KTR on BC Students Education in Foreign : బీసీ బిడ్డలకు విదేశీ విద్య అందని ద్రాక్షేనా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నాడు కేసీఆర్తో సాధ్యమని, నేడు అసాధ్యమని పేర్కొన్నారు. పేద విద్యార్థులతో సర్కార్ చెలగాటం అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జ్యోతిబా పులే విదేశీ విద్య పథకానికి కాంగ్రెస్ తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. ముగుస్తున్న కోర్సులు, అప్పుల్లో తల్లిదండ్రులు, సాగదిస్తున్న అధికారులు అంటూ విమర్శించారు. దరఖాస్తు చేసుకుని ఏడాది అవుతున్నా ఎందుకు ఇంత నిర్లక్ష్యమని నిలదీశారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్ తక్షణం జాబితా ప్రకటించి ఉపకార వేతనం రిలీజ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.
బిసి బిడ్డలకు విదేశి విద్య అందని ద్రాక్షేనా? నాడు KCRతో సాధ్యం నేడు అసాధ్యం-పేద విద్యార్థులతో సర్కార్ చెలగాటం
— KTR (@KTRBRS) October 9, 2024
జ్యోతిబా పులే విదేశి విద్య పథకానికి కాంగ్రెస్ తూట్లు పొడుస్తుంది
ముగుస్తున్న కోర్సులు-అప్పుల్లో తల్లిదండ్రులు-సాగదిస్తున్న అధికారులు
దరఖాస్తు చేసుకుని ఏడాది అవుతున్నా… pic.twitter.com/Kc1mO09Lc2
Rahul Ji,
— KTR (@KTRBRS) October 9, 2024
Youth in Ashok Nagar are waiting to thank you for delivering on “2 lakh Jobs in 1 year”
Also thank you for the 5 lakh “Yuva Vikasam” assistance & revamp of TSPSC
Welcome back to Hyderabad to meet with the youngsters since your guarantee is done https://t.co/LJbagV2Kka
రాహుల్ జీ అశోక్ నగర్లో యువత ఎదురుచూస్తున్నారు : అశోక్ నగర్లోని యువత ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అందించినందుకు ధన్యవాదాలు తెలిపేందుకు ఎదురుచూస్తున్నారని రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన రాహుల్ జీ అంటూ ఎక్స్లో ట్వీట్ చేస్తూ విమర్శలు చేశారు. అలాగే టీజీపీఎస్సీ 5 లక్షల యువ వికాసం సహాయం, పునరుద్ధరణకు ధన్యవాదాలు తెలిపారు. మీరు( రాహుల్ గాంధీ)ఇచ్చిన హామీ పూర్తయినందున యువకులను కలవడానికి తిరిగి హైదరాబాద్కు స్వాగతం అంటూ విమర్శనాత్మకంగా పోస్టు చేశారు.
మూసీ ప్రాజెక్టు కన్సల్టెంట్ ఎంపిక వివరాలు ఇవ్వండి : మూసీ ప్రాజెక్టు కన్సల్టెంట్ ఎంపిక వివరాలు ఇవ్వాలని కేటీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిని కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రూ.165 కోట్ల ప్రజాధనం చెల్లించే కన్సల్టెంట్ ఆర్ఎఫ్పీ, ఆర్ఎఫ్క్యూ ఎంపిక వివరాలు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి స్పందన కరువైతే ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసి ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని హెచ్చరించారు.