ETV Bharat / politics

ఖమ్మం జిల్లాలో మొత్తం భూమికి నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం : మంత్రి తుమ్మల - TUMMALA ON IRRIGATION WATER

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 13, 2024, 2:14 PM IST

Updated : Aug 13, 2024, 2:22 PM IST

Minister Tummala on Latest News : రుణమాఫీ ప్రక్రియ పూర్తికాక ముందే బీఆర్​ఎస్​ నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. బీఆర్​ఎస్​ పాలనలో ఎంత మంది రుణమాఫీ కాని రైతులు ఉన్నారో ఆ పార్టీ నేతలు చెప్పాలని డిమాండ్​ చేశారు. అవసరమైతే నిధులు పెంచి రైతులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Minister Tummala Nageswara Rao on BRS
Minister Tummala on Rythu Runa Mafi (ETV Bharat)

Minister Tummala Nageswara Rao on BRS : రుణమాఫీ ప్రక్రియ పూర్తికాకుండానే బీఆర్​ఎస్​ నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. రూ.2 లక్షల రుణమాఫీకి ఇప్పటికే రూ.31 వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ పాలనలో రుణమాఫీ కాని రైతుల సంఖ్య గురించి ఆ పార్టీ నేతలు మాట్లాడాలని డిమాండ్​ చేశారు. అవసరమైతే నిధులు పెంచి రైతులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్​ కట్టిన సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ గొప్పలకు పోతోందని హరీశ్​రావు చేసిన విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్షం నిజాయతీగా, మంచి సలహాలు ఇవ్వాలని కోరారు.

తుమ్మల 45 ఏళ్ల రాజకీయ జీవితం : తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను పడిన అవమానాలు చెప్పదలుచుకున్నాని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. శ్రీరాముడు, ఖమ్మం జిల్లా ప్రజల దయవల్ల ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. ఎన్టీఆర్‌ కాలం నుంచి మంత్రిగా ఉంటూ జిల్లాకు మేలు చేయడానికి ప్రయత్నించానని చెప్పారు. ఖమ్మం జిల్లా నుంచే గోదావరి పారుతున్నా ఆ జలాలు ఈ నేలను పూర్తిగా తడపలేదని, జిల్లాలో మొత్తం భూమికి నీళ్లు ఇవ్వాలనేది తన సంకల్పమని వెల్లడించారు. తాను మంత్రిగా ఉన్న ప్రతిసారి సీఎంలతో మాట్లాడి జిల్లాకు మంచి చేయడానికి ప్రయత్నించానని పేర్కొన్నారు.

నీళ్ల కోసమే కాంగ్రెస్​లోకి : సత్తుపల్లి, జూలూరుపాడు, వేలేరు ప్రాంతాలకు కూడా నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఖమ్మం జిల్లా రైతులకు నీళ్ల కోసమే గతంలో పార్టీ మారినట్లు తెలిపారు. గత ప్రభుత్వం పలు ప్రాజెక్టుల పనులను పట్టించుకోలేదని విమర్శించారు. రాహుల్‌గాంధీ కోరిక మేరకు ఈసారి కాంగ్రెస్‌లోకి వచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్‌లోకి వచ్చేటప్పుడు కూడా ప్రాజెక్టులు పూర్తి చేయాలని అడిగాను అని తెలిపారు. మంత్రిని కాగానే సత్తుపల్లి టన్నెల్‌ పనులు ప్రారంభించానని గుర్తు చేశారు.

'గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పదేళ్లల్లో ఈ ఘటనలు మీకు కనిపించలేదా? హాస్టల్​ల్లో కనీస సౌకర్యాలు లేకుండా ఏర్పాటు చేసి ఓదార్చుతారా ? దానికి మా ప్రభుత్వం కారణమా? గత సంవత్సరంలోనే సాగర్​ కింద నీళ్లు ఇవ్వకుండా చేశారు. మీరు చేయని రుణమాఫీ గురించి వాట్సాప్​ చేయండి. మీ పాలనలో రుణమాఫీ కాని వాళ్లను అడగండి'- తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి

ఈ నెల 15న మూడో విడత రుణమాఫీ : మంత్రి తుమ్మల - Tummala Comments On loan waiver

'15లోపు సీతారామ ప్రాజెక్ట్​ పనులు పూర్తి చేసి - సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు' - Tummala on Sitarama Project Start

Minister Tummala Nageswara Rao on BRS : రుణమాఫీ ప్రక్రియ పూర్తికాకుండానే బీఆర్​ఎస్​ నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. రూ.2 లక్షల రుణమాఫీకి ఇప్పటికే రూ.31 వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ పాలనలో రుణమాఫీ కాని రైతుల సంఖ్య గురించి ఆ పార్టీ నేతలు మాట్లాడాలని డిమాండ్​ చేశారు. అవసరమైతే నిధులు పెంచి రైతులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్​ కట్టిన సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ గొప్పలకు పోతోందని హరీశ్​రావు చేసిన విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్షం నిజాయతీగా, మంచి సలహాలు ఇవ్వాలని కోరారు.

తుమ్మల 45 ఏళ్ల రాజకీయ జీవితం : తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను పడిన అవమానాలు చెప్పదలుచుకున్నాని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. శ్రీరాముడు, ఖమ్మం జిల్లా ప్రజల దయవల్ల ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. ఎన్టీఆర్‌ కాలం నుంచి మంత్రిగా ఉంటూ జిల్లాకు మేలు చేయడానికి ప్రయత్నించానని చెప్పారు. ఖమ్మం జిల్లా నుంచే గోదావరి పారుతున్నా ఆ జలాలు ఈ నేలను పూర్తిగా తడపలేదని, జిల్లాలో మొత్తం భూమికి నీళ్లు ఇవ్వాలనేది తన సంకల్పమని వెల్లడించారు. తాను మంత్రిగా ఉన్న ప్రతిసారి సీఎంలతో మాట్లాడి జిల్లాకు మంచి చేయడానికి ప్రయత్నించానని పేర్కొన్నారు.

నీళ్ల కోసమే కాంగ్రెస్​లోకి : సత్తుపల్లి, జూలూరుపాడు, వేలేరు ప్రాంతాలకు కూడా నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఖమ్మం జిల్లా రైతులకు నీళ్ల కోసమే గతంలో పార్టీ మారినట్లు తెలిపారు. గత ప్రభుత్వం పలు ప్రాజెక్టుల పనులను పట్టించుకోలేదని విమర్శించారు. రాహుల్‌గాంధీ కోరిక మేరకు ఈసారి కాంగ్రెస్‌లోకి వచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్‌లోకి వచ్చేటప్పుడు కూడా ప్రాజెక్టులు పూర్తి చేయాలని అడిగాను అని తెలిపారు. మంత్రిని కాగానే సత్తుపల్లి టన్నెల్‌ పనులు ప్రారంభించానని గుర్తు చేశారు.

'గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పదేళ్లల్లో ఈ ఘటనలు మీకు కనిపించలేదా? హాస్టల్​ల్లో కనీస సౌకర్యాలు లేకుండా ఏర్పాటు చేసి ఓదార్చుతారా ? దానికి మా ప్రభుత్వం కారణమా? గత సంవత్సరంలోనే సాగర్​ కింద నీళ్లు ఇవ్వకుండా చేశారు. మీరు చేయని రుణమాఫీ గురించి వాట్సాప్​ చేయండి. మీ పాలనలో రుణమాఫీ కాని వాళ్లను అడగండి'- తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి

ఈ నెల 15న మూడో విడత రుణమాఫీ : మంత్రి తుమ్మల - Tummala Comments On loan waiver

'15లోపు సీతారామ ప్రాజెక్ట్​ పనులు పూర్తి చేసి - సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు' - Tummala on Sitarama Project Start

Last Updated : Aug 13, 2024, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.