ETV Bharat / politics

పర్చూరు 'రా కదలిరా' సభకు అడ్డంకులు - అనుకున్న చోటే జరుగుతుందని టీడీపీ వెల్లడి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2024, 11:20 AM IST

Police Obstacles to Ra Kadali Ra: పర్చూరు 'రా కదిలిరా' సభకు పోలీసుల ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీస్ అధికారులతో జగన్ తన మార్కు రాజకీయానికి తెర లేపారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ధ్వజమెత్తారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా 17వ తేదీన అనుకున్న ప్రదేశంలోనే రా కదలిరా సభ జరుగుతుందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవి స్పష్టం చేశారు.

Police_Obstacles_to_Ra_Kadali_Ra
Police_Obstacles_to_Ra_Kadali_Ra

పర్చూరు 'రా కదలిరా' సభకు అడ్డంకులు - అనుకున్న చోటే సభ జరుగుతుందని టీడీపీ వెల్లడి

Police Obstacles to Ra Kadali Ra : బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన రా కదలిరా సభను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. బుధవారం ఉదయం సభ నిర్వహణ పనులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (Eluri Sambasivarao) ప్రారంభించారు. రాత్రి సమయంలో పోలీసులు సభాస్థలికి వచ్చి దేవాదాయశాఖ భూమిలో సభ నిర్వహిస్తున్నారని ఫిర్యాదు వచ్చినందున పనులు నిలిపేయాలని ఆదేశించారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరేందుకు పార్టీ నేతలు ప్రయత్నించినా అధికారులు స్పందించలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

వైఎస్సార్​సీపీ ప్రభుత్వంలో స్కీములన్నీ స్కాములే- వాలంటీర్లకు మేం వ్యతిరేకం కాదు : చంద్రబాబు

Ra Kadali Ra Meeting at Parchur : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ, ఇంకొల్లు-పావులూరు రహదారి పక్కన 30 ఎకరాల విస్తీర్ణంలో సభ నిర్వహించాలని నిర్ణయించారమని తెలిపారు. ఇందులో 19 ఎకరాలు దేవాదాయశాఖ భూమి ఉందని, మిగిలిన భూమి ప్రైవేటుదని, వారంతా అంగీకారం తెలిపారని గుర్తు చేశారు. దేవాదాయశాఖ భూమి 13 ఎకరాలను కౌలుకు సాగు చేసుకుంటున్న రైతు సభ నిర్వహణకు అంగీకారం తెలపడంతో ఆ స్థలంలో పనులు ప్రారంభించామని తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు రా కదలిరాసభ నిర్వహణకు అన్ని అనుమతులు కోరుతూ దరఖాస్తులు సైతం చేశామని తెలిపారు. చంద్రబాబు రాక కోసం హెలిప్యాడ్ అనుమతికి సైతం ఆర్ అండ్ బీ అధికారులకు దరఖాస్తు చేశామని అన్నారు. రాత్రి పోలీసులు పనులు నిలిపివేయాలంటూ హుకుం జారీ చేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

పోలీస్ అధికారులతో జగన్ తన మార్కు రాజకీయానికి తెర లేపారని ఏలూరి సాంబశివరావు ధ్వజమెత్తారు. లక్షలాది మందితో సభ నిర్వహిస్తున్నారని సభను భగ్నం చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రపన్నారని ఆరోపించారు. ప్రభుత్వ కుట్రలను మానుకోవాలని లేకుంటే ప్రజాక్షేత్రంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏర్పాట్లు పూర్తి అయిన తర్వాత సభను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

చింతలపూడి 'రా కదలిరా' సభాస్థలి వద్ద బాంబు స్క్వాడ్‌ తనిఖీలు

అనుకున్న చోటే సభ జరుగుతుంది : పర్చూరులో జరిగే రా కదలిరా సభను అడ్డుకోవాలని చూడడం పిరికి పంద చర్య అని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి (Gottipati Ravi) దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీల సభలను అడ్డుకోవాలని చూడడం దుర్మార్గమన్న ఆయన, సైకో ఇజానికి ఇది ఒక నిదర్శనమని అన్నారు. చంద్రబాబు ఇప్పటి వరకు 20 రా కదలిరా సభలు నిర్వహించారని, 21వ సభను పోలీసుల ద్వారా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన 17వ తేదీన అనుకున్న ప్రదేశంలోనే రా కదలిరా సభ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

గుడివాడలో "రా కదలి రా" బహిరంగ సభకు తరలుతున్న టీడీపీ శ్రేణులు- ఆంక్షలు విధిస్తున్న పోలీసులు

పర్చూరు 'రా కదలిరా' సభకు అడ్డంకులు - అనుకున్న చోటే సభ జరుగుతుందని టీడీపీ వెల్లడి

Police Obstacles to Ra Kadali Ra : బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన రా కదలిరా సభను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. బుధవారం ఉదయం సభ నిర్వహణ పనులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (Eluri Sambasivarao) ప్రారంభించారు. రాత్రి సమయంలో పోలీసులు సభాస్థలికి వచ్చి దేవాదాయశాఖ భూమిలో సభ నిర్వహిస్తున్నారని ఫిర్యాదు వచ్చినందున పనులు నిలిపేయాలని ఆదేశించారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరేందుకు పార్టీ నేతలు ప్రయత్నించినా అధికారులు స్పందించలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

వైఎస్సార్​సీపీ ప్రభుత్వంలో స్కీములన్నీ స్కాములే- వాలంటీర్లకు మేం వ్యతిరేకం కాదు : చంద్రబాబు

Ra Kadali Ra Meeting at Parchur : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ, ఇంకొల్లు-పావులూరు రహదారి పక్కన 30 ఎకరాల విస్తీర్ణంలో సభ నిర్వహించాలని నిర్ణయించారమని తెలిపారు. ఇందులో 19 ఎకరాలు దేవాదాయశాఖ భూమి ఉందని, మిగిలిన భూమి ప్రైవేటుదని, వారంతా అంగీకారం తెలిపారని గుర్తు చేశారు. దేవాదాయశాఖ భూమి 13 ఎకరాలను కౌలుకు సాగు చేసుకుంటున్న రైతు సభ నిర్వహణకు అంగీకారం తెలపడంతో ఆ స్థలంలో పనులు ప్రారంభించామని తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు రా కదలిరాసభ నిర్వహణకు అన్ని అనుమతులు కోరుతూ దరఖాస్తులు సైతం చేశామని తెలిపారు. చంద్రబాబు రాక కోసం హెలిప్యాడ్ అనుమతికి సైతం ఆర్ అండ్ బీ అధికారులకు దరఖాస్తు చేశామని అన్నారు. రాత్రి పోలీసులు పనులు నిలిపివేయాలంటూ హుకుం జారీ చేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

పోలీస్ అధికారులతో జగన్ తన మార్కు రాజకీయానికి తెర లేపారని ఏలూరి సాంబశివరావు ధ్వజమెత్తారు. లక్షలాది మందితో సభ నిర్వహిస్తున్నారని సభను భగ్నం చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రపన్నారని ఆరోపించారు. ప్రభుత్వ కుట్రలను మానుకోవాలని లేకుంటే ప్రజాక్షేత్రంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏర్పాట్లు పూర్తి అయిన తర్వాత సభను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

చింతలపూడి 'రా కదలిరా' సభాస్థలి వద్ద బాంబు స్క్వాడ్‌ తనిఖీలు

అనుకున్న చోటే సభ జరుగుతుంది : పర్చూరులో జరిగే రా కదలిరా సభను అడ్డుకోవాలని చూడడం పిరికి పంద చర్య అని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి (Gottipati Ravi) దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీల సభలను అడ్డుకోవాలని చూడడం దుర్మార్గమన్న ఆయన, సైకో ఇజానికి ఇది ఒక నిదర్శనమని అన్నారు. చంద్రబాబు ఇప్పటి వరకు 20 రా కదలిరా సభలు నిర్వహించారని, 21వ సభను పోలీసుల ద్వారా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన 17వ తేదీన అనుకున్న ప్రదేశంలోనే రా కదలిరా సభ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

గుడివాడలో "రా కదలి రా" బహిరంగ సభకు తరలుతున్న టీడీపీ శ్రేణులు- ఆంక్షలు విధిస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.