MLC Kavitha Reaction on Congress Indravelli Meeting : రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డిని యూటర్న్ సీఎం అని అనుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ఇప్పటికే తప్పులను తెలుసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, మలి దశ తెలంగాణ ఉద్యమంలో బలైన అమరవీరులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.500 గ్యాస్ సిలిండర్ కార్యక్రమానికి, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీని ఆహ్వానించడాన్ని ఆమె తప్పుబట్టారు. హామీల అమలుకు ఏ హోదా లేని ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ఇంకోసారి ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తే, నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ఈ మేరకు బంజారాహిల్స్లో ఆమె మాట్లాడారు.
ఫూలే విగ్రహ ఏర్పాటుపై అప్పటిలోగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావాలి : కవిత
MLC Kavitha Fire on Revanth Reddy : ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి సభలో వేలాది కుర్చీలు వేసి, భారీగా ఏర్పాట్లు చేశారని దీనికి ప్రభుత్వ నిధులు ఎందుకు ఉపయోగించుకున్నారని కవిత(MLC Kavitha) ప్రశ్నించారు. సభకు ఎంత ఖర్చు అయింది, అందులో కాంగ్రెస్ ఎంత చెల్లించిందని అడిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ఇవ్వలేదని ఆరోపించారు. మంత్రులు ఎస్కార్ట్లతో ఇతర రాష్ట్ర ఎమ్మెల్యేలను తీసుకెళ్లడం ప్రజాధనం వృథా కాదా అని నిలదీశారు.
నిజామాబాద్ లోక్సభ బరి నుంచి ఎమ్మెల్సీ కవిత ఔట్ - మరి ఎక్కడి నుంచి పోటీ అంటే?
"హామీల అమలుకు ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తున్నారు. ప్రియాంక గాంధీని ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిస్తే నిరసన తెలుపుతాం. ఝార్ఖండ్ ఎమ్మెల్యేలను ప్రభుత్వ ఖర్చుతో హైదరాబాద్లో పెట్టారు. పత్రికలకు ప్రకటనలు ఇవ్వనని రేవంత్ అన్నారు. వారానికి 2, 3 పత్రికా ప్రకటనలు ప్రభుత్వం తరఫున ఇస్తున్నారు. 22 కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చింది. బీఆర్ఎస్ను కుటుంబ పార్టీ అనే అర్హత కాంగ్రెస్కు లేదు."- కవిత, ఎమ్మెల్సీ
అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి మాకు ఆహ్వానం అందలేదు : ఎమ్మెల్సీ కవిత
Kavitha React on Phule Statue at Assembly : పూలే విగ్రహాన్ని పదేళ్లు తాను అడగలేదని కవిత స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పెట్టలేదని ఇప్పుడు పూలే విగ్రహాన్ని పెడతారా? పెట్టరా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద 12న మహాధర్నా చేస్తామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో బీసీ డిక్లరేషన్ అన్నారని, ఇప్పుడు అదేం అయిందని నిలదీశారు. బీసీలకు న్యాయం జరగాలంటే తక్షణమే బీసీ జనగణన ప్రారంభించాలని, బడ్జెట్లో బీసీలకు రూ.25 వేల కోట్లు పెట్టాలని సూచించారు. నిజామాబాద్లో పోటీ చేసే విషయంపై పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది : కల్వకుంట్ల కవిత