ETV Bharat / politics

రాజకీయ మనుగడ కాపాడుకునేందుకు - ప్రతిపక్షాలు పడుతున్న పాట్లు చూస్తే జాలేస్తోంది : తుమ్మల - Tummala On Opposition Parties

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 18, 2024, 8:00 PM IST

Updated : Aug 18, 2024, 8:18 PM IST

Minister Tummala On Opposition Parties : రైతు రుణమాఫీ విషయంలో విపక్షాలు చేస్తోన్న విమర్శలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి ప్రతిపక్ష నేతలు అనేక విన్యాసాలు చేస్తూ సోషల్‌ మీడియా సాక్షిగా రైతాంగాన్ని అసత్య ప్రచారాలతో ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

Minister Tummala Comments on BRS
Minister Tummala On Opposition Parties (ETV Bharat)

Minister Tummala Fires On Opposition Parties : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. తమ రాజకీయ మనుగడ కాపాడుకొనేందుకు పడుతున్న పాట్లు చూస్తే జాలేస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి ప్రతిపక్ష నేతలు అనేక విన్యాసాలు చేస్తూ సోషల్‌ మీడియా సాక్షిగా రైతాంగాన్ని అసత్య ప్రచారాలతో ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

ఒకరేమో లక్ష మాఫీ చేయడానికే ఆపసోపాలు పడి, చివరికి సగం మందికి కూడా చెయ్యలేక రైతుల నమ్మకం కోల్పోయిన వారు, ఇంకొకరు తాము అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇప్పటిదాకా రుణమాఫీ పథకం ఆలోచనే చెయ్యని వారు వీరిద్దరూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి పంటలోపే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి, ఇంకా ప్రక్రియ కొనసాగుతుండగానే ఎటూ పాలుపోక కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మంత్రి ధ్వజమెత్తారు.

కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా చెల్లిస్తాం : బ్యాంకుల నుంచి అందిన ప్రతి ఖాతాదారునికి వారి అర్హతను బట్టి మాఫీ చేసే బాధ్యత తమ ప్రభుతానిదని స్పష్టం చేశారు. ఇప్పటికి కేవలం రూ.2 లక్షల వరకు కుటుంబ నిర్ధారణ జరిగిన ఖాతాదారులందరికీ పథకాన్ని వర్తింప చేశామని తుమ్మల వెల్లడించారు. అలాగే రూ.2 లక్షల లోపు మిగిలి ఉన్న ఖాతాలకు కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా చెల్లిస్తామని మంత్రి తెలిపారు. బ్యాంకర్ల నుంచి వచ్చిన డేటాలో తప్పుగా వివరాలు ఉన్న రైతుల వివరాలను కూడా వారి వద్ద నుంచి సేకరిస్తున్నామన్నారు.

రుణమాఫీ పొందిన రైతులకు తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయాల్సిందిగా బ్యాంకర్లను కోరినట్లు పేర్కొన్నారు. అందరికి సమాచారం కోసం గత ప్రభుత్వ నిర్వాకాలు, ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా రుణమాఫీ వివరాలు అందిస్తున్నామని తెలిపారు. కనీసం గత ప్రభుత్వ పెద్దలు తాము అధికారంలో ఉన్నప్పుడు అరకొరగా అమలు చేసిన రుణమాఫీతో ప్రయోజనం ఏ మేరకు జరిగిందో ఆత్మపరిశీలన చేసుకొని, ఇకనైనా హుందాగా ప్రవర్తించి ప్రజల్లో తమ స్థాయిని కాపాడుకుంటారని ఆశిస్తున్నట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.31,000 కోట్లు నిధులు కేటాయించుకొని, గత ప్రభుత్వ పెద్దల నిర్వాకంతో చిన్నాభిన్నం చేసిన ఆర్థిక పరిస్థితుల్లోనూ ఆగస్టు 15లోపు రూ.18,000 కోట్లతో రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేసిన ప్రభుత్వంతో సవాళ్లా అని ధ్వజమెత్తారు.

ఖమ్మం జిల్లాలో మొత్తం భూమికి నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం : మంత్రి తుమ్మల - TUMMALA ON IRRIGATION WATER

రైతు రుణమాఫీపై రాజకీయ నేతల మాటలయుద్ధం - ప్రతిపక్షానికి మంత్రుల కౌంటర్ - Telangana crop loan 2024

Minister Tummala Fires On Opposition Parties : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. తమ రాజకీయ మనుగడ కాపాడుకొనేందుకు పడుతున్న పాట్లు చూస్తే జాలేస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి ప్రతిపక్ష నేతలు అనేక విన్యాసాలు చేస్తూ సోషల్‌ మీడియా సాక్షిగా రైతాంగాన్ని అసత్య ప్రచారాలతో ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

ఒకరేమో లక్ష మాఫీ చేయడానికే ఆపసోపాలు పడి, చివరికి సగం మందికి కూడా చెయ్యలేక రైతుల నమ్మకం కోల్పోయిన వారు, ఇంకొకరు తాము అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇప్పటిదాకా రుణమాఫీ పథకం ఆలోచనే చెయ్యని వారు వీరిద్దరూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి పంటలోపే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి, ఇంకా ప్రక్రియ కొనసాగుతుండగానే ఎటూ పాలుపోక కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మంత్రి ధ్వజమెత్తారు.

కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా చెల్లిస్తాం : బ్యాంకుల నుంచి అందిన ప్రతి ఖాతాదారునికి వారి అర్హతను బట్టి మాఫీ చేసే బాధ్యత తమ ప్రభుతానిదని స్పష్టం చేశారు. ఇప్పటికి కేవలం రూ.2 లక్షల వరకు కుటుంబ నిర్ధారణ జరిగిన ఖాతాదారులందరికీ పథకాన్ని వర్తింప చేశామని తుమ్మల వెల్లడించారు. అలాగే రూ.2 లక్షల లోపు మిగిలి ఉన్న ఖాతాలకు కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా చెల్లిస్తామని మంత్రి తెలిపారు. బ్యాంకర్ల నుంచి వచ్చిన డేటాలో తప్పుగా వివరాలు ఉన్న రైతుల వివరాలను కూడా వారి వద్ద నుంచి సేకరిస్తున్నామన్నారు.

రుణమాఫీ పొందిన రైతులకు తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయాల్సిందిగా బ్యాంకర్లను కోరినట్లు పేర్కొన్నారు. అందరికి సమాచారం కోసం గత ప్రభుత్వ నిర్వాకాలు, ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా రుణమాఫీ వివరాలు అందిస్తున్నామని తెలిపారు. కనీసం గత ప్రభుత్వ పెద్దలు తాము అధికారంలో ఉన్నప్పుడు అరకొరగా అమలు చేసిన రుణమాఫీతో ప్రయోజనం ఏ మేరకు జరిగిందో ఆత్మపరిశీలన చేసుకొని, ఇకనైనా హుందాగా ప్రవర్తించి ప్రజల్లో తమ స్థాయిని కాపాడుకుంటారని ఆశిస్తున్నట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.31,000 కోట్లు నిధులు కేటాయించుకొని, గత ప్రభుత్వ పెద్దల నిర్వాకంతో చిన్నాభిన్నం చేసిన ఆర్థిక పరిస్థితుల్లోనూ ఆగస్టు 15లోపు రూ.18,000 కోట్లతో రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేసిన ప్రభుత్వంతో సవాళ్లా అని ధ్వజమెత్తారు.

ఖమ్మం జిల్లాలో మొత్తం భూమికి నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం : మంత్రి తుమ్మల - TUMMALA ON IRRIGATION WATER

రైతు రుణమాఫీపై రాజకీయ నేతల మాటలయుద్ధం - ప్రతిపక్షానికి మంత్రుల కౌంటర్ - Telangana crop loan 2024

Last Updated : Aug 18, 2024, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.