ETV Bharat / politics

మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి - Bhatti On Khammam Developments

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 30, 2024, 9:56 PM IST

Deputy CM Bhatti On Khammam Developments : రాష్ట్ర సమగ్రాభివృద్ధి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో బీటీ రోడ్డు పనులకు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈక్రమంలో మాట్లాడిన భట్టి, మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం, సంపదను ప్రజలకు పంచుతామని తెలిపారు.

Deputy CM Bhatti Lay Foundation Stone for BT Roads
Deputy CM Bhatti On Khammam Developments (ETV Bharat)

Deputy CM Bhatti Lay Foundation Stone for BT Roads : రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్​ను ప్రారంభించిన అనంతరం మధిర నియోజకవర్గంలోని చింతకాని, మధిర మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు. రాష్ట్ర సంపద రాష్ట్ర ప్రజలకు చెందాలని తమ ప్రభుత్వం ఈ గ్యారంటీలను తీసుకువచ్చింది ఉద్ఘాటించారు. గత దశాబ్ద పాలనలో అప్పుల పాలైన తెలంగాణను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తున్నామని చెప్పారు.

మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం : సంపదను సృష్టించి, సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతామన్నారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఆర్థికంగా ఎదగడానికి క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అప్పగించామన్నారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయబోతున్న మీ సేవ సెంటర్ల నిర్వహణ కూడా మహిళలకు అప్పజెప్తామని చెప్పారు.

మహిళలు ఆర్థిక స్వావలంబన కొరకై తమ ప్రభుత్వం మహిళ స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తుందని వివరించారు. చింత‌కాని మండ‌లం చేరుకొని రూ.175 ల‌క్ష‌ల‌తో గాంధీన‌గ‌ర్ నుంచి బొప్పారం వ‌ర‌కు రోడ్డు ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఆ త‌రువాత మ‌ధిర మండ‌లం వంగ‌వీడు గ్రామానికి చేరుకొని రూ. 30 కోట్ల‌తో బోన‌క‌ల్లు- అల్లపాడు- వంగ‌వీడు గ్రామాల వరకు బీటీ రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు.

Deputy CM Bhatti On Khammam Developments : చిలుకూరు గ్రామాంలోని శివాల‌యం వ‌ద్ద రూ.70 ల‌క్ష‌ల‌తో రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు, రూ.285 ల‌క్ష‌ల‌తో చిలుకూరు నుంచి దొడ్డ‌దేవ‌ర‌పాడు బీటీ రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. మధిర మండ‌లం మ‌ర్ల‌పాడు గ్రామానికి చేరుకొని. రూ.275 ల‌క్ష‌ల‌తో మ‌ర్ల‌పాడు నుంచి పెనుగొల‌ను-సిద్దినేని గూడెం వ‌ర‌కు బీటీ రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు.

అనంతరం మాటూరు గ్రామానికి చేరుకొని రూ.500 ల‌క్ష‌ల‌తో మాటూరు నుంచి ముస్లిం కాల‌నీ రోడ్డు ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసి, తరువాత స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దారి పొడవున ఆయా గ్రామాల ప్రజలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘనంగా స్వాగతం పలికారు.

రామగుండంలో ఆధునిక థర్మల్ పవర్ స్టేషన్ - ఎన్నికల హామీని పూర్తి చేస్తామన్న డిప్యూటీ సీఎం

'కేంద్ర సర్కార్​ పన్ను విధానంతో రాష్ట్రాల ఆదాయానికి గండి - సర్‌ ఛార్జీలు, సెస్‌లు 10 శాతానికి మించకూడదు' - Union Budget Preparatory Meeting

Deputy CM Bhatti Lay Foundation Stone for BT Roads : రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్​ను ప్రారంభించిన అనంతరం మధిర నియోజకవర్గంలోని చింతకాని, మధిర మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు. రాష్ట్ర సంపద రాష్ట్ర ప్రజలకు చెందాలని తమ ప్రభుత్వం ఈ గ్యారంటీలను తీసుకువచ్చింది ఉద్ఘాటించారు. గత దశాబ్ద పాలనలో అప్పుల పాలైన తెలంగాణను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తున్నామని చెప్పారు.

మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం : సంపదను సృష్టించి, సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతామన్నారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఆర్థికంగా ఎదగడానికి క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అప్పగించామన్నారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయబోతున్న మీ సేవ సెంటర్ల నిర్వహణ కూడా మహిళలకు అప్పజెప్తామని చెప్పారు.

మహిళలు ఆర్థిక స్వావలంబన కొరకై తమ ప్రభుత్వం మహిళ స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తుందని వివరించారు. చింత‌కాని మండ‌లం చేరుకొని రూ.175 ల‌క్ష‌ల‌తో గాంధీన‌గ‌ర్ నుంచి బొప్పారం వ‌ర‌కు రోడ్డు ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఆ త‌రువాత మ‌ధిర మండ‌లం వంగ‌వీడు గ్రామానికి చేరుకొని రూ. 30 కోట్ల‌తో బోన‌క‌ల్లు- అల్లపాడు- వంగ‌వీడు గ్రామాల వరకు బీటీ రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు.

Deputy CM Bhatti On Khammam Developments : చిలుకూరు గ్రామాంలోని శివాల‌యం వ‌ద్ద రూ.70 ల‌క్ష‌ల‌తో రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు, రూ.285 ల‌క్ష‌ల‌తో చిలుకూరు నుంచి దొడ్డ‌దేవ‌ర‌పాడు బీటీ రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. మధిర మండ‌లం మ‌ర్ల‌పాడు గ్రామానికి చేరుకొని. రూ.275 ల‌క్ష‌ల‌తో మ‌ర్ల‌పాడు నుంచి పెనుగొల‌ను-సిద్దినేని గూడెం వ‌ర‌కు బీటీ రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు.

అనంతరం మాటూరు గ్రామానికి చేరుకొని రూ.500 ల‌క్ష‌ల‌తో మాటూరు నుంచి ముస్లిం కాల‌నీ రోడ్డు ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసి, తరువాత స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దారి పొడవున ఆయా గ్రామాల ప్రజలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘనంగా స్వాగతం పలికారు.

రామగుండంలో ఆధునిక థర్మల్ పవర్ స్టేషన్ - ఎన్నికల హామీని పూర్తి చేస్తామన్న డిప్యూటీ సీఎం

'కేంద్ర సర్కార్​ పన్ను విధానంతో రాష్ట్రాల ఆదాయానికి గండి - సర్‌ ఛార్జీలు, సెస్‌లు 10 శాతానికి మించకూడదు' - Union Budget Preparatory Meeting

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.