ETV Bharat / politics

వెనకదారి గుండా జగన్ రెడ్డి ఎంట్రీ - తడబడుతూ ప్రమాణస్వీకారం - Pulivendula MLA YS Jagan Oath

Pulivendula MLA YS Jagan Oath in Assembly: ఆంధ్రప్రదేశ్ శాసనసభ​ ఎన్నికల్లో ఘోరఓటమి తరువాత వైఎస్సార్సీపీ అధినేత అన్యమనస్కంగానే అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో తన పేరు ఉచ్ఛారణలో తడబడ్డారు. ప్రమాణ స్వీకారం మొదలైన అయిదు నిమిషాల తర్వాత శాసనసభ ప్రాంగణానికి జగన్ చేరుకున్నారు. ప్రమాణం చేసిన వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 3:29 PM IST

Updated : Jun 21, 2024, 3:46 PM IST

Pulivendula MLA YS Jagan Oath in Assembly
Jagan Reddy faltered in the Assembly (ETV Bharat)

Pulivendula MLA YS Jagan Oath in Assembly : సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం పొందిన తర్వాత వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్​రెడ్డి తొలిసారి తాడేపల్లి ప్యాలెస్‌ నివాసం నుంచి బయటకు వచ్చారు. అన్యమనస్కంగానే శాసనసభలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సమయంలోనూ నిస్తేజంగా కదిలారు. సభ్యునిగా తన పేరు ఉచ్ఛారణలో తడబడ్డారు.

శాసనసభలో సభ్యుల ప్రమాణ స్వీకార ఘట్టం మొదలైన ఐదు నిమిషాల తర్వాత కానీ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోని జగన్‌ వరుస క్రమంలో తన పేరు వచ్చేంత వరకు సభ లోపలికి రాలేదు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా సభ్యుల వైపు నమస్కారం చేసుకుంటూ ప్రోటెం స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లారు. మెట్లు ఎక్కుతూ తన వాచీలో సమయం చూసుకుంటూ మర్యాదపూర్వకంగా ప్రోటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరికి నమస్కారం చేశారు.

మొదటిసారి బయటకొచ్చింది ఇప్పుడే : తనదైన శైలిలో బుచ్చయ్యచౌదరి భుజం తట్టారు. సభ నుంచి శాసనసభలోని తన ఛాంబరుకు చేరుకున్నారు. తాడేపల్లి పేలస్‌ నుంచి ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి జగన్‌ బయటకొచ్చింది ఇప్పుడే. కేవలం ఓ గంటపాటు మాత్రమే ఉండి తిరిగి తన ప్యాలెస్‌లోకి వెళ్లిపోయారు. అధికారపక్షం మొత్తం చాలా హుందాగా జగన్‌ విషయంలో వ్యవహరించినా అటువైపు నుంచి ఏ మాత్రం కనీస మర్యాద పాటించలేదని సభ్యులు గుసగుసలాడుకున్నారు.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ఇతర సీనియర్‌ సభ్యుల వద్దకు వచ్చి ప్రత్యక్షంగా అభినందనలు తెలిపి ఉంటే బాగుండేదని, అలా కాకుండా అహంకార ధోరణిలోనే సాగారే తప్ప హుందాగా మెలగలేదని భావిస్తున్నారు. మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16వ శాసనసభ సమావేశాలు ఇవాళ ఉదయం 9.46 గంటలకు ప్రారంభమయ్యాయి.

ఆ తరువాత నేరుగా తాడేపల్లి ప్యాలస్‌కు : ప్రోటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ తర్వాత ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో ప్రమాణం చేసి సభలో కూర్చోకుండా ఎమ్మెల్యే జగన్ వెళ్లిపోయారు. పేరు పిలిచిన వెంటనే సభలోకి వచ్చారు.

నేరుగా పోడియం వద్దకు వెళ్లి ప్రమాణం చేసి సభలో కూర్చోకుండా వెళ్లిపోయారు. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఛాంబర్‌లోకి వెళ్లి కొద్దిసేపు వైసీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ తరువాత నేరుగా తాడేపల్లి ప్యాలస్‌కు వెళ్లిపోయారు. అసెంబ్లీ లోపలకి వచ్చి ప్రమాణం చేసేందుకు సమయం ఉండటంతో ఐదు నిమిషాల పాటు చివరి బెంచ్‌లో కూర్చున్నారు.

YS Jagan took oath in the Assembly : గత ప్రభుత్వంలోని డిప్యూటీ స్పీకర్ ఛాంబరులోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో జగన్ కూర్చుండిపోయారు. తన ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగు పెట్టారు. ఆయనతో పాటు పక్కనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూడా కూర్చొన్నారు. జగన్ పక్కనే పెద్దిరెడ్డి మిగతా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రమాణం చేసేందుకు వస్తున్న సమయంలో అందరికీ దండం పెడుతూ ఎమ్మెల్యేలు వెళ్లారు.

వేరే మార్గంలో సభకు : ఇదే సమయంలో సీఎం చంద్రబాబుకు కూడా జగన్ నమస్కరించడంతో ఆయన ప్రతి నమస్కారం చేశారు. ప్రమాణం చేసే సమయంలో తొలుత వైఎస్ జగన్మోహన్ అనే నేను అని పలికి ఆ తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని సవరించుకున్నారు. జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ వెనుక గేటు నుంచి శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు.

గతంలో సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి మందడం మీదుగా పరదాలు, భారీగా పోలీసు బలగాల మోహరింపు మధ్య సభకు వచ్చేవారు. కానీ ఈసారి రూటు మార్చి అమరావతి రైతుల శిబిరంవైపు రహదారి నుంచి కాకుండా వెనుక నుంచి శాసనసభకు చేరుకున్నారు. రాజధాని రైతులు ఎక్కడ నిరసన తెలుపుతారనే భావించి వేరే మార్గంలో సభకు వచ్చినట్లు తెలుస్తోంది.

Jagan Vehicle Allowed inside the Assembly Premises : జగన్‌ వ్యవహారశైలి ఏ విధంగా ఉన్నప్పటికీ అతనికి అగౌరవం కలిగేలా ప్రవర్తించరాదని తెలుగుదేశం శాసనసభ్యులకు చంద్రబాబు స్పష్టం చేయడమే కాకుండా జగన్ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణం లోపలకి అనుమతించాలని ఆదేశించారు. ప్రస్తుతం అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన సంఖ్యాబలం లేకపోవడంతో గేటు బయట దిగి కాలినడకనే లోపలకు రావాల్సి ఉంటుంది. ప్రతిపక్షం విషయంలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని చంద్రబాబు అసెంబ్లీకి బయల్దేరే ముందే ఎమ్మెల్యేలకు సూచించారు.

చిన్న చిన్న అంశాలను రాజకీయం చేయొద్దని, శాసనసభలో రాగద్వేషాలకు తావు ఇవ్వొద్దని ఆదేశించారు. జగన్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని తమకు స్పష్టం చేశారని, ఎలాంటి ఇబ్బందులు సృష్టించొద్దని చంద్రబాబు తమ ఎమ్మెల్యేలకు తెలియజేశారని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. కౌరవ సభ నుంచి గౌరవసభగా మారిన తరుణంలో అందుకు అనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయించారు.

ఓడిపోయిన తర్వాత జగన్ ఎలా ఉన్నారనేది చూడాలని ఎమ్మెల్యేలంతా ఎదురు చూశారని, తన రాజ్యం లాక్కున్నట్లు జగన్ భావిస్తున్నట్లు అతని ముఖ కవలికల్లో కనిపించిందని టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రకుమార్‌ వ్యాఖ్యానించారు. ప్రమాణ స్వీకార సమయంలో జగన్ మాటలు తడబడి పేరు కూడా తప్పుగా చదివారని, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీటులో కూర్చోకుండా ఇంత వరకూ ఏ ఎమ్మెల్యే వెళ్లిపోలేదని అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీ వెనక గేటు నుంచి వచ్చి ప్రమాణం చేసిన వైఎస్​ జగన్​

ముద్రగడ పద్మనాభరెడ్డి - పేరు మార్పుపై గెజిట్ నోటిఫికేషన్ - Mudragda Name Changed

Pulivendula MLA YS Jagan Oath in Assembly : సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం పొందిన తర్వాత వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్​రెడ్డి తొలిసారి తాడేపల్లి ప్యాలెస్‌ నివాసం నుంచి బయటకు వచ్చారు. అన్యమనస్కంగానే శాసనసభలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సమయంలోనూ నిస్తేజంగా కదిలారు. సభ్యునిగా తన పేరు ఉచ్ఛారణలో తడబడ్డారు.

శాసనసభలో సభ్యుల ప్రమాణ స్వీకార ఘట్టం మొదలైన ఐదు నిమిషాల తర్వాత కానీ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోని జగన్‌ వరుస క్రమంలో తన పేరు వచ్చేంత వరకు సభ లోపలికి రాలేదు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా సభ్యుల వైపు నమస్కారం చేసుకుంటూ ప్రోటెం స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లారు. మెట్లు ఎక్కుతూ తన వాచీలో సమయం చూసుకుంటూ మర్యాదపూర్వకంగా ప్రోటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరికి నమస్కారం చేశారు.

మొదటిసారి బయటకొచ్చింది ఇప్పుడే : తనదైన శైలిలో బుచ్చయ్యచౌదరి భుజం తట్టారు. సభ నుంచి శాసనసభలోని తన ఛాంబరుకు చేరుకున్నారు. తాడేపల్లి పేలస్‌ నుంచి ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి జగన్‌ బయటకొచ్చింది ఇప్పుడే. కేవలం ఓ గంటపాటు మాత్రమే ఉండి తిరిగి తన ప్యాలెస్‌లోకి వెళ్లిపోయారు. అధికారపక్షం మొత్తం చాలా హుందాగా జగన్‌ విషయంలో వ్యవహరించినా అటువైపు నుంచి ఏ మాత్రం కనీస మర్యాద పాటించలేదని సభ్యులు గుసగుసలాడుకున్నారు.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ఇతర సీనియర్‌ సభ్యుల వద్దకు వచ్చి ప్రత్యక్షంగా అభినందనలు తెలిపి ఉంటే బాగుండేదని, అలా కాకుండా అహంకార ధోరణిలోనే సాగారే తప్ప హుందాగా మెలగలేదని భావిస్తున్నారు. మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16వ శాసనసభ సమావేశాలు ఇవాళ ఉదయం 9.46 గంటలకు ప్రారంభమయ్యాయి.

ఆ తరువాత నేరుగా తాడేపల్లి ప్యాలస్‌కు : ప్రోటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ తర్వాత ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో ప్రమాణం చేసి సభలో కూర్చోకుండా ఎమ్మెల్యే జగన్ వెళ్లిపోయారు. పేరు పిలిచిన వెంటనే సభలోకి వచ్చారు.

నేరుగా పోడియం వద్దకు వెళ్లి ప్రమాణం చేసి సభలో కూర్చోకుండా వెళ్లిపోయారు. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఛాంబర్‌లోకి వెళ్లి కొద్దిసేపు వైసీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ తరువాత నేరుగా తాడేపల్లి ప్యాలస్‌కు వెళ్లిపోయారు. అసెంబ్లీ లోపలకి వచ్చి ప్రమాణం చేసేందుకు సమయం ఉండటంతో ఐదు నిమిషాల పాటు చివరి బెంచ్‌లో కూర్చున్నారు.

YS Jagan took oath in the Assembly : గత ప్రభుత్వంలోని డిప్యూటీ స్పీకర్ ఛాంబరులోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో జగన్ కూర్చుండిపోయారు. తన ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగు పెట్టారు. ఆయనతో పాటు పక్కనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూడా కూర్చొన్నారు. జగన్ పక్కనే పెద్దిరెడ్డి మిగతా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రమాణం చేసేందుకు వస్తున్న సమయంలో అందరికీ దండం పెడుతూ ఎమ్మెల్యేలు వెళ్లారు.

వేరే మార్గంలో సభకు : ఇదే సమయంలో సీఎం చంద్రబాబుకు కూడా జగన్ నమస్కరించడంతో ఆయన ప్రతి నమస్కారం చేశారు. ప్రమాణం చేసే సమయంలో తొలుత వైఎస్ జగన్మోహన్ అనే నేను అని పలికి ఆ తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని సవరించుకున్నారు. జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ వెనుక గేటు నుంచి శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు.

గతంలో సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి మందడం మీదుగా పరదాలు, భారీగా పోలీసు బలగాల మోహరింపు మధ్య సభకు వచ్చేవారు. కానీ ఈసారి రూటు మార్చి అమరావతి రైతుల శిబిరంవైపు రహదారి నుంచి కాకుండా వెనుక నుంచి శాసనసభకు చేరుకున్నారు. రాజధాని రైతులు ఎక్కడ నిరసన తెలుపుతారనే భావించి వేరే మార్గంలో సభకు వచ్చినట్లు తెలుస్తోంది.

Jagan Vehicle Allowed inside the Assembly Premises : జగన్‌ వ్యవహారశైలి ఏ విధంగా ఉన్నప్పటికీ అతనికి అగౌరవం కలిగేలా ప్రవర్తించరాదని తెలుగుదేశం శాసనసభ్యులకు చంద్రబాబు స్పష్టం చేయడమే కాకుండా జగన్ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణం లోపలకి అనుమతించాలని ఆదేశించారు. ప్రస్తుతం అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన సంఖ్యాబలం లేకపోవడంతో గేటు బయట దిగి కాలినడకనే లోపలకు రావాల్సి ఉంటుంది. ప్రతిపక్షం విషయంలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని చంద్రబాబు అసెంబ్లీకి బయల్దేరే ముందే ఎమ్మెల్యేలకు సూచించారు.

చిన్న చిన్న అంశాలను రాజకీయం చేయొద్దని, శాసనసభలో రాగద్వేషాలకు తావు ఇవ్వొద్దని ఆదేశించారు. జగన్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని తమకు స్పష్టం చేశారని, ఎలాంటి ఇబ్బందులు సృష్టించొద్దని చంద్రబాబు తమ ఎమ్మెల్యేలకు తెలియజేశారని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. కౌరవ సభ నుంచి గౌరవసభగా మారిన తరుణంలో అందుకు అనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయించారు.

ఓడిపోయిన తర్వాత జగన్ ఎలా ఉన్నారనేది చూడాలని ఎమ్మెల్యేలంతా ఎదురు చూశారని, తన రాజ్యం లాక్కున్నట్లు జగన్ భావిస్తున్నట్లు అతని ముఖ కవలికల్లో కనిపించిందని టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రకుమార్‌ వ్యాఖ్యానించారు. ప్రమాణ స్వీకార సమయంలో జగన్ మాటలు తడబడి పేరు కూడా తప్పుగా చదివారని, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీటులో కూర్చోకుండా ఇంత వరకూ ఏ ఎమ్మెల్యే వెళ్లిపోలేదని అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీ వెనక గేటు నుంచి వచ్చి ప్రమాణం చేసిన వైఎస్​ జగన్​

ముద్రగడ పద్మనాభరెడ్డి - పేరు మార్పుపై గెజిట్ నోటిఫికేషన్ - Mudragda Name Changed

Last Updated : Jun 21, 2024, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.