ETV Bharat / sports

ఒలింపిక్స్​లో రెజ్లింగ్ ఖాతాను తెరిచిన అమన్ - కాంస్యాన్ని ముద్దాడిన 21 ఏళ్ల కుర్రాడు​ - Aman Sehrawat Paris Olympics 2024

author img

By ETV Bharat Sports Team

Published : Aug 10, 2024, 7:01 AM IST

Aman Sehrawat Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్​లో భాగంగా శుక్రవారం జరిగిన పురుషల రెజ్లింగ్​ కాంస్య పోరులో 21 ఏళ్ల అమన్‌ సెహ్రావత్‌ అదరగొట్టాడు. 57 కిలోల విభాగంలో ప్యూర్టోరికోకు చెందిన దరియన్‌ టోయ్‌ క్రజ్​ను 13-5తో ఓడించాడు.

Aman Sehrawat Paris Olympics 2024
Aman Sehrawat Paris Olympics 2024 (Associated Press)

Aman Sehrawat Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్​లో భాగంగా శుక్రవారం జరిగిన పురుషల రెజ్లింగ్​ కాంస్య పోరులో 21 ఏళ్ల అమన్‌ సెహ్రావత్‌ అదరగొట్టాడు. 57 కిలోల విభాగంలో ప్యూర్టోరికోకు చెందిన దరియన్‌ టోయ్‌ క్రజ్​ను 13-5తో ఓడించి చరిత్రకెక్కాడు.

ఆ రికార్డులో సింధును దాటి
ఒలింపిక్స్‌ బరిలో భారత్​ తరఫున బరిలోకి దిగిన ఏకైక పురుష ప్లేయర్​ అమన్​. అయితే ఈ అబ్బాయి ఈ ఒలింపిక్స్​లో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం సాధించిన అతి పిన్న వయస్సు గల భారత అథ్లెట్‌గా రికార్డుకెక్కాడు. అయితే అమన్​కంటే ముందే ఈ రికార్డును బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు తన ఖాతాలో వేసుకుంది. 2016లో జరిగిన ఒలింపిక్స్​లో ఆమె రజతం గెలిచినప్పుడు తన వయసు 21 ఏళ్ల 1 నెల 14 రోజులు.

ఒలింపిక్స్​లో రెజ్లింగ్ ప్రస్థానం
ఒలింపిక్​లో పతకం సాధించిన తొలి భారత రెజ్లర్ కేడీ జాధవ్‌. 1952 (హెల్సింకి)లో అతడు కాంస్యం గెలిచాడు. స్వతంత్ర భారతంలో ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం గెలిచిన తొలి ఆటగాడు కూడా ఆయనే. ఆ తర్వాత 2008 నుంచి రెజ్లింగ్‌లో క్రమం తప్పకుండా ఒక్క మెడలైనా సాధిస్తున్నారు మన రెజ్లర్లు. అయితే ఈ సారి ఆ రికార్డు చెరగనివ్వకుండా అమన్ కాపాడాడు. తన మెడల్​తో ఆ క్రమాన్ని కొనసాగించినట్లు అయ్యింది. 2008లో సుశీల్‌ కుమార్‌ కాంస్యం ముద్దాడగా, ఆ తర్వాత 2012లో యోగేశ్వర్‌ దత్‌ (కాంస్యం), 2016లో సాక్షి మలిక్‌ (కాంస్యం) 2020లో రవి దహియా (రజతం),బజ్‌రంగ్‌ పునియా (కాంస్యం) సాధించారు. 2012లోనూ సుశీల్‌ కుమార్‌ రజత పతకాన్ని సాధించాడు.

ఆఖరి రెజ్లర్ ఆమెనే
అమన్‌ విజయంతో భారత్‌, టోక్యో ఒలింపిక్స్‌ పెర్ఫామెన్స్ (7 పతకాలు)కు చేరువైంది. అయితే నిషా (68 కేజీ), అన్షు మలిక్‌ (57 కేజీ), అంతిమ్‌ ఫంగాల్‌ (53 కేజీ), తమ తమ విభాగాల్లో పోరాడినప్పటికీ పతక రౌండ్లకు చేరలేకపోయారు. ఇక వినేశ్‌ ఫైనల్​కు చేరినప్పటికీ అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైంది. ఇక శనివారం (ఆగస్టు 10)న రీతిక 76 కేజీల విభాగంలో దిగనుంది. బరిలో మిగిలి ఆఖరి భారత రెజ్లర్‌ కూడా ఆమెనే కావడం విశేషం.

వినేశ్​కు రెజ్లింగ్ గోల్డ్​ మెడలిస్ట్​ సపోర్ట్​ : 'గంటలోనే ఆ సంబరాలకు బ్రేక్‌ పడింది- ఆమె బాధను అర్థం చేసుకోగలను' - Paris Olympics 2024

వినేశ్‌ ఫోగాట్‌ వ్యవహారంలో ఏం జరిగింది? - కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన మాజీ కెప్టెన్‌ - Paris Olympics 2024 vinesh Phogat

Aman Sehrawat Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్​లో భాగంగా శుక్రవారం జరిగిన పురుషల రెజ్లింగ్​ కాంస్య పోరులో 21 ఏళ్ల అమన్‌ సెహ్రావత్‌ అదరగొట్టాడు. 57 కిలోల విభాగంలో ప్యూర్టోరికోకు చెందిన దరియన్‌ టోయ్‌ క్రజ్​ను 13-5తో ఓడించి చరిత్రకెక్కాడు.

ఆ రికార్డులో సింధును దాటి
ఒలింపిక్స్‌ బరిలో భారత్​ తరఫున బరిలోకి దిగిన ఏకైక పురుష ప్లేయర్​ అమన్​. అయితే ఈ అబ్బాయి ఈ ఒలింపిక్స్​లో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం సాధించిన అతి పిన్న వయస్సు గల భారత అథ్లెట్‌గా రికార్డుకెక్కాడు. అయితే అమన్​కంటే ముందే ఈ రికార్డును బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు తన ఖాతాలో వేసుకుంది. 2016లో జరిగిన ఒలింపిక్స్​లో ఆమె రజతం గెలిచినప్పుడు తన వయసు 21 ఏళ్ల 1 నెల 14 రోజులు.

ఒలింపిక్స్​లో రెజ్లింగ్ ప్రస్థానం
ఒలింపిక్​లో పతకం సాధించిన తొలి భారత రెజ్లర్ కేడీ జాధవ్‌. 1952 (హెల్సింకి)లో అతడు కాంస్యం గెలిచాడు. స్వతంత్ర భారతంలో ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం గెలిచిన తొలి ఆటగాడు కూడా ఆయనే. ఆ తర్వాత 2008 నుంచి రెజ్లింగ్‌లో క్రమం తప్పకుండా ఒక్క మెడలైనా సాధిస్తున్నారు మన రెజ్లర్లు. అయితే ఈ సారి ఆ రికార్డు చెరగనివ్వకుండా అమన్ కాపాడాడు. తన మెడల్​తో ఆ క్రమాన్ని కొనసాగించినట్లు అయ్యింది. 2008లో సుశీల్‌ కుమార్‌ కాంస్యం ముద్దాడగా, ఆ తర్వాత 2012లో యోగేశ్వర్‌ దత్‌ (కాంస్యం), 2016లో సాక్షి మలిక్‌ (కాంస్యం) 2020లో రవి దహియా (రజతం),బజ్‌రంగ్‌ పునియా (కాంస్యం) సాధించారు. 2012లోనూ సుశీల్‌ కుమార్‌ రజత పతకాన్ని సాధించాడు.

ఆఖరి రెజ్లర్ ఆమెనే
అమన్‌ విజయంతో భారత్‌, టోక్యో ఒలింపిక్స్‌ పెర్ఫామెన్స్ (7 పతకాలు)కు చేరువైంది. అయితే నిషా (68 కేజీ), అన్షు మలిక్‌ (57 కేజీ), అంతిమ్‌ ఫంగాల్‌ (53 కేజీ), తమ తమ విభాగాల్లో పోరాడినప్పటికీ పతక రౌండ్లకు చేరలేకపోయారు. ఇక వినేశ్‌ ఫైనల్​కు చేరినప్పటికీ అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైంది. ఇక శనివారం (ఆగస్టు 10)న రీతిక 76 కేజీల విభాగంలో దిగనుంది. బరిలో మిగిలి ఆఖరి భారత రెజ్లర్‌ కూడా ఆమెనే కావడం విశేషం.

వినేశ్​కు రెజ్లింగ్ గోల్డ్​ మెడలిస్ట్​ సపోర్ట్​ : 'గంటలోనే ఆ సంబరాలకు బ్రేక్‌ పడింది- ఆమె బాధను అర్థం చేసుకోగలను' - Paris Olympics 2024

వినేశ్‌ ఫోగాట్‌ వ్యవహారంలో ఏం జరిగింది? - కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన మాజీ కెప్టెన్‌ - Paris Olympics 2024 vinesh Phogat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.