ETV Bharat / politics

కొంగుచాచిన తోబుట్టువులకు ఏం చెప్తావ్ జగన్? - Sisters fire on CM Jagan

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 4:36 PM IST

Sisters fire on CM Jagan: 'నా అక్క చెల్లెమ్మలు' అని మాట్లాడే జగన్​కు నిజంగా వారిపై ఉన్న ప్రేమ ఎంత? సొంత అన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా.. ఇద్దరు చెల్లెళ్లు కొంగు పట్టుకుని ప్రజలను కోరుతున్నది ఏమిటి? అధికారం కోసం సొంత అక్కా చెల్లెళ్లకే అన్యాయం తలపెట్టిన సీఎం తనకు ఓటేసి గెలిపించిన కోట్లాది అక్కచెల్లెమ్మలకు చేసిందేమిటి? అమ్మకు అన్నం పెట్టని వ్యక్తి చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానంటే నమ్మేదెలా? రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

sisters_fire_on_cm_jagan
sisters_fire_on_cm_jagan

Sisters fire on CM Jagan: అమ్మలో సగం, నాన్నలో సగం కలిపి 'అన్న' అని పిలుచుకుంటారు. తండ్రి తర్వాత మళ్లీ అంతటి వాడు అన్నే అని భావిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు అన్నకు ఇచ్చే గౌరవ మర్యాదలు అన్నీఇన్నీ కావు. కానీ, తమకు జరిగిన అన్యాయంపై సొంత అన్నే మౌనం వహిస్తున్నారని వాపోతున్నారు వైఎస్ షర్మిల, సునీత. అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తుంటే ఇక అడిగేదెలా? అని షర్మిల, చిన్నాన్న అంటే అర్థం తెలుసా? అని సునీత ప్రశ్నిస్తున్నారు.

జగన్ బంధుత్వాలకు అర్థం తెలుసా? చంపిన వాళ్లు నీ పక్కనే ఉన్నారు- వైఎస్ సునీత - ys viveka murder case

వైఎస్ వివేకా హత్య జరిగి ఐదేళ్లయిపోయింది. నిందితులకు ఇప్పటికీ శిక్ష పడలేదు. న్యాయం కోసం తాము పోరాడుతున్నా హంతకులకు జగన్​ అండగా ఉంటున్నారని స్వయంగా ఆయన చెల్లెళ్లు షర్మిల, వైఎస్ వివేకా కూతురు సునీత వాపోతున్నారు. సొంత చెల్లెళ్లకు న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎలా పారదర్శక పాలన అందిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల వేళ ప్రజా క్షేత్రంలోకి వచ్చి కొంగు పట్టి న్యాయం కావాలని కోరుతున్నారు. హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న వైఎస్సార్సీపీకి ఓటు వేయొద్దని విన్నవిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఓడించి జగన్​కు బుద్ధి చెప్పాలని ప్రజలను వేడుకుంటున్నారు.

అవినాష్‌ను అరెస్టు చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని భయమా?: సునీత - YS Vivekananda Reddy Murder case

అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని షర్మిల జగన్​పై మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన షర్మిల రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆమెకు సమాధానం చెప్పేవారు లేకపోగా ఎన్నికల్లో లబ్ధి కోసమే ఆరోపణలు చేస్తోందంటూ అభాండాలు వేస్తున్నారు. పైగా కుటంబ పరువును బజారున పడేస్తున్నారంటూ మేనత్తను రంగంలోకి దించి విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కా చెల్లెళ్లపై అసత్య ప్రచారం నీకు న్యాయమేనా జగన్! అంటూ వైఎస్ అభిమానులు, సగటు ప్రజలు ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు.

అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు: షర్మిల

ఎన్నికల్లో అవకాశం కల్పించడంపై ఆవేదన : బాబాయి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్​ అరెస్టు కాకుండా ఐదేళ్ల పాటు కాపాడుకున్న జగన్​ ఎన్నికల్లో మళ్లీ అవకాశం కల్పించడాన్ని షర్మిల ప్రశ్నించారు. నిందితుడని సీబీఐ తేల్చి చెప్పినా ఓటు వేసి గెలిపించాలని ఎలా కోరుతున్నారు అని నిలదీశారు. అవినాశ్​ను ఓడించి జగన్​కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం - YS Sharmila Election Campaign

Sisters fire on CM Jagan: అమ్మలో సగం, నాన్నలో సగం కలిపి 'అన్న' అని పిలుచుకుంటారు. తండ్రి తర్వాత మళ్లీ అంతటి వాడు అన్నే అని భావిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు అన్నకు ఇచ్చే గౌరవ మర్యాదలు అన్నీఇన్నీ కావు. కానీ, తమకు జరిగిన అన్యాయంపై సొంత అన్నే మౌనం వహిస్తున్నారని వాపోతున్నారు వైఎస్ షర్మిల, సునీత. అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తుంటే ఇక అడిగేదెలా? అని షర్మిల, చిన్నాన్న అంటే అర్థం తెలుసా? అని సునీత ప్రశ్నిస్తున్నారు.

జగన్ బంధుత్వాలకు అర్థం తెలుసా? చంపిన వాళ్లు నీ పక్కనే ఉన్నారు- వైఎస్ సునీత - ys viveka murder case

వైఎస్ వివేకా హత్య జరిగి ఐదేళ్లయిపోయింది. నిందితులకు ఇప్పటికీ శిక్ష పడలేదు. న్యాయం కోసం తాము పోరాడుతున్నా హంతకులకు జగన్​ అండగా ఉంటున్నారని స్వయంగా ఆయన చెల్లెళ్లు షర్మిల, వైఎస్ వివేకా కూతురు సునీత వాపోతున్నారు. సొంత చెల్లెళ్లకు న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎలా పారదర్శక పాలన అందిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల వేళ ప్రజా క్షేత్రంలోకి వచ్చి కొంగు పట్టి న్యాయం కావాలని కోరుతున్నారు. హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న వైఎస్సార్సీపీకి ఓటు వేయొద్దని విన్నవిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఓడించి జగన్​కు బుద్ధి చెప్పాలని ప్రజలను వేడుకుంటున్నారు.

అవినాష్‌ను అరెస్టు చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని భయమా?: సునీత - YS Vivekananda Reddy Murder case

అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని షర్మిల జగన్​పై మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన షర్మిల రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆమెకు సమాధానం చెప్పేవారు లేకపోగా ఎన్నికల్లో లబ్ధి కోసమే ఆరోపణలు చేస్తోందంటూ అభాండాలు వేస్తున్నారు. పైగా కుటంబ పరువును బజారున పడేస్తున్నారంటూ మేనత్తను రంగంలోకి దించి విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కా చెల్లెళ్లపై అసత్య ప్రచారం నీకు న్యాయమేనా జగన్! అంటూ వైఎస్ అభిమానులు, సగటు ప్రజలు ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు.

అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు: షర్మిల

ఎన్నికల్లో అవకాశం కల్పించడంపై ఆవేదన : బాబాయి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్​ అరెస్టు కాకుండా ఐదేళ్ల పాటు కాపాడుకున్న జగన్​ ఎన్నికల్లో మళ్లీ అవకాశం కల్పించడాన్ని షర్మిల ప్రశ్నించారు. నిందితుడని సీబీఐ తేల్చి చెప్పినా ఓటు వేసి గెలిపించాలని ఎలా కోరుతున్నారు అని నిలదీశారు. అవినాశ్​ను ఓడించి జగన్​కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం - YS Sharmila Election Campaign

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.