ETV Bharat / politics

బీజేపీలో చేరిన రాయదుర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 16, 2024, 10:04 PM IST

Rayadurgam YSRCP MLA Kapu Ramachandra Reddy Join In BJP: రాయదుర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తన భార్య భారతితో కలిసి కమలం కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ దుష్టపాలనకు చరమగీతం పాడేందుకు ప్రతి ఆంధ్రుడు సిద్ధం కావాలని దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. రేపు బొప్పూడిలో ప్రధాని మోదీ పాల్గొనే మహాకూటమి తొలి బహిరంగ సభ ద్వారా ఎన్నికల శంఖం పూరించబోతున్నారని తెలిపారు.

Rayadurgam_YSRCP_MLA_Kapu_Ramachandra_Reddy_Join_In_BJP
Rayadurgam_YSRCP_MLA_Kapu_Ramachandra_Reddy_Join_In_BJP

Rayadurgam YSRCP MLA Kapu Ramachandra Reddy Join In BJP : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ దుష్టపాలనకు చరమగీతం పాడేందుకు ప్రతి ఆంధ్రుడు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రజాహిత పాలన అందించే మహాకూటమిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజాహిత పాలన ఇచ్చే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ మహాకూటమిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. రాయదుర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తన భార్య భారతితో కలిసి కమలం కండువా కప్పుకున్నారు. తణుకు మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ ముళ్లపూడి రేణుక, డాక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ దంపతులు, అమరావతి బోట్‌ క్లబ్‌ సీఈఓ తరుణ్ కాకానిలు దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ థావడే సమక్షంలో పార్టీలో చేరారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి పురందేశ్వరి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

మోదీ పాలన ప్రపంచ దేశాలకు ఆదర్శం: దగ్గుబాటి పురందేశ్వరి

ప్రధాని నరేంద్రమోదీ సుపరిపాలన, అవినీతిరహిత పాలన, దృఢమైన నిర్ణయాలు వంటి వాటికి ఆకర్షితులై ఎన్నికల సమయంలో చేరికలు జరుగుతున్నాయని పురందేశ్వరి అన్నారు. రాష్ట్రంలోనూ బీజేపీ బలపడాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీకి తమ సంఘీభావం తెలిపేందుకు వస్తున్నారన్నారు. 2019 నుంచి రాష్ట్రంలో దుష్టపాలన సాగుతోందని విమర్శించారు. ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో అందరికీ తెలుసునని, అవినీతి పెట్రేగిపోయిందని, విధ్వంసకర నిర్ణయంగా ప్రజావేదిక కూల్చివేతతోనే పాలన ప్రారంభించారని మండిపడ్డారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా మూడు రాజధానుల నిర్ణయం చేశారని ఆరోపించారు. ఏ వర్గంలోని వారికి అధికారంలోని రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయలేదని, అందుకే ప్రజలంతా మార్పును ఆకాంక్షిస్తున్నారని చెప్పారు.

బీజేపీలో చేరిన రాయదర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి

ప్రతి ఆంధ్రుడు వైఎస్సార్సీపీ అధికారంలో నుంచి గద్దె దింపేందుకు తమవంతుగా కృషి చేయాలని, దీంతోపాటు ఎన్నికల్లో జరగబోయే అవకతవకలపై ఒకింత అప్రమత్తంగా ఉండాలని పురందేశ్వరి కోరారు. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో దొంగ ఓటరు గుర్తింపు కార్డులతో ఏ విధంగా అధికారపక్షం గెలుపొందిందనే విషయాలను ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, అదే రకమైన దొంగ ఓట్ల సృష్టితో ఈసారి శాసనసభ ఎన్నికల్లోనూ లబ్ధిపొందాలని వైఎస్సార్సీపీ ఆలోచన చేస్తోందన్నారు. డీఎస్సీ రెండు పర్యాయాలు ప్రకటించి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, ఇప్పుడు ఎన్నికల ప్రకటన వేళ మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకు పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం తేదీలను నిర్ణయించడంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు లేఖ రాస్తామన్నారు. పది లక్షల మంది డీఎస్సీ అభ్యర్ధులు ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, అభ్యర్దుల తల్లిదండ్రులతో కలిపితే 40 లక్షల ఓట్లు ప్రభావితం కానున్నాయన్నారు.

బీజేపీ ఎదుగుతోంది.. కాంగ్రెస్‌ దిగజారుతోంది: కిరణ్​కుమార్​ రెడ్డి

రాష్ట్రాభివృద్ధి ఎక్కడి గొంగడి అక్కడే ఉందని, జాతీయ రహదారులు బాగున్నా, గ్రామాల్లోకి వెళ్లాలంటే రోడ్లు గతుకుల మయంగా ఉన్నాయని పురందేశ్వరి అన్నారు. ఆటో వారికి 10 వేల రూపాయలు ఇస్తున్నామంటున్న రాష్ట్ర ప్రభుత్వం, గతుకుల రోడ్లలో వెళ్తూ ఆటోలు, టాక్సీలు మరమ్మత్తులకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని, ఇంధనం తడిసిమోపెడు అవుతోందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా మహాకూటమి అభ్యర్ధులను గెలిపించాలని పురందేశ్వరి కోరారు. ఇందుకు రేపు బొప్పూడిలో ప్రధాని మోదీ పాల్గొనే మహాకూటమి తొలి బహిరంగ సభ ద్వారా ఎన్నికల శంఖం పూరించబోతున్నారని అన్నారు.

బీజేపీలో చేరిన ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ- ఆహ్వానించిన పురందేశ్వరి

Rayadurgam YSRCP MLA Kapu Ramachandra Reddy Join In BJP : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ దుష్టపాలనకు చరమగీతం పాడేందుకు ప్రతి ఆంధ్రుడు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రజాహిత పాలన అందించే మహాకూటమిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజాహిత పాలన ఇచ్చే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ మహాకూటమిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. రాయదుర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తన భార్య భారతితో కలిసి కమలం కండువా కప్పుకున్నారు. తణుకు మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ ముళ్లపూడి రేణుక, డాక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ దంపతులు, అమరావతి బోట్‌ క్లబ్‌ సీఈఓ తరుణ్ కాకానిలు దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ థావడే సమక్షంలో పార్టీలో చేరారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి పురందేశ్వరి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

మోదీ పాలన ప్రపంచ దేశాలకు ఆదర్శం: దగ్గుబాటి పురందేశ్వరి

ప్రధాని నరేంద్రమోదీ సుపరిపాలన, అవినీతిరహిత పాలన, దృఢమైన నిర్ణయాలు వంటి వాటికి ఆకర్షితులై ఎన్నికల సమయంలో చేరికలు జరుగుతున్నాయని పురందేశ్వరి అన్నారు. రాష్ట్రంలోనూ బీజేపీ బలపడాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీకి తమ సంఘీభావం తెలిపేందుకు వస్తున్నారన్నారు. 2019 నుంచి రాష్ట్రంలో దుష్టపాలన సాగుతోందని విమర్శించారు. ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో అందరికీ తెలుసునని, అవినీతి పెట్రేగిపోయిందని, విధ్వంసకర నిర్ణయంగా ప్రజావేదిక కూల్చివేతతోనే పాలన ప్రారంభించారని మండిపడ్డారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా మూడు రాజధానుల నిర్ణయం చేశారని ఆరోపించారు. ఏ వర్గంలోని వారికి అధికారంలోని రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయలేదని, అందుకే ప్రజలంతా మార్పును ఆకాంక్షిస్తున్నారని చెప్పారు.

బీజేపీలో చేరిన రాయదర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి

ప్రతి ఆంధ్రుడు వైఎస్సార్సీపీ అధికారంలో నుంచి గద్దె దింపేందుకు తమవంతుగా కృషి చేయాలని, దీంతోపాటు ఎన్నికల్లో జరగబోయే అవకతవకలపై ఒకింత అప్రమత్తంగా ఉండాలని పురందేశ్వరి కోరారు. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో దొంగ ఓటరు గుర్తింపు కార్డులతో ఏ విధంగా అధికారపక్షం గెలుపొందిందనే విషయాలను ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, అదే రకమైన దొంగ ఓట్ల సృష్టితో ఈసారి శాసనసభ ఎన్నికల్లోనూ లబ్ధిపొందాలని వైఎస్సార్సీపీ ఆలోచన చేస్తోందన్నారు. డీఎస్సీ రెండు పర్యాయాలు ప్రకటించి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, ఇప్పుడు ఎన్నికల ప్రకటన వేళ మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకు పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం తేదీలను నిర్ణయించడంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు లేఖ రాస్తామన్నారు. పది లక్షల మంది డీఎస్సీ అభ్యర్ధులు ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, అభ్యర్దుల తల్లిదండ్రులతో కలిపితే 40 లక్షల ఓట్లు ప్రభావితం కానున్నాయన్నారు.

బీజేపీ ఎదుగుతోంది.. కాంగ్రెస్‌ దిగజారుతోంది: కిరణ్​కుమార్​ రెడ్డి

రాష్ట్రాభివృద్ధి ఎక్కడి గొంగడి అక్కడే ఉందని, జాతీయ రహదారులు బాగున్నా, గ్రామాల్లోకి వెళ్లాలంటే రోడ్లు గతుకుల మయంగా ఉన్నాయని పురందేశ్వరి అన్నారు. ఆటో వారికి 10 వేల రూపాయలు ఇస్తున్నామంటున్న రాష్ట్ర ప్రభుత్వం, గతుకుల రోడ్లలో వెళ్తూ ఆటోలు, టాక్సీలు మరమ్మత్తులకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని, ఇంధనం తడిసిమోపెడు అవుతోందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా మహాకూటమి అభ్యర్ధులను గెలిపించాలని పురందేశ్వరి కోరారు. ఇందుకు రేపు బొప్పూడిలో ప్రధాని మోదీ పాల్గొనే మహాకూటమి తొలి బహిరంగ సభ ద్వారా ఎన్నికల శంఖం పూరించబోతున్నారని అన్నారు.

బీజేపీలో చేరిన ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ- ఆహ్వానించిన పురందేశ్వరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.