ETV Bharat / politics

పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - నెల్లూరు సబ్​జైలుకు తరలింపు - Pinnelli Ramakrishna Reddy remanded

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 27, 2024, 9:16 AM IST

Pinnelli Ramakrishna Reddy Remanded In AP : ఏపీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. పటిష్ట భద్రత మధ్య ఆయన్ను నెల్లూరు సబ్‌ జైలుకు తరలించారు. పోలింగ్ రోజున తెలుగుదేశం ఏజెంట్‌పై హత్యాయత్నంతో పాటు, కారంపూడి సీఐపై దాడి కేసులో పిన్నెల్లికి మాచర్ల కోర్టు రిమాండ్ విధించింది. ఈవీఎం ధ్వంసం సహా మరో కేసులో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. అంతకు ముందు హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Pinnelli Ramakrishna Reddy Remanded In AP
Pinnelli Ramakrishna Reddy Remanded In AP (ETV Bharat)

Pinnelli Ramakrishna Reddy Remanded In AP : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు ఈవీఎం ధ్వంసంతో పాటు, అల్లర్ల కేసులో అరెస్టు అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. మాచర్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు ఆయనను బుధవారం రాత్రి ప్రవేశపెట్టారు. ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టిన నాలుగు కేసుల్లో న్యాయమూర్తి విచారణ చేపట్టారు. రెండు కేసుల్లో పిన్నెల్లికి బెయిల్‌ మంజూరు కాగా, మరో రెండు కేసుల్లో రిమాండ్‌ విధించారు. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించడంతో పటిష్ట భద్రత మధ్య ఆయన్ను తీసుకెళ్లారు.

విధ్వంసానికి పాల్పడమేగాక, అడ్డుకోబోయిన సీఐపైనా దాడి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేట్ పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేయడంతో పాటు, అడ్డుకోబోయిన తెలుగుదేశం ఏజెంట్‌పై దాడి చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపల మరో మహిళపైనా దాడికి యత్నించారు. పోలింగ్ ముగిసిన తర్వాత రోజు అనుచరులతో కలిసి కారంపూడిలో విధ్వంసానికి పాల్పడమేగాక, అడ్డుకోబోయిన సీఐపైనా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులతోపాటు అనుచరులపైనా కేసులు నమోదయ్యాయి.

టీడీపీ ఏజెంట్​పై హత్యాయత్నం, సీఐపై దాడి కేసులలో రిమాండ్: ఈ కేసుల్లో ఇన్నాళ్లు అరెస్ట్ కాకుండా హైకోర్టు నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోగా, ఇప్పటికీ మూడుసార్లు వాటిని పొడిగించారు. ఈ వెసులుబాటు గడువు ముగియడంతోపాటు ఆయన ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. దీంతో నరసరావుపేట మండలం రావిపాడు పరిధిలోని విల్లాలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పటిష్ఠ బందోబస్తు మధ్య మాచర్ల కోర్టుకు తరలించారు. ఇరువైపుల వాదనల విన్న న్యాయమూర్తి పాల్వాయిగేట్‌ పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై హత్యాయత్నం కేసు, కారంపూడి సీఐపై దాడి కేసులో రిమాండ్ విధించారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి మాచర్ల తరలించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అటు పిన్నెల్లి అరెస్ట్‌తో మాచర్లలో తెలుగుదేశం నేతలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కోర్టు వద్దకు పెద్దఎత్తున చేరుకున్న తెలుగుదేశం కార్యకర్తలు పిన్నెల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసు వాహనంలో నుంచి కోర్టుకు తరలిస్తున్న తరుణంలో ఆయనకు ఎదురు నిలిచిన ఓ తెలుగుదేశం కార్యకర్తపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడి చేశారు. ఆయన కడుపులో చేతితో గట్టిగా గుద్దారు.

వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్​ - ap ex mla Pinnelli arrest

హత్యలు, అరాచకాలు, వేల కోట్ల ఆస్తులు - 'ఏపీ నయీమ్​ పిన్నెల్లి'పై టీడీపీ బుక్​ - TDP BOOK ON YCP MLA PINNELLI

Pinnelli Ramakrishna Reddy Remanded In AP : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు ఈవీఎం ధ్వంసంతో పాటు, అల్లర్ల కేసులో అరెస్టు అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. మాచర్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు ఆయనను బుధవారం రాత్రి ప్రవేశపెట్టారు. ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టిన నాలుగు కేసుల్లో న్యాయమూర్తి విచారణ చేపట్టారు. రెండు కేసుల్లో పిన్నెల్లికి బెయిల్‌ మంజూరు కాగా, మరో రెండు కేసుల్లో రిమాండ్‌ విధించారు. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించడంతో పటిష్ట భద్రత మధ్య ఆయన్ను తీసుకెళ్లారు.

విధ్వంసానికి పాల్పడమేగాక, అడ్డుకోబోయిన సీఐపైనా దాడి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేట్ పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేయడంతో పాటు, అడ్డుకోబోయిన తెలుగుదేశం ఏజెంట్‌పై దాడి చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపల మరో మహిళపైనా దాడికి యత్నించారు. పోలింగ్ ముగిసిన తర్వాత రోజు అనుచరులతో కలిసి కారంపూడిలో విధ్వంసానికి పాల్పడమేగాక, అడ్డుకోబోయిన సీఐపైనా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులతోపాటు అనుచరులపైనా కేసులు నమోదయ్యాయి.

టీడీపీ ఏజెంట్​పై హత్యాయత్నం, సీఐపై దాడి కేసులలో రిమాండ్: ఈ కేసుల్లో ఇన్నాళ్లు అరెస్ట్ కాకుండా హైకోర్టు నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోగా, ఇప్పటికీ మూడుసార్లు వాటిని పొడిగించారు. ఈ వెసులుబాటు గడువు ముగియడంతోపాటు ఆయన ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. దీంతో నరసరావుపేట మండలం రావిపాడు పరిధిలోని విల్లాలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పటిష్ఠ బందోబస్తు మధ్య మాచర్ల కోర్టుకు తరలించారు. ఇరువైపుల వాదనల విన్న న్యాయమూర్తి పాల్వాయిగేట్‌ పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై హత్యాయత్నం కేసు, కారంపూడి సీఐపై దాడి కేసులో రిమాండ్ విధించారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి మాచర్ల తరలించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అటు పిన్నెల్లి అరెస్ట్‌తో మాచర్లలో తెలుగుదేశం నేతలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కోర్టు వద్దకు పెద్దఎత్తున చేరుకున్న తెలుగుదేశం కార్యకర్తలు పిన్నెల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసు వాహనంలో నుంచి కోర్టుకు తరలిస్తున్న తరుణంలో ఆయనకు ఎదురు నిలిచిన ఓ తెలుగుదేశం కార్యకర్తపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడి చేశారు. ఆయన కడుపులో చేతితో గట్టిగా గుద్దారు.

వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్​ - ap ex mla Pinnelli arrest

హత్యలు, అరాచకాలు, వేల కోట్ల ఆస్తులు - 'ఏపీ నయీమ్​ పిన్నెల్లి'పై టీడీపీ బుక్​ - TDP BOOK ON YCP MLA PINNELLI

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.