ్రవరిలో ఆయన విధుల్లో చేరాడు. ఆ తర్వాత ఫ్రాన్స్ వెళ్లాడు. అక్కడ జర్మనీ జరిపిన దాడిలో వందలాది బ్రిటిష్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అందులో హ్యారీ లీ కూడా ఉన్నారని, ఆయన కుటుంబానికి మరణవార్త వెళ్లింది. దీంతో వారంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే వాస్తవానికి లీ కన్నుమూయలేదు. తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడి జాడ కనిపించకపోవడం వల్ల, హ్యారీ మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. కానీ ఆ తర్వాత హ్యారీ జర్మనీ జరిపిన దాడి నుంచి బయట పడినట్లు తెలిసింది. అతడి చనిపోలేదని నిర్ధరణ అయింది. అతడు ఫ్రాన్స్​లోని ఓ ఆస్పత్రిలో కొంత కాలం పాటు చికిత్స తీసుకుని బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఇండియాతో సైతం ఆడిన హ్యారీ లీ - 1915 అక్టోబరు 1న స్వదేశానికి బయలుదేరాడు హ్యారీ. గాయం కారణంగా ఒక కాలు చాలా పొట్టిగా తయారైంది. అయినా క్రికెట్ పై ఇష్టంతో 1916 ప్రారంభంలో హ్యారీ రాయల్ ఆర్మీ సర్వీస్ కార్ప్స్ కోసం ఒక మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్​లో సెంచరీ చేశాడు. ఎక్కువగా హ్యారీ ఫస్ట్ కెరీర్ మ్యాచ్​లో ఆడాడు. 437 మ్యాచులో 20వేలకు పైగా పరుగులు చేశాడు. 401 వికెట్లను పడగొట్టాడు. భారత్​లోనూ హ్యారీ లీ క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలోనే 1930లో హ్యారీ దక్షిణాఫ్రికాపై ఓ టెస్టు మ్యాచ్ ఆడాడు. అందులో 19 పరుగులు చేశాడు. అలా అతడు మరణించిన 15 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్​లోకి అడుగుపెట్టాడు!

క్రికెటర్ నుంచి బ్యాంకర్‌గా మారిన సెహ్వాగ్ టీమ్‌మేట్ ఎవరంటే? - Virender Sehwag Cricket Friend

'మమ్మల్ని ఓడించడాన్ని ఇండియన్స్ బాగా ఇష్టపడతారు!' - Border Gavaskar Trophy 2024 25

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.