ETV Bharat / spiritual

పెద్దలకు బియ్యం ఇస్తున్నారా? కచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే! - Mahalaya Amavasya 2024

author img

By ETV Bharat Features Team

Published : 4 hours ago

Mahalaya Amavasya 2024: మహాలయ అమావాస్య రోజు ఎలాంటి విధివిధానాలు పాటిస్తే పితృ దోషాలు, శాపాలు తొలగించుకోవచ్చు? అఖండ రాజ వైభవాన్ని అందిపుచ్చుకోవడానికి ఈ రోజు పాటించాల్సిన ప్రత్యేకమైన విధివిధానాలు ఏంటి? అసలు మహాలయ అమావాస్య అంటే ఏంటి? ఈ ప్రశ్నలకు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Mahalaya Amavasya 2024
Mahalaya Amavasya 2024 (ETV Bharat)

Mahalaya Amavasya 2024: భాద్రపద మాసంలో వచ్చే బహుళ పక్షాన్ని మహాలయ పక్షం లేదా పితృ పక్షం అంటారు. ఇందులో వచ్చే అమావాస్యను పెద్దల అమావాస్య లేదా మహాలయ అమావాస్యగా పిలుస్తారు. అయితే, మరణించిన పెద్దలకు ఈరోజు కొన్ని రకాల విధులు పాటిస్తే వారి అనుగ్రహం పొంది తరతరాలకు అదృష్టం కలిసివస్తుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ అంటున్నారు. ఇవే కాకుండా జాతకంలో ఉన్న పితృ దోషాలు తొలగిపోతాయని వివరించారు. అక్టోబర్ 2న మహాలయ అమావాస్య ఉన్న నేపథ్యంలో అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ ఇంట్లో మరణించిన పెద్దల ఫొటోలు దక్షిణ దిశలో ఉంచి వాటికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి దీపం వెలిగించి.. వారికి ఇష్టమైన పదార్థాలను వండి నైవేద్యంగా పెట్టాలి. ఫొటోలకు పూల మాలలు పెట్టి అలకరించాలి. వారికి నైవేద్యంగా పెట్టిన ఆహారాన్ని.. తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తే పెద్దలు సంతోషించి వారి అనుగ్రహం కలుగుతుందట. మనసులోని కోరికలు నెరవేరుతాయని చెబుతున్నారు.

మరణించిన పెద్దలను స్మరించుకుంటూ తర్పణం ఇస్తే మంచిదని కిరణ్ కుమార్ అంటున్నారు. ఇంటి యజమాని దక్షిణం వైపు వెళ్లి తర్పణం వదలాలని చెబుతున్నారు. కింద చిన్న పల్లెం పెట్టి ఉద్దరిణి సాయంతో నీటిని తీసుకుంటూ ఓం కేశవాయ స్వాహః, ఓం నారాయణయా స్వాహః, ఓం మాధవయా స్వాః అంటూ ఆచమణం చేయాలి. ఆ తర్వాత గ్లాసు నీటిలో నల్ల నువ్వులు కలిపి వాటిని కుడి చేతి చూపుడు వేలు, బొటన వేలు మధ్యలో నుంచి వదులుతూ పల్లెంలో పడేలా తర్పణం ఇవ్వాలి. ఈ నీటిని తీసుకెళ్లి మొక్కలకు పోయాలి. ఇలా విడిచే సమయంలో మరణించిన పూర్వీకుల పేర్లను స్మరించుకోవాలి. ఇలా తర్పణం ఇవ్వడం, ఫొటోల దగ్గర నైవేద్యాలు పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

దీంతో పాటుగా మరణించిన పెద్దల పేరిట బ్రహ్మణులకు స్వయం పాకం (రెండు పూటల తినడానికి అవసరమైన పదార్థాలు అన్నీ) దానం చేయడం వల్ల మంచి జరుగుతుందని వివరిస్తున్నారు. ఇంకా గోసేవలో భాగంగా ఆవులు తినడానికి పచ్చి గడ్డి, తవుడుకు అవసరమైన ధనాన్ని మరణించిన వారి పేరిట దానం చేస్తే చాలా మంచిదని చెబుతున్నారు. పెద్దల అమావాస్య రోజు పిండ ప్రదానం చేయడం వల్ల కూడా సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని తెలిపారు. ఈరోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం, నిమ్మకాయ పులిహోర పెట్టినా మంచి జరుగుతుందన్నారు.

మహాలయ అమావాస్య రోజున రావి చెట్టు వద్ద తప్పకుండా దీపం పెట్టాలట. రావి చెట్టు దగ్గర పెద్ద మట్టి ప్రమిద ఉంచి దానిలో ఆవాల నూనె పోసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి.. అలాంటివి 12 విడిగా వేసి దీపం పెట్టాలని తెలిపారు. ఒకే ప్రమిదలో 12 ఒత్తులు వెలిగేలా దీపం పెట్టి.. 12 ప్రదక్షిణలు రావి చెట్టు చుట్టూ చేస్తే మంచి జరుగుతుందన్నారు.

పెద్దల దోషాలు తొలగిపోయి.. లక్ష్మీ కటాక్షం కలగాలంటే మహాలయ అమావాస్య రోజు నవధాన్యాల పరిహారం చేయాలని తెలిపారు. నవధాన్యాలు నానబెట్టి అవి మొలకలు వచ్చాక.. వాటిని గోమాతకు ఆహరంగా తినిపించాలి. నానబెట్టిన నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లి.. అవి మొలకలు వచ్చాక తినిపించాలన్నారు. బార్లీ గింజలు తీసుకుని వాటిని పాలు, నీళ్లతో కడిగి ఎక్కడైనా పారే నీటిలో వదిలిపెడితే పెద్దల అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా పొందవచ్చని అంటున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

బతుకమ్మ ఉత్సవాల వేళ ఉర్రూతలూగించే సాంగ్స్ ఇవే - ఒక్కసారైనా విన్నారా? - TOP 5 BATHUKAMMA SONGS WITH LYRICS

'దేవీ నవరాత్రుల్లో కుమారి పూజ - ఈ ఒక్క పూజ చేస్తే అప్పులు, బాధలన్నీ తొలగిపోతాయి' - Navaratri Kumari Puja

Mahalaya Amavasya 2024: భాద్రపద మాసంలో వచ్చే బహుళ పక్షాన్ని మహాలయ పక్షం లేదా పితృ పక్షం అంటారు. ఇందులో వచ్చే అమావాస్యను పెద్దల అమావాస్య లేదా మహాలయ అమావాస్యగా పిలుస్తారు. అయితే, మరణించిన పెద్దలకు ఈరోజు కొన్ని రకాల విధులు పాటిస్తే వారి అనుగ్రహం పొంది తరతరాలకు అదృష్టం కలిసివస్తుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ అంటున్నారు. ఇవే కాకుండా జాతకంలో ఉన్న పితృ దోషాలు తొలగిపోతాయని వివరించారు. అక్టోబర్ 2న మహాలయ అమావాస్య ఉన్న నేపథ్యంలో అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ ఇంట్లో మరణించిన పెద్దల ఫొటోలు దక్షిణ దిశలో ఉంచి వాటికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి దీపం వెలిగించి.. వారికి ఇష్టమైన పదార్థాలను వండి నైవేద్యంగా పెట్టాలి. ఫొటోలకు పూల మాలలు పెట్టి అలకరించాలి. వారికి నైవేద్యంగా పెట్టిన ఆహారాన్ని.. తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తే పెద్దలు సంతోషించి వారి అనుగ్రహం కలుగుతుందట. మనసులోని కోరికలు నెరవేరుతాయని చెబుతున్నారు.

మరణించిన పెద్దలను స్మరించుకుంటూ తర్పణం ఇస్తే మంచిదని కిరణ్ కుమార్ అంటున్నారు. ఇంటి యజమాని దక్షిణం వైపు వెళ్లి తర్పణం వదలాలని చెబుతున్నారు. కింద చిన్న పల్లెం పెట్టి ఉద్దరిణి సాయంతో నీటిని తీసుకుంటూ ఓం కేశవాయ స్వాహః, ఓం నారాయణయా స్వాహః, ఓం మాధవయా స్వాః అంటూ ఆచమణం చేయాలి. ఆ తర్వాత గ్లాసు నీటిలో నల్ల నువ్వులు కలిపి వాటిని కుడి చేతి చూపుడు వేలు, బొటన వేలు మధ్యలో నుంచి వదులుతూ పల్లెంలో పడేలా తర్పణం ఇవ్వాలి. ఈ నీటిని తీసుకెళ్లి మొక్కలకు పోయాలి. ఇలా విడిచే సమయంలో మరణించిన పూర్వీకుల పేర్లను స్మరించుకోవాలి. ఇలా తర్పణం ఇవ్వడం, ఫొటోల దగ్గర నైవేద్యాలు పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

దీంతో పాటుగా మరణించిన పెద్దల పేరిట బ్రహ్మణులకు స్వయం పాకం (రెండు పూటల తినడానికి అవసరమైన పదార్థాలు అన్నీ) దానం చేయడం వల్ల మంచి జరుగుతుందని వివరిస్తున్నారు. ఇంకా గోసేవలో భాగంగా ఆవులు తినడానికి పచ్చి గడ్డి, తవుడుకు అవసరమైన ధనాన్ని మరణించిన వారి పేరిట దానం చేస్తే చాలా మంచిదని చెబుతున్నారు. పెద్దల అమావాస్య రోజు పిండ ప్రదానం చేయడం వల్ల కూడా సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని తెలిపారు. ఈరోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం, నిమ్మకాయ పులిహోర పెట్టినా మంచి జరుగుతుందన్నారు.

మహాలయ అమావాస్య రోజున రావి చెట్టు వద్ద తప్పకుండా దీపం పెట్టాలట. రావి చెట్టు దగ్గర పెద్ద మట్టి ప్రమిద ఉంచి దానిలో ఆవాల నూనె పోసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి.. అలాంటివి 12 విడిగా వేసి దీపం పెట్టాలని తెలిపారు. ఒకే ప్రమిదలో 12 ఒత్తులు వెలిగేలా దీపం పెట్టి.. 12 ప్రదక్షిణలు రావి చెట్టు చుట్టూ చేస్తే మంచి జరుగుతుందన్నారు.

పెద్దల దోషాలు తొలగిపోయి.. లక్ష్మీ కటాక్షం కలగాలంటే మహాలయ అమావాస్య రోజు నవధాన్యాల పరిహారం చేయాలని తెలిపారు. నవధాన్యాలు నానబెట్టి అవి మొలకలు వచ్చాక.. వాటిని గోమాతకు ఆహరంగా తినిపించాలి. నానబెట్టిన నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లి.. అవి మొలకలు వచ్చాక తినిపించాలన్నారు. బార్లీ గింజలు తీసుకుని వాటిని పాలు, నీళ్లతో కడిగి ఎక్కడైనా పారే నీటిలో వదిలిపెడితే పెద్దల అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా పొందవచ్చని అంటున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

బతుకమ్మ ఉత్సవాల వేళ ఉర్రూతలూగించే సాంగ్స్ ఇవే - ఒక్కసారైనా విన్నారా? - TOP 5 BATHUKAMMA SONGS WITH LYRICS

'దేవీ నవరాత్రుల్లో కుమారి పూజ - ఈ ఒక్క పూజ చేస్తే అప్పులు, బాధలన్నీ తొలగిపోతాయి' - Navaratri Kumari Puja

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.